రక్షణ మంత్రిత్వ శాఖ
మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ అర్జన్ సింగ్ మెమోరియల్ హాకీ టోర్నమెంట్ జూన్ 23, 2026న 7వ ప్రారంభోత్సవం
प्रविष्टि तिथि:
23 JUN 2026 2:44PM by PIB Hyderabad
మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ అర్జన్ సింగ్ డీఎఫ్సీ 107వ జయంతిని పురస్కరించుకుని, 7వ మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ అర్జన్ సింగ్ మెమోరియల్ హాకీ టోర్నమెంట్-2026ను ఎయిర్ ఫోర్స్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు నిర్వహిస్తోంది. ఈ టోర్నమెంట్ జూన్ 23 నుంచి జూలై 03, 2026 వరకు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ జలహళ్లిలో జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి.
జూన్ 23, 2026న ఎయిర్ ఫోర్స్ జలహళ్లిలోని హాకీ మైదానంలో ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకను ఎయిర్ మార్షల్ ఎస్. శివకుమార్, వీఎస్ఎం, ఎయిర్ ఆఫీసర్- ఇన్-ఛార్జ్ అడ్మినిస్ట్రేషన్ (ఏఓఏ) ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్రారంభించారు.
ఈ టోర్నమెంట్ తొలి మ్యాచ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ దక్షిణ కమాండ్ బెంగళూరు జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జట్టు 2-0 తేడాతో విజయం సాధించింది. అగ్నివీర్ వినాయక్ సంతోష్ హాండే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యారు. ఆయనకు రూ. 25,000 నగదు బహుమతి చెక్కును ముఖ్య అతిథి అందజేశారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ.. "దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ అర్జన్ సింగ్ మెమోరియల్ హాకీ టోర్నమెంట్తో మేం మళ్లీ మీ ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ టోర్నమెంట్ దేశంలోని అత్యుత్తమ హాకీ జట్లకు అద్భుతమైన వేదికను అందిస్తుంది. ఈ టోర్నమెంట్ ఎలాంటి ఆటంకాలు లేకుండా, సజావుగా, విజయవంతంగా సాగేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శాయశక్తులా కృషి చేస్తోంది" అని తెలిపారు.
ఈ హాకీ టోర్నమెంట్ నిర్వహణ ఎయిర్ ఫోర్స్ దిగ్గజమైన అర్జన్ సింగ్కు అందించే నిజమైన నివాళి. దేశానికి ఆయన అందించిన విశేష సేవలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఇది అద్భుతమైన మార్గం.





***
(रिलीज़ आईडी: 2277068)
आगंतुक पटल : 10