ప్రధాన మంత్రి కార్యాలయం
ముని పతంజలిని గౌరవిస్తూ, యోగా ప్రాముఖ్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
04 JUN 2026 9:16AM by PIB Hyderabad
ముని పతంజలికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులు అర్పించారు. యోగా ప్రయోజనాలను తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు. యోగాను క్రమం తప్పక అభ్యసిస్తూ ఉంటే మనిషి శరీరం ఆరోగ్యంగా ఉండడంతో పాటు మనిషి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందని శ్రీ మోదీ అన్నారు. దినచర్యలో యోగాను ఒక భాగంగా చేసుకొంటే అది జీవితాన్ని సమతౌల్యంగా, శక్తిమంతంగా తీర్చిదిద్దుతుందని ఆయన వివరించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘యోగాను క్రమం తప్పక అభ్యసించడం వల్ల తనువును ఆరోగ్యంగానూ, మనస్సును శాంతంగానూ ఉంచుకోవచ్చు. దీనిని మీ దినచర్యలో ఒక భాగంగా చేసుకోవడం వల్ల, ఇది జీవితాన్ని సమతౌల్యంగానూ, శక్తిమంతంగానూ మార్చుతుంది.
యోగేన చిత్తస్య పదేన వాచాం
మలం శరీరస్య చ వైద్యకేన
యోపాకరోత్ తం పరవరం మునీనాం
పతంజలిం ప్రాంజలిరానతోస్మి..
ధ్యానమగ్నులైన మునులందరిలోకీ అత్యున్నత స్థానంలో నిలిచిన ముని పతంజలికి ముకుళిత హస్తుడినై, శిరసును వంచి ప్రణామం చేస్తున్నాను. యోగాభ్యాసం ద్వారా ఆయన చిత్తంలో కల్మషాన్నీ, వ్యాకరణ ద్వారా వాణిలో కల్మషాన్నీ, ఆయుర్వేదం ద్వారా శరీరంలో మాలిన్యాన్నీ దూరం చేసుకున్నారు’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2268884)
आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam