ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహిళల నాయకత్వంలో విభిన్న రంగాల్లో అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని స్పష్టం చేసిన ప్రధానమంత్రి


దేశ నిర్మాణానికి మూలాధారం, సిసలైన శక్తికి ప్రతీకా మహిళాశక్తేనని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని

प्रविष्टि तिथि: 12 JUN 2026 12:39PM by PIB Hyderabad

మహిళల నాయకత్వంలో అభివృద్దిని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా కృషి చేస్తోందనీఇది అన్ని రంగాలలో స్పష్టంగా కనిపిస్తోందనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అన్నారుఅభివృద్ధి ఫలాలను సమాజంలో అన్ని వర్గాలకు చేరవేయడం మొదలు ఔత్సాహిక పారిశ్రామికత్వంవిద్యఆరోగ్యసంరక్షణస్వచ్ఛతగృహనిర్మాణంక్రీడలువిజ్ఞానశాస్త్రంపరిపాలన.. ఇలా వివిధ రంగాల్లో మహిళలు  ప్రముఖ పాత్రను పోషిస్తున్నారని ఆయన తెలిపారు.
ప్రభుత్వ ప్రయత్నాలు ఆత్మగౌరవంఅవకాశాలుసాధికారత కల్పనలపై ఆధారపడి ఉన్నాయని శ్రీ మోదీ స్పష్టం చేశారుఈ ప్రయత్నాలు మహిళలు వారి శక్తిసామర్ధ్యాలను గ్రహించడంతో పాటు దేశ నిర్మాణంలో మరింత ఎక్కువగా తమ వంతు తోడ్పాటును అందించగల వాతావరణాన్ని ఏర్పరచడంలో దోహదం చేశాయని ఆయన అన్నారు.
ముఖ్యంగా విజ్ఞానశాస్త్రంఅంతరిక్షంనూతన ఆవిష్కరణల వంటి రంగాలలో భారత నారీశక్తి తనదైన ముద్ర వేయడం సంతోషాన్ని కలిగిస్తోందని ప్రధానమంత్రి అన్నారుడ్రోన్ సాంకేతికత వంటి వినూత్న రంగాలలో వారి భాగస్వామ్యం పెరుగుతూ ఉండడం అవకాశాలకు సంబంధించిన కొత్త తలుపులను తెరుస్తోందనీదీంతో పూర్తి దేశంలో అభివృద్ధి రూపురేఖలు మారుతున్నాయనీ ఆయన అన్నారు.
స్వయంసహాయ బృందాలకు ప్రభుత్వం మద్దతిస్తోందనీమహిళలు ఆర్థికంగా సొంత కాళ్ల మీద నిలబడడంలో ఈ సంఘాలు కీలక పాత్రను పోషిస్తున్నాయనీ శ్రీ మోదీ వివరించారు.
ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో  ప్రధానమంత్రి పంచుకుంటూభారత మహిళా శక్తి దేశ నిర్మాణానికి  మూలాధారంగా ఉందన్నారుప్రస్తుతం ప్రతి రంగంలో మన తల్లులుఅక్కచెల్లెళ్లుకుమార్తెలు అద్భుత ప్రతిభతోనూనైపుణ్యాలతోనూ భరత మాతకు గొప్ప గర్వకారణంగా నిలుస్తున్నారని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి వరుస సందేశాలను పొందుపరుస్తూ:
‘‘
గత 12 సంవత్సరాల్లోమహిళల నాయకత్వంలో చోటుచేసుకొనే అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా ఎన్‌డీఏ ప్రభుత్వం పనిచేసిందిఇది అన్ని రంగాల్లో కనిపిస్తోంది.

అభివృద్ధి ఫలాలను సమాజంలో అన్ని వర్గాల చెంతకు చేరడం మొదలు ఔత్సాహిక పారిశ్రామికత్వంవిద్యఆరోగ్యసంరక్షణస్వచ్ఛతగృహనిర్మాణంక్రీడలువిజ్ఞానశాస్త్రంపరిపాలన వంటి భిన్న రంగాల్లో మహిళలు ప్రధాన భూమికను పోషిస్తున్నారు.
ఎన్‌డీఏ ప్రభుత్వ ప్రయత్నాలు ఆత్మగౌరవంఅవకాశాలుసాధికారత కల్పనలపై ఆధారపడి ఉన్నాయి.  ప్రభుత్వ ప్రయత్నాలు.. మహిళలు వారి పూర్తి శక్తియుక్తులను గ్రహించడంతో పాటు దేశ నిర్మాణంలో మరింత ఎక్కువ బలంగా తమ వంతు తోడ్పాటును అందించగల వాతావరణాన్ని ఏర్పరచడంలో దోహదపడ్డాయి.  

‘‘
విజ్ఞానశాస్త్రంఅంతరిక్షంనూతన ఆవిష్కరణల వంటి రంగాలలో భారత నారీ శక్తి తనదైన ముద్ర వేయడం చూస్తే నాకు సంతోషం కలుగుతోందిడ్రోన్ సాంకేతికత వంటి వినూత్న రంగాల్లో వారి భాగస్వామ్యం పెరగడం వల్ల కొత్త అవకాశాలు అందిరావడంతోపాటు దేశంలో అభివృద్ధి చోటుచేసుకుంటున్నది. మా ప్రభుత్వం స్వయంసహాయ బృందాలకు మద్దతిస్తోందిఈ  బృందాలు మహిళలు ఆర్థికంగా సొంత కాళ్ల మీద నిలబడడంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి’’.

‘‘
దేశ నిర్మాణానికి  భారత నారీశక్తి మూలస్తంభంగా ఉందిమన తల్లులుఆడపడుచులుకుమార్తెలు ప్రతి రంగంలో అద్భుత ప్రతిభనీనైపుణ్యాన్నీ చాటుతూ భరత మాత గౌరవాన్ని పెంపొందింపచేస్తున్నారు.  
నారీ త్రైలోక్యజననీ
నారీ త్రైలోక్యరూపిణీ
నారీ త్రిభువనాధారా
నారీ శక్తిస్వరూపిణీ

(మూడు లోకాలకు తల్లి మహిళయేమూడు లోకాల సాక్షాత్తు అభివ్యక్తీకరణా ఆమేయావత్తు విశ్వానికీ ఆమె ఆధారంశక్తికి వాస్తవిక రూపం మహిళ).

 

***


(रिलीज़ आईडी: 2272116) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam