శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వచ్ఛతా పక్వాడా-2026ను నిర్వహించిన శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన బయో టెక్నాలజీ విభాగం

प्रविष्टि तिथि: 08 JUN 2026 2:35PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా శాస్త్రసాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన బయో టెక్నాలజీ విభాగం (డీబీటీ).. మే నుంచి మే 15, 2026 వరకు స్వచ్ఛతా పక్వాడా-2026ను నిర్వహించిందిన్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంతో పాటు ఈ విభాగం పరిధిలోని అన్ని స్వయంప్రతిపత్తి సంస్థలు (ఏఐలు), ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్ యూలుఈ కార్యక్రమాన్ని చేపట్టారుభారత ప్రభుత్వ కేబినెట్ సెక్రటేరియట్ జారీ చేసిన స్వచ్ఛతా పక్వాడా-2026 మార్గదర్శకాలుక్యాలెండర్‌కు అనుగుణంగా ఈ పక్వాడా నిర్వహించారు.

న్యూఢిల్లీలోని సీజీఓ కాంప్లెక్స్‌లో బయో టెక్నాలజీ (డీబీటీకార్యాలయంలో మే 1, 2026న ప్రతిజ్ఞ కార్యక్రమంతో స్వచ్ఛతా పక్వాడా-2026 ప్రారంభమైందిఈ కార్యక్రమంలో బయో టెక్నాలజీ విభాగం ఉన్నతాధికారులుసిబ్బంది పాల్గొన్నారుఈ సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం.. పరిశుభ్రతక్రమశిక్షణపౌర బాధ్యత పట్ల నిబద్ధతను స్పష్టం చేసిందిరాబోయే పదిహేను రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు కీలకంగా నిలిచిందిఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగిందిపక్వాడా ప్రారంభానికి స్ఫూర్తిగా నిలిచిందిఈ పదిహేను రోజుల్లో డీబీటీదాని అనుబంధ సంస్థలైన ఏఐలుపీఎస్‌యూల భాగస్వామ్యంతో పలు పరిశుభ్రతా కార్యక్రమాలను రూపొందించిపూర్తి చేశారుపరిశుభ్రతను పెంపొందించే వివిధ ఉత్తమ పద్ధతులునీటి సంరక్షణశ్రమదానం వంటివి ఈ కార్యాచరణ ప్రణాళికలో చేర్చారు.

పక్వాడా సందర్భంగా ఆరోగ్య పరీక్షల శిబిరాలుపర్యావరణ అవగాహనా సదస్సులుసంతకాల సేకరణమొక్కలు నాటే కార్యక్రమాలుఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ పై అవగాహనా సదస్సులను నిర్వహించారుమానసిక ఒత్తిడి నియంత్రణ కార్యశాలలుసెమినార్లుపెయింటింగ్ పోటీలువ్యర్థాల నుంచి సంపద వంటి పోటీల నిర్వహణతో పాటు జనపనార సంచుల పంపిణీచెక్క ప్యాకింగ్ సామాగ్రిని అందమైన పూల కుండీలుగా మార్చటం వంటి కార్యక్రమాలను చేపట్టారుప్రయోగశాలల్లోని వ్యర్థాల నిర్వహణపై సమీప ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక అవగాహనా సదస్సులను నిర్వహించటమే కాక.. మరుగుదొడ్లుతరగతి గదుల మరమ్మత్తు పనులను చేపట్టారుపరిశుభ్రతపై సమాజానికి అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు వ్యాస రచనకవిత్వంనినాదాల రచనా పోటీలను ఏఐలు నిర్వహించాయి.

ఈ పక్వాడా కార్యక్రమాలను డీబీటీ ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూదిశానిర్దేశం చేశారుస్వచ్ఛతా పక్వాడాలో పాల్గొన్న వారిని ప్రోత్సహించిఉత్సాహపరుస్తూమార్గదర్శకత్వం అందించేందుకు సమీక్షా సమావేశాలను నిర్వహించారునిర్దేశిత నిబంధనల ప్రకారం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మూడు కార్యాలయాల ఎంపిక కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారుఅత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి మూడు సంస్థలు (I) బ్రిక్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్ఐఏబీ) (ii) బ్రిక్ నేషనల్ అగ్రి-ఫుడ్ బయోటెక్నాలజీ ఇనిస్టిట్యూట్ (ఎన్ఏబీఐ) (iii) బ్రిక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోరిసోర్సెస్ అండ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ (ఐబీఎస్‌డీ)లను బయోటెక్నాలజీ విభాగం(డీబీటీసెక్రటరీ.. జూన్ 2, 2026న జరిగిన అధికారిక కార్యక్రమంలో అవార్డులతో సత్కరించారు.

***


(रिलीज़ आईडी: 2270285) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil