మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నాలుగో విడత యువ సంగం కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్రను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందం

प्रविष्टि तिथि: 10 JUN 2026 6:49PM by PIB Hyderabad

ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ కార్యక్రమంలో భాగంగా విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నత విద్యా విభాగం 'యువ సంగం నాలుగో విడతకార్యక్రమాన్ని నిర్వహిస్తోందిదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువత మధ్య సాంస్కృతిక మార్పిడిప్రయోగాత్మక అభ్యాసంజాతీయ సమైక్యతను పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

ఈ కార్యక్రమంలో భాగంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీతిరుపతి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్పూణె ఆతిథ్యం ఇచ్చిందిఈ ఐదు రోజుల కార్యక్రమంలో పాల్గొన్న యువతకు.. మహారాష్ట్రకు సంబంధించిన గొప్ప సాంస్కృతిక వారసత్వంవిద్యా నైపుణ్యంఆవిష్కరణల వ్యవస్థఅభివృద్ధి విషయంలో సాధించిన విజయాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభించింది.

ఈ ప్రతినిధి బృందం 2026 జూన్ 08న ముంబయిలోని రాజ్ భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలుసుకుందిఈ సందర్భంగా నాయకత్వందేశ నిర్మాణంజాతీయ సమైక్యతపై గవర్నర్ ‌తన ఆలోచనలను విద్యార్ధులతో పంచుకున్నారుభారతదేశ వైవిధ్యభరితమైన సాంస్కృతిక నేపథ్యాన్ని అర్థం చేసుకోవటానికిఅభినందించటానికి ఉన్న ప్రాముఖ్యతపై ఈ చర్చ సాగిందిఇది కార్యక్రమంలో పాల్గొన్న యువతకు పాలనప్రజా సేవపై విలువైన అవగాహనను అందించింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతినిధి బృందం 2026 జూన్ 5న మహారాష్ట్ర సాంస్కృతికఆధ్యాత్మికగ్రామీణ ప్రాంతాల గుండా ఒక అద్భుతమైన పర్యటనను చేపట్టిందిఈ రోజు కార్యక్రమాలను పర్యటన్ (పర్యాటకం), ప్రగతి (అభివృద్ధి), పరస్పర సంపర్క్ (ప్రజల మధ్య సంబంధాలుఅనే ప్రధానాంశాల కేంద్రంగా రూపొందించారుఇందులో భాగంగా ప్రతినిధి బృందం మహారాష్ట్రలోని ప్రముఖ ఆధ్యాత్మికసాంస్కృతిక ప్రదేశాలలో ఒకటైన జేజూరిలోని చారిత్రాత్మక ఖండోబా మందిరాన్ని సందర్శించిందిఆ తర్వాత ఈ బృందం ఆదర్శ గ్రామం అయిన అదాచివాడిని సందర్శించి.. అక్కడ సర్పంచ్గ్రామ పంచాయతీ సభ్యులుగ్రామస్తులతో మాట్లాడిందిఈ పరస్పర చర్చలు క్షేత్రస్థాయి పాలనగ్రామీణాభివృద్ధి కార్యక్రమాలుసమాజ భాగస్వామ్యంగ్రామాల నేతృత్వంలో జరుగుతున్న మార్పులపై విలువైన అవగాహనను అందించాయిసుస్థిరసమ్మిళిత అభివృద్ధిని ప్రతినిధులు ప్రత్యక్షంగా అర్థం చేసుకోవడానికి ఈ పర్యటన ఎంతగానో దోహదపడింది.

2026 జూన్ 6న ఈ ప్రతినిధి బృందం పర్యావరణ్ (పర్యావరణం), పరంపర (సంప్రదాయాలుఅనే ఇతివృత్తాల ఆధారంగా చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొందిపర్యావరణ అవగాహనపరిరక్షణసుస్థిరతను పెంపొందించే లక్ష్యంతో ఐఐఎస్ఈఆర్ పూణె క్యాంపస్‌లో జీవవైవిధ్య కార్యక్రమంమొక్కలు నాటే కార్యక్రమంతో ఈ రోజు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయిఆ తర్వాత ప్రతినిధులు పూణె నగరంలోని చారిత్రాత్మక ప్రాంతాల్లో సాంస్కృతిక సంపద నడక (హెరిటేజ్ వాక్చేస్తూ శనివార్ వాడను సందర్శించారుఈ పర్యటన ద్వారా వారు మహారాష్ట్రకు ఉన్న గొప్ప చారిత్రాత్మకసాంస్కృతిక వారసత్వాన్ని తెలుసుకోవటమే కాకుండా ఆ రాష్ట్ర నిర్మాణసాంస్కృతికచారిత్రక వైభవాన్ని గురించి అద్భుతమైన అవగాహనను పెంపొందించుకున్నారు.

దక్కన్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్ సోనాల్ కులకర్ణి జోషి నేతృత్వంలో భాషకు సంబంధించి జరిగిన ప్రత్యేక సదస్సుకు కూడా ప్రతినిధులు హాజరయ్యారుఇది మహారాష్ట్ర భాషా వారసత్వాన్నిసాంస్కృతిక వైవిధ్యాన్ని వారికి పరిచయం చేసిందిఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఉన్నతసాంకేతిక విద్యాశాఖ మంత్రి శ్రీ చంద్రకాంత్ దాదా పాటిల్రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి మాధురి తాయ్ మిసాల్‌లతో ప్రతినిధులు జరిపిన చర్చలు మరింత స్ఫూర్తినింపాయిశ్రీ చంద్రకాంత్ దాదా పాటిల్ ప్రతినిధులకు స్వాగతం పలికారుదేశాన్ని ఏకం చేసే ఉమ్మడి సాంస్కృతిక విలువలను అభినందిస్తూనే మహారాష్ట్ర విశిష్ట సంప్రదాయాలను తెలుసుకోవాలని ఆయన వారిని కోరారుపట్టణాభివృద్ధిపై శ్రీమతి మాధురి తాయ్ మిసాల్‌ ఆలోచనలను పంచుకున్నారుయువత తమ మూలాలనువిలువలను మరువకుండానే ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె అన్నారుఈ రోజు కార్యక్రమాలు సంప్రదాయ మహారాష్ట్రీయ విందుతో ముగిశాయిఇది ప్రతినిధులకు ఆ రాష్ట్రానికి సంబంధించిన గొప్ప వంటకాలను రుచి చూసే అవకాశాన్ని కల్పించడమే కాకుండా వారి మధ్య స్నేహ బంధాలనుసాంస్కృతిక మార్పిడినిపరస్పర అవగాహనను మరింత బలోపేతం చేసిందిఈ కార్యక్రమం 2026 జూన్ 09న జరిగిన ముగింపు వేడుకతో విజయవంతంగా ముగిసింది

***


(रिलीज़ आईडी: 2271370) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil