రైల్వే మంత్రిత్వ శాఖ
మహబూబ్నగర్-సికింద్రాబాద్-మేడ్చల్ సెక్షన్లో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ అప్గ్రేడేషన్కు భారతీయ రైల్వే ఆమోదం
प्रविष्टि तिथि:
08 JUN 2026 6:03PM by PIB Hyderabad
దక్షిణ మధ్య రైల్వేలోని మహబూబ్నగర్- సికింద్రాబాద్-మేడ్చల్ సెక్షన్లో రైల్వే కార్యకలాపాలను మరింత మెరుగుపరిచేందుకు భారతీయ రైల్వే ఒక కీలక ప్రాజెక్టును మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు కింద, ప్రస్తుతం ఉన్న 1x25 కేవీ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ను ఆధునిక 2x25 కేవీ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్గా అప్గ్రేడ్ చేయనున్నారు. సుమారు 141 రూట్ కిలోమీటర్ల పొడవున్న ఈ రైలు మార్గంలో రూ.285.01 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు.
దేశవ్యాప్తంగా రద్దీగా ఉండే రైలు మార్గాల్లో సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం భారతీయ రైల్వే నిరంతర కృషిలో ఈ ప్రాజెక్టు ఒక భాగం. 2x25 కేవీ వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా రైల్వే కార్యకలాపాలకు మరింత స్థిరమైన, సమర్థమైన విద్యుత్ సరఫరా లభిస్తుంది. దీనివల్ల రైల్వే సేవలు మరింత సులభంగా, సురక్షితంగా, విశ్వసనీయంగా మారతాయి.
దేశంలోని ముఖ్యమైన హై-డెన్సిటీ నెట్వర్క్ (హెచ్డీఎన్) మార్గాల్లో మహబూబ్నగర్- సికింద్రాబాద్-మేడ్చల్ సెక్షన్ ఒకటి. ఇది ధర్మవరం- డోన్- మహబూబ్నగర్-సికింద్రాబాద్- మేడ్చల్- ముఖేడ్- ఇండోర్-అజ్మేర్ రైల్ కారిడార్లో భాగంగా ఉంది. ఈ మార్గంలో ప్రయాణికుల, సరుకు రవాణా గణనీయంగా ఉంటుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా ఈ మార్గంలో రైల్వే కార్యకలాపాలు మరింత మెరుగుపడతాయి. సరుకు రవాణా మరింత సమర్థంగా మారడం సహా... దాని వేగం, సామర్థ్యం రెండూ మెరుగవుతాయి. ఈ ప్రాజెక్టుతో ఈ ప్రాంతమంతటా వాణిజ్యం, పరిశ్రమలు, ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభిస్తుందని భావిస్తున్నారు.
ఆధునిక, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న రైల్వే నెట్వర్క్ను అభివృద్ధి చేయాలనే భారతీయ రైల్వే నిబద్ధతను ఈ ప్రాజెక్టు మరింత బలోపేతం చేస్తుంది. మెరుగైన రైల్వే మౌలిక సదుపాయాలు, కార్యాచరణ సామర్థ్యం ద్వారా ప్రయాణికులకు, పరిశ్రమలకూ ఇది ప్రయోజనం చేకూరుస్తుంది.
***
(रिलीज़ आईडी: 2270591)
आगंतुक पटल : 9