సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నషా ముక్తి మిత్ర: నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ ఒక విప్లవాత్మక మార్పు... డ్రగ్స్‌ వ్యతిరేక పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పిలుపు

నాడు పోస్టు చేయడమైనది: 15 MAY 2026 5:39PM by PIB Hyderabad

దేశంలోని ప్రతి పౌరుడు నషా ముక్తి మిత్రగా మారి... నషా ముక్త భారత్‌ అభియాన్‌ (ఎన్‌ఎంబీఏ)లో క్రియాశీలకంగా పాల్గొనాలని భారత ప్రభుత్వ సామాజిక న్యాయంసాధికారత విభాగం కోరిందిఎన్‌ఎంబీఏ యాప్‌ 2.0లో అందుబాటులోకి వచ్చిన అధునాతన ఫీచర్ల ద్వారా డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణానికి కృషి చేయాలనుకునేవారు నషా ముక్తి మిత్రగా మారటం ఇప్పుడు సులభంగాఅందరికీ అందుబాటులో ఉండేలాప్రభావవంతంగా మారింది.

మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా జరిగే జాతీయ పోరాటంలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చేందుకు శక్తిమంతమైనప్రజాస్వామ్య ఉద్యమంగా నషా ముక్తి మిత్ర మారనుందిసాధారణ పౌరుల శక్తినినిబద్ధతను క్షేత్రస్థాయిలో డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా నిర్దిష్టమైన చర్యలుగా మార్చేందుకు నిర్మాణాత్మక వేదికను ఇది అందిస్తుంది.

ముఖ్యమైన అంశాలు:

  • ఇప్పటికే 28,000లకుపైగా నషా ముక్తి మిత్రలుగా నమోదు చేసుకునిఅవగాహనా సదస్సులుకౌన్సెలింగ్ మద్దతుముందుగానే వ్యసనాలను గుర్తించటంపునరావాస సహాయం ద్వారా కమ్యూనిటీల్లో సహకారాన్ని అందిస్తున్నారు.

  • వయసువృత్తినేపథ్యంతో సంబంధం లేకుండా ఎవరైనా ఎన్‌ఎంబీఏ యాప్‌ 2.0 ద్వారా నషా ముక్తి మిత్రగా నమోదు చేసుకోవచ్చు.

  • ఈ కార్యక్రమం పట్ల చూపే నిబద్ధతకు నమోదు తర్వాత అధికారిక గుర్తింపు పత్రంప్రతిష్ఠాత్మక ఎన్‌ఎంబీఏ బ్యాడ్జ్‌ను పొందుతారు.

  • ఈ వేదిక అందరికీ అందుబాటులో ఉంటుంది.

సాధారణ పౌరుల క్రియాశీల భాగస్వామ్యం నషా ముక్త్ భారత్ అభియాన్‌ను వేగవంతం చేస్తుందని సామాజిక న్యాయంసాధికారత మంత్రిత్వ శాఖ విశ్వసిస్తోందిమాదక ద్రవ్యాల వ్యసనం వ్యక్తులనుకుటుంబాలనుమొత్తం సమాజాన్ని నాశనం చేస్తుందిపౌరులు నషా ముక్తి మిత్రులుగా మారడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టటంఅవగాహన పెంపొందించటంబాధిత కుటుంబాలకు మద్దతుగా నిలవటంఈ మహమ్మారికి వ్యతిరేకంగా బలమైన సామాజిక రక్షణ కవచాన్ని నిర్మించటంలో నేరుగా పాల్గొనవచ్చు.

సామాజిక న్యాయంసాధికారత శాఖ కార్యదర్శి శ్రీ సుధాంశ్‌ పంత్ మాట్లాడుతూ.. "నషా ముక్త్ భారత్ అభియాన్కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు.. జాతీయ సంకల్పంనషా ముక్తి మిత్ర రూపంలో ఈ ఉద్యమాన్ని మేం ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాంపెరుగుతున్న మాదకద్రవ్యాల ముప్పును చూసి ఆందోళన చెందే ప్రతి భారతీయుడికి ఇప్పడు అధికారిక వేదిక ద్వారా తమ వంతు కృషి చేసే అవకాశం లభించిందివిద్యార్థులుఉపాధ్యాయులుతల్లిదండ్రులునిపుణులుపదవీ విరమణ చేసిన పౌరులుయువత.. అందరూ ఎన్‌ఎంబీఏ 2.0 యాప్‌ డౌన్‌లోడ్ చేసుకునినషా ముక్తి మిత్రగా నమోదు చేసుకోవాలనిసమాజంలో కోరుకునే మార్పుకు మార్గదర్శకులు కావాలని మేం విజ్ఞప్తి చేస్తున్నాంమనం అందరం కలిసికట్టుగా ఆరోగ్యకరమైనబలమైనడ్రగ్స్‌ రహిత భారతాన్ని నిర్మిద్దాంఅని పిలుపునిచ్చారు.

నషా ముక్తి మిత్ర ఎలా అవ్వాలి:

  1. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎన్ఎంబీఏ యాప్‌ 2.0 ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

  2. యాప్‌లో నమోదు చేసుకునినషా ముక్తి మిత్ర కోసం రూపొందించిన నమోదు ప్రక్రియను పూర్తి చేయాలి.

  3. డిజిటల్ ధ్రువపత్రాన్నిఎన్‌ఎంబీఏ బ్యాడ్జ్‌ను పొందండి.

  4. మీ ప్రాంతంలో అవగాహనా కార్యక్రమాలుసామాజిక కార్యక్రమాలుసహాయక చర్యలు ద్వారా మీ వంతు సహకారం అందించండి.

సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు.. ముఖ్యంగా యువతవిద్యావేత్తలుసివిల్ సొసైటీ సంస్థలుస్థానిక నాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేస్తోందిఇవాళ మీరు వేసే ఒక అడుగు.. రేపు ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంది.

చేతులు కలుపుదాంనషా ముక్తి మిత్రులవుదాంనషా ముక్త్‌ భారత్‌ను నిర్మిద్దాం.

మరింత సమాచారం కోసం ఎన్‌ఎంబీఏ వెబ్‌సైట్‌ను సంప్రదించండిలేదా ఎన్‌ఎంబీఏ యాప్‌ 2.0ను డౌన్‌లోడ్‌ చేసుకోండి.

ఎన్‌ఎంబీఏ యాప్‌:

https://play.google.com/store/search?q=nasha+mukt+bharat+abhiyan&c=apps&hl=en

https://www.instagram.com/nashamuktbharatabhiyaan/

https://x.com/NMBA_MSJE

https://www.facebook.com/NMBA.MSJE

https://www.youtube.com/@nashamuktbharatabhiyaan4550

https://www.whatsapp.com/channel/0029Vb6s9tg1SWst8ZSHXa1f

***


(రిలీజ్ ఐడి: 2261831) సందర్శకుల సూచీ సంఖ్య : : 23
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Tamil