సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ముస్సోరీలోని జాతీయ సుపరిపాలన కేంద్రంలో(ఎన్‌సీజీజీ) ప్రారంభమైన సీషెల్స్ సివిల్ సర్వీసెస్ అధికారుల శిక్షణ కార్యక్రమం


విధానపరమైన వ్యవహారాల క్యాబినెట్ ఉపకార్యదర్శి అలెక్స్ హెండర్సన్ నేతృత్వంలో
ఈ కార్యక్రమానికి హాజరైన 29 మంది సభ్యుల బృందం

శిక్షణలో అధ్యక్ష కార్యాలయం, హోంలాండ్ భద్రత - పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రక్షణ శాఖ, విద్యా- మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, న్యాయవ్యవస్థకు చెందిన ఉన్నతాధికారులు

నాడు పోస్టు చేయడమైనది: 12 MAY 2026 10:19AM by PIB Hyderabad

ముస్సోరీలోని జాతీయ సుపరిపాలన కేంద్రంలో(ఎన్‌సీజీజీసీషెల్స్ దేశ ప్రభుత్వానికి చెందిన సివిల్ సర్వీసెస్ అధికారుల (సివిల్ సర్వెంట్లశిక్షణ కార్యక్రమం 2026 మే 11న ప్రారంభమైందివిదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏసహకారంతో ముస్సోరీఢిల్లీలో మే 11 నుంచి మే 22 వరకు ఈ రెండు వారాల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారుఈ మొదటి బ్యాచ్‌లో రక్షణఐటీఆర్థికంన్యాయంవిద్యప్రజా పాలనఅధ్యక్ష కార్యాలయం వంటి కీలక విభాగాలకు చెందిన డైరెక్టర్ జనరళ్లుఉన్నతాధికారులతో సహా మొత్తం 29 మంది పాల్గొంటున్నారు.

2026 ఫిబ్రవరి‌లో ఎన్‌సీజీజీసీషెల్స్ పబ్లిక్ సర్వీస్ బ్యూరో (పీఎస్‌బీమధ్య కుదిరిన చారిత్రాత్మక అవగాహన ఒప్పందంలో (ఎంఓయూభాగంగా దీనిని నిర్వహిస్తున్నారుమూడేళ్లపాటు కొనసాగే ఈ ఒప్పందం ప్రకారం 250 మంది సీషెల్స్ ప్రభుత్వ ఉన్నతాధికారులకు శిక్షణ ఇవ్వటం కోసం ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించారుఇందులో భాగంగా సంస్థాగత నాయకత్వాన్ని బలోపేతం చేయడండిజిటల్ పరివర్తనను వేగవంతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.

జాతీయ సుపరిపాలన కేంద్రం (ఎన్‌సీజీజీడైరెక్టర్ జనరల్ డాక్టర్ సురేంద్రకుమార్ బాగ్డే అధ్యక్షతన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. 29 మంది సభ్యులతో కూడిన ప్రతినిధి బృందానికి స్వాగతం పలికిన డాక్టర్ బాగ్డే.. భారత్సీషెల్స్ దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ చారిత్రాత్మకసాంస్కృతిక బంధాలను గుర్తు చేశారుసీషెల్స్ దేశ సుస్థిర అభివృద్ధికి అవసరమైన కీలక రంగాలను దృష్టిలో ఉంచుకొని ఆయా అధికారుల వృత్తిపరమైన నిపుణతకు అనుగుణంగా ఈ శిక్షణను అత్యంత జాగ్రత్తగా రూపొందించినట్లు ఆయన ప్రధానంగా చెప్పారు. “జాతీయ స్థాయిలో అత్యంత ప్రభావవంతమైన కార్యక్రమాలను రూపొందించటం.. అమలు చేయడానికి అవసరమైన నైపుణ్యాలుజ్ఞానాన్ని అధికారులకు అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం” అని ఆయన పేర్కొన్నారుపరస్పర అభ్యాసంభవిష్యత్తులో అవసరమైన శిక్షణ అంశాలను గుర్తించడానికి వీలుగా సీషెల్స్ అనుభవాలను కూడా తమతో పంచుకోవాల్సిందిగా ఆయన ప్రతినిధులను ఆహ్వానించారు.

అధ్యక్ష కార్యాలయంలోని క్యాబినెట్ కార్యాలయంవిధాన వ్యవహారాల క్యాబినెట్ ఉప కార్యదర్శిప్రతినిధి బృంద నాయకుడు అలెక్స్ హెండర్సన్ మాట్లాడుతూ.. ఈ అవకాశం కల్పించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారుఈ శిక్షణ కార్యక్రమం కేవలం సామర్థ్య పెంపుదలకు మాత్రమే కాకుండా భారత్సీషెల్స్ మధ్య ద్వైపాక్షిక చర్చలను ప్రోత్సహించడానికి.. ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుందని ఆయన ప్రముఖంగా చెప్పారు.

ఎన్‌సీజీజీ‌తో పాటు గత కొన్నేళ్లుగా ఆ సంస్థ సాధించిన కీలక విజయాల గురించి ఎన్‌సీజీజీ అసోసియేట్ ప్రొఫెసర్ఈ కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ బీ.ఎస్బిష్త్ వివరించారుఈ శిక్షణ ప్రధానంగా సుపరిపాలన సూత్రాలువిధానాల రూపకల్పనఅమలుపాలనలో సాంకేతిక ఆవిష్కరణలు వంటి అంశాలపై దృష్టి సారిస్తుందని ఆయన పేర్కొన్నారువీటితో పాటు కోర్టు నిర్వహణభారత్‌లో న్యాయ సంస్కరణలు-కోర్టులుప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకత కోసం జీఈఎంఏఐ ఆధారిత సుపరిపాలనడిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్పీఎం గతిశక్తిపరిపాలనలో నైతికతచిత్తశుద్ధిమౌలిక సదుపాయాలలో పీపీపీ నమూనాజాతీయ భద్రతడిజిటల్ చెల్లింపులు వంటి వైవిధ్యమైన అంశాలపై శిక్షణ ఉంటుందని ఆయన తెలిపారుశిక్షణలో భాగంగా రెండో దశలో అధికారులకు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు పలు ముఖ్యమైన సంస్థలకు క్షేత్రస్థాయి పర్యటనలు ఉంటాయని ఆయన వెల్లడించారు.

ఎన్‌సీజీజీ ఇప్పటి వరకు మడగాస్కర్మలేషియాశ్రీలంకబంగ్లాదేశ్కెన్యాటాంజానియాట్యునీషియాసెషెల్స్గాంబియామాల్దీవులుఆఫ్ఘనిస్తాన్లావోస్వియత్నాంనేపాల్భూటాన్మయన్మార్ఇథియోపియాఎరిట్రియాకాంబోడియాతో పాటు ఇతర ఆఫ్రికాలాటిన్ అమెరికా దేశాల నుంచి దాదాపు 52 దేశాలకు చెందిన 5,500 మందికి పైగా ప్రభుత్వ ఉన్నతాధికారులకు శిక్షణ అందించింది

కోర్సు సమన్వయకర్త డాక్టర్ బీ.ఎస్బిష్త్అసోసియేట్ సమన్వయకర్త డాక్టర్ సంజీవ్ శర్మ పర్యవేక్షణలో ఎన్‌సీజీజీ సామర్థ్య పెంపుదల బృంద సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు

***


(రిలీజ్ ఐడి: 2260525) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Tamil