రక్షణ మంత్రిత్వ శాఖ
భారత సైన్యానికి అయిదు గ్రౌండ్ బేస్డ్ మొబైల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కొనుగోలు కోసం
బీఈఎల్తో రక్షణ శాఖ రూ. 1,476 కోట్ల విలువైన ఒప్పందం
నాడు పోస్టు చేయడమైనది:
05 MAY 2026 3:33PM by PIB Hyderabad
భారత సైన్యం కోసం రూ. 1,476 కోట్ల విలువైన అయిదు గ్రౌండ్-బేస్డ్ మొబైల్ ఎలక్ట్రానిక్ వ్యవస్థల కొనుగోలుకు సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ హైదరాబాద్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది. కనీసం 72 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన ఈ ప్రాజెక్టును బై (భారతీయ- రూపకల్పన, అభివృద్ధి, తయారీ) విభాగం కింద చేపట్టారు. మే 05, 2026న న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్-2లో రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
ఈ వ్యవస్థల ద్వారా భారత సైనిక విభాగాల ఆధునికీకరణ జరగడమే కాకుండా, దేశీయ రక్షణ తయారీ రంగం మరింత బలోపేతం కానుంది. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలను సాధించడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ నిబద్ధతను ఈ ఒప్పందం మరోసారి చాటిచెప్పింది.
***
(రిలీజ్ ఐడి: 2258038)
సందర్శకుల సూచీ సంఖ్య : : 19