ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రపంచంలోని వివిధ సంస్కృతులను గౌరవించాలని స్పష్టం చేసే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
29 JUN 2026 10:43AM by PIB Hyderabad
‘‘దేశాచారాన్ సమయాజ్జాతిధర్మాన్ బుభూషతే యస్తు పరావరజ్ఞః స తత్ర తత్రాధిగతః సదైవ్ మహాజనస్యాధిపత్యం కరోతి’’ అనే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
ప్రపంచంలో వివిధ సంస్కృతులను గౌరవించినప్పుడు ప్రజల మధ్య విశ్వాసం, సహకార భావన పెంపొందడంతో పాటు పరస్పర అవగాహన, సోదర భావం పెరుగుతాయని ఈ సుభాషితం స్పష్టం చేస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
ప్రపంచంలో వేర్వేరు సంస్కృతులను గౌరవించడం వల్ల ప్రజల మధ్య విశ్వాసంతో పాటు సహకార భావన పెంపొందుతుంది.
దీంతో పరస్పర అవగాహన, సోదర భావం మరింత పటిష్ఠమవుతాయి.
‘‘దేశాచారాన్ సమయాజ్జాతిధర్మాన్ బుభూషతే యస్తు పరావరజ్ఞః
స తత్ర తత్రాధిగతః సదైవ్ మహాజనస్యాధిపత్యం కరోతి’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2278796)
సందర్శకుల సూచీ సంఖ్య : : 51
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam