ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆదర్శవంతమైన గురువు గుణాలను చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 01 JUN 2026 8:37AM by PIB Hyderabad

కొంతమంది ఏదైనా పనిని పూర్తి చేయడంలో చేయితిరిగిన వారై ఉంటారనీమరికొందరు ముఖ్యంగా నైపుణ్యాన్నిలేదా జ్ఞ‌ానాన్ని ఇతరులకు బోధించడంలో ప్రవీణులై ఉంటారనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారుఈ రెండు గుణాల్నీ .. అంటే తాను స్వయంగా సంపాదించిన విశేష ప్రజ్ఞతో పాటుఇతరులకు నేర్పించగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటే అప్పుడు అలాంటి వ్యక్తి సర్వశ్రేష్ఠ గురువుల్లో ఒకరుగా గౌరవాన్ని పొందవచ్చునని ప్రధానమంత్రి వివరించారు.
‘‘
శ్లిష్ఠా క్రియా కస్యచిదాత్మసంస్థా సడంక్రాన్తిపయితవ్య ఏవ
యస్యోభయం సాధు స శిక్షకాణాం ధురి ప్రతిష్ఠాపయితవ్య ఏవ’’ అని సంస్కృత భాషలో ఉన్న ఓసుభాషితాన్ని  ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.

కొందరు వ్యావహారంలో నిపుణలైతేమరి కొందరు బోధనలో నిపుణులుగా ఉంటారుఅదే.. ఒక వ్యక్తి ఏదైనా విషయంలో ప్రావీణ్యం కలిగివుండడంతో పాటు ఆ ప్రావీణ్యాన్ని పరులకు ప్రభావవంతమైన పద్ధతిలో బోధించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉన్నప్పుడుఅలాంటి వ్యక్తి.. గురువుల్లో అగ్రగణ్య స్థానాన్ని అందుకొనే అర్హతను పొందుతారని ఈ సుభాషితం సూచిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
 ‘‘
శ్లిష్ఠా క్రియా కస్యచిదాత్మసంస్థా సడంక్రాన్తిపయితవ్య ఏవ
యస్యోభయం సాధు స శిక్షకాణాం ధురి ప్రతిష్ఠాపయితవ్య ఏవ’’ అని పేర్కొన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2267378) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam