ప్రధాన మంత్రి కార్యాలయం
బంకిం చంద్ర చటోపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి నివాళులు
प्रविष्टि तिथि:
26 JUN 2026 12:50PM by PIB Hyderabad
మహనీయుడైన బంకిం చంద్ర ఛటోపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఆయన రచనలు తరతరాల భారతీయ ప్రజల్లో దేశభక్తిని, సాంస్కృతిక గర్వాన్ని రగిలించాయని అన్నారు. ఒక మహోన్నత సాహిత్యవేత్తగా ఆయనను ప్రధానమంత్రి స్మరించుకున్నారు.
ఈ సంవత్సరం (2026) ప్రత్యేక ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ... భారత్ ప్రస్తుతం ‘వందేమాతరం’ గేయం 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. బంకిం చంద్ర ఛటోపాధ్యాయ వందేమాతరం ద్వారా భారత స్వాతంత్య్ర ఉద్యమానికి, యావత్ దేశానికి ఒక శాశ్వతమైన, అత్యంత శక్తిమంతమైన స్ఫూర్తిని బహుమతిగా ఇచ్చారని ప్రధాని శ్రీ మోదీ కొనియాడారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
మహోన్నత సాహితీవేత్త బంకిం చంద్ర ఛటోపాధ్యాయ జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు.
సాహిత్య దిగ్గజంగా నిలిచిన ఆయన రచనలు, తరతరాల భారతీయుల్లో దేశభక్తిని, సాంస్కృతిక గర్వభావనను రగిలించాయి. ఆయన అందించిన గొప్ప సాహిత్య సంపద ప్రజల ఆలోచనలకు వెలుగునిస్తూనే ఉంది. దేశ నిర్మాణ దిశగా మన సామూహిక సంకల్పాన్ని బలోపేతం చేస్తూనే ఉంది.
మనం ‘వందేమాతరం’ గేయం 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న విశేష సమయం ఇది. వందేమాతరం ద్వారా ఆయన మన స్వాతంత్య్ర ఉద్యమానికి, యావత్ దేశానికి ఎన్నటికీ చెరిగిపోని ఒక గొప్ప స్ఫూర్తిని బహుమతిగా ఇచ్చారు’’ .
***
(रिलीज़ आईडी: 2278329)
आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam