ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వివేకానికీ, ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడానికీ ఉన్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 16 JUN 2026 8:53AM by PIB Hyderabad

ధైర్యంవివేకందూరదృష్టి కలిగి ఉంటూ చేసే పనులతో సంతోషంసౌభాగ్యం సిద్ధిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారుప్రతి నిర్ణయాన్నీ ఎంతో ఆలోచించి తీసుకోవాలనీముందువెనుక ఆలోచించి చేసే పనులే విజయాన్ని అందిస్తాయనీ ఆయన తెలిపారు.
‘‘
సహసా విద్ధీత్ న క్రియామవివేకః పరమాపదాం పదమ్ వృణతే హి విమృశ్యకారిణం గుణలుబ్ధాః స్వయమేవ సంపద’’ అన్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.

ఆలోచించకుండా ఏ పనీ చేయకూడదు.. అలా చేసే పని గొప్ప ఆపదలను తెచ్చిపెడుతుందిదీనికి భిన్నంగాప్రతిదీ జాగ్రత్తగా ఆలోచించి ముందుకు అడుగు వేసే వ్యక్తి చెంతకు విజయంసౌభాగ్యం నడిచి వస్తాయని ఈ సుభాషితం మనకు చెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ, ‘‘ధైర్యంవివేకందూరదృష్టితో చేసే పనులే సంతోషానికీసౌభాగ్యానికీ కారణమవుతాయిఇందువల్ల ప్రతి నిర్ణయాన్నీ అన్నీ ఆలోచించి మరీ తీసుకోవాలి.. ఎందుకంటేముందువెనుక ఆలోచించి వేసే అడుగులే విజయాన్ని అందిస్తాయి.

సహసా విద్ధీత్ న క్రియామవివేకః పరమాపదాం పదమ్
వృణతే హి విమృశ్యకారిణం గుణలుబ్ధాః స్వయమేవ సంపద’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2273466) आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam