ప్రధాన మంత్రి కార్యాలయం
‘యువజన సాధికారత, పీఎంవీబీఆర్వై’లపై వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని
प्रविष्टि तिथि:
19 JUN 2026 2:31PM by PIB Hyderabad
కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
యువతకు అపారమైన అవకాశాలు కల్పించడం ద్వారా వారిని సాధికారత వైపు నడిపించడమే 'వికసిత్ భారత్' లక్ష్యమని ఈ కథనం తెలియజేస్తోంది. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (పీఎంవీబీఆర్వై).. దేశంలో భారీ స్థాయిలో ఉపాధి అవకాశాల సృష్టికి, మార్పునకు బాటలు వేయడమే కాకుండా దేశ నిర్మాణంలో యువత క్రియాశీల భాగస్వాములు కావడానికి ఒక చోదక శక్తిగా నిలుస్తుందని ఈ వ్యాసంలో కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
“యువతకు అపారమైన అవకాశాలు కల్పించడం ద్వారా వారిని సాధికారిత వైపు నడిపించడమే 'వికసిత్ భారత్' ప్రధాన లక్ష్యం. దేశంలో భారీ స్థాయిలో ఉపాధి అవకాశాల సృష్టికి, మార్పునకు పీఎంవీబీఆర్వై బాటలు వేయనుంది. ఈ పథకం మన యువత దేశ నిర్మాణంలో క్రియాశీల భాగస్వాములు కావడానికి ఒక అద్భుత చోదక శక్తిగా కూడా నిలుస్తుంది.
కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రాసిన ఈ వ్యాసం ప్రతి ఒక్కరూ తప్పక చదవండి.”
***
(रिलीज़ आईडी: 2275191)
आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam