అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

భారత అంతరిక్ష రంగంలో పెట్టుబడులను పెంచాల్సిందిగా పరిశ్రమవర్గాలకు పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


అంతరిక్ష రంగంలో సంస్కరణల ఫలితంగా 400కు పైగా అంకుర సంస్థలకు విస్తరించిన భారత ప్రైవేటు అంతరిక్ష వ్యవస్థ

ప్రారంభ మూలధన (వెంచర్ క్యాపిటల్), సాంకేతిక స్వావలంబన నిధులతో భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం: డాక్టర్ జితేంద్ర సింగ్

పరిశోధన - అభివృద్ధిలో మరింత ఉదారంగా ఉంటామన్న మంత్రి.. విజ్ఞాన శాస్త్రంలో పెట్టుబడి మానవాళికి సేవ చేయడమేనని వ్యాఖ్య

प्रविष्टि तिथि: 11 JUN 2026 5:43PM by PIB Hyderabad

ప్రపంచస్థాయిలో పోటీపడేలా దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అభివృద్ధి చేయడంవిదేశీ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం లక్ష్యంగా.. అంతరిక్ష రంగంలో పెట్టుబడులనూభాగస్వామ్యాన్నీ భారీగా విస్తరించాలని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ, భౌగోళిక విజ్ఞాన శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), పీఎంవో- అణు ఇంధన అంతరిక్ష విభాగం సిబ్బంది, ప్రజా వ్యవహారాలు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ పారిశ్రామిక ప్రముఖులకు పిలుపునిచ్చారు.

పదో ఇన్‌స్పేస్ పారిశ్రామిక సదస్సులో డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారుదేశ అంకుర సంస్థలు అద్భుతమైన ఆవిష్కరణలనూసాంకేతిక సామర్థ్యాన్నీ ప్రదర్శిస్తున్నాయన్నారుఅయితే ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా ఎదగాలంటే నిధుల లభ్యతఉత్పాదక సామర్థ్యంమార్కెట్ లభ్యతను పెంచుకుంటూ.. ప్రముఖ పరిశ్రమల నుంచి మరింత పటిష్టమైన భాగస్వామ్యం ఆవశ్యకమని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అందుబాటులోకి తేవడాన్ని.. వ్యూహాత్మక రంగాల పట్ల భారత్ విధానంలో చరిత్రాత్మక మార్పుగా డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారుసాహసోపేత నిర్ణయంగా ఈ సంస్కరణలను అభివర్ణించారుఇది దేశంలోని అంతర్గత పారిశ్రామిక నైపుణ్యాన్ని వెలికితీయడమే కాకుండా.. అనతికాలంలోనే భారత అంతరిక్ష వ్యవస్థ రూపురేఖలను మార్చేసిందని వ్యాఖ్యానించారు.

అంతరిక్ష రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం చేపట్టిన విధానపరమైన కార్యక్రమాలను డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారుఅంతరిక్ష రంగ సంస్కరణల అనంతరం రూపొందించిన భారత అంతరిక్ష విధానం 2023 ఈ రంగంలోని భాగస్వాములకు వ్యూహాత్మక దిశానిర్దేశాన్నీనియంత్రణపరమైన స్పష్టతనూ అందించిందన్నారుదీనితోపాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని సరళీకరణ పెట్టుబడులను ఆకర్షించిందనీఅన్ని దశల్లోనూ అంతర్జాతీయంగా భారత్ మరింతగా అనుసంధానమయ్యేందుకు దోహదపడిందని వివరించారుభారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహకఆధీకృత కేంద్రం (ఇన్-స్పేస్ఏర్పాటును ఒక విశిష్టమైన సంస్థాగత సంస్కరణగా అభివర్ణించారుఇది అంతరిక్ష రంగంలోని అన్ని దశల్లోనూ ప్రభుత్వేతర సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలోఅనుమతించడంలోపర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

ఆర్థికసంస్థాగత సహాయక వ్యవస్థల ద్వారా దేశంలో ఆవిష్కరణలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వ కృషిని డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా వివరించారుఅంతరిక్ష రంగంలో ఆవిష్కరణలనూవాటి వాణిజ్యీకరణనూ సులభతరం చేయడం కోసం రూ1,000 కోట్ల ప్రారంభ మూలధన నిధినీరూ500 కోట్ల సాంకేతిక స్వావలంబన నిధినీ ప్రారంభించినట్లు ఆయన తెలిపారువీటితోపాటు ప్రాథమిక మూలధనంప్రారంభస్థాయి సహకారంనైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలుఏఐసీటీఈ ఆమోదించిన అంతరిక్ష సాంకేతికతా పాఠ్యప్రణాళిక వంటి కార్యక్రమాలు.. దేశంలో వేగంగా విస్తరిస్తున్న అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు అవసరమైన భవిష్యత్ అవసరాలకు తగిన ప్రతిభావంతులైన మానవ వనరులను సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.

దేశంలో ప్రైవేటు అంతరిక్ష వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారుకేవలం కొద్దిపాటి అగ్రగామి సంస్థలతో మొదలైన ఈ ప్రయాణం.. నేడు 400కు పైగా అంకుర సంస్థలువందలాదిగా చిన్నా పెద్దా కంపెనీలతో భారీ వ్యవస్థగా అవతరించిందని గుర్తుచేశారుభారతీయ సంస్థలు నేడు ప్రయోగ వాహనాలుచోదక వ్యవస్థలుభూ పరిశీలన అప్లికేషన్లుఅంతరిక్ష పరిస్థితుల అవగాహన సామర్థ్యాలతోపాటు అనేక రకాల అనుబంధ సేవలనూ అభివృద్ధి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారుస్కైరూట్ ఏరోస్పేస్అగ్నికుల్ కాస్మోస్పిక్సెల్గెలాక్సీదిగంతరధ్రువ స్పేస్ వంటి కంపెనీలు దేశ పారిశ్రామిక సామర్థ్యానికీసాంకేతిక ఆవిష్కరణలకూ నిదర్శనమని మంత్రి అభినందించారు.

వైజ్ఞానిక పరిశోధనల రంగంలో ఉదారంగా వ్యవహరించే ధోరణిని పెంపొందించుకోవాలని డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారుమన సంప్రదాయంలో దాతృత్వ విరాళాలు సేవా కార్యక్రమాలకే పరిమితమవుతున్నాయన్నారుపరిశోధనలుఆవిష్కరణల్లో పెట్టుబడులను కూడా ముఖ్యమైన సామాజిక సేవగా గుర్తించాలన్నారు.

క్రమంగా విస్తరిస్తున్న అంతరిక్ష వ్యవస్థలో పనిచేసేటప్పుడు తాము ఎదుర్కొంటున్న సవాళ్లనుఇబ్బందులను ఉన్నదున్నట్టుగా తెలియజేయాలని పరిశ్రమ వర్గాలకు మంత్రి విజ్ఞప్తి చేశారువారికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారువిధానరూపకర్తలకూపరిశ్రమ వర్గాలకూ మధ్య ఎప్పటికప్పుడు బహిరంగనిర్మాణాత్మక చర్చలు జరగడం అత్యంత కీలకమన్నారు.

వేగవంతమైన అనుమతులుసరళీకృత ప్రక్రియలుసమర్థమైన ఏకగవాక్ష విధానం అవసరమంటూ.. పరిశ్రమ వర్గాలు వ్యక్తం చేసిన ఆందోళనలను డాక్టర్ జితేంద్ర సింగ్ అంగీకరించారుకొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడమే పరిపాలనలో ముఖ్య లక్ష్యంగా ఉండాలనీఅంతే తప్ప అనవసర అడ్డంకులను సృష్టించేలా ఉండకూడదనీ అన్నారు.

ఆత్మనిర్భర అంతరిక్ష రంగాన్ని సాకారం చేసుకునే దిశగా.. ప్రభుత్వంపరిశ్రమలువిద్యాసంస్థలుపెట్టుబడిదారులురాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత బలమైన సమన్వయం ఆవశ్యకమని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారుఅంకుర సంస్థల వేగానికి – ప్రముఖ పరిశ్రమల భారీ వనరులుఆర్థిక బలంకార్యాచరణ సామర్థ్యాలు తోడు కావాలని అభిప్రాయపడ్డారు.

భారత్‌లో అపారమైన ప్రతిభపారిశ్రామిక శక్తి ఉన్నాయనీఅయితే అనుకూలమైన విధానపరమైన వాతావరణమే ఇన్నాళ్లూ లేకుండా పోయిందనీ మంత్రి అన్నారుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో చేపట్టిన సంస్కరణలు.. ఆ వ్యవస్థను సృష్టించాయనీదీంతో ఆవిష్కరణలకూవ్యాపార విస్తరణకు సరికొత్త దారులు తెరచుకున్నాయనీ ఆయన వ్యాఖ్యానించారు.

ఒక్క ప్రభుత్వ ప్రయత్నం వల్లే అంతరిక్ష రంగంలో భారత కాంక్షలు సంపూర్ణంగా నెరవేరవని డాక్టర్ జితేంద్రసింగ్ అన్నారుప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్‌ను అగ్రగామి శక్తిగా నిలిపేలా.. ఆశయంఆత్మవిశ్వాసంఅంకితభావంతో కలిసి పనిచేయాలని భాగస్వామ్య పక్షాలకు పిలుపునిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.  

***


(रिलीज़ आईडी: 2272024) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati , Tamil