ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

ఆలోచనలు, నాయకత్వ సంగమం ఆంధ్ర విశ్వవిద్యాలయం:

విశాఖపట్నంలో జరిగిన విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకల్లో ఉపరాష్ట్రపతి

ఆంధ్రప్రదేశ్ భారీ పెట్టుబడులు, ఆవిష్కరణల కేంద్రంగా ఎదుగుతోంది: ఉపరాష్ట్రపతి

శాశ్వత రాజధానిగా ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్న అమరావతి: ఉపరాష్ట్రపతి

'వికసిత్ భారత్'కు 'వికసిత్ రాష్ట్రాలు' అవసరం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షను పునరుద్ఘాటించిన ఉపరాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 27 APR 2026 7:15PM by PIB Hyderabad

విశాఖపట్నంలో ఈరోజు జరిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలకు ఉపరాష్ట్రపతి సి.పిరాధాకృష్ణన్ హాజరయ్యారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది వేడుకల వంటి చారిత్రాత్మక సందర్భంలో భాగస్వామి కావడం తనకెంతో గర్వకారణమని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా అన్నారుచరిత్రను కేవలం చూడటమే కాకుండాఆ చరిత్రను మలచడంలో కూడా ఈ విశ్వవిద్యాలయం  సహాయపడిందనిఇది శతాబ్ద కాలంగా అత్యుత్తమ ప్రమాణాలను కొనసాగిస్తోందని ఆయన పేర్కొన్నారుగడిచిన వంద ఏళ్లలో ఈ విశ్వవిద్యాలయం ఆలోచనల సమ్మేళనంగా పనిచేసిందనిఈ విశ్వవిద్యాలయం తరతరాలుగా తీర్చిదిద్దిన విద్యార్థులెందరో దేశ నిర్మాణంలో గణనీయమైన కృషి చేశారని ఆయన అన్నారు

ఈ విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతిభారత అత్యంత విశిష్ట తాత్వికులు,  రాజనీతిజ్ఞులలో ఒకరైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్  వారసత్వాన్ని గౌరవంతో గుర్తుచేసుకుంటూవిద్య  మేధస్సును వ్యక్తిత్వాన్ని రెండింటినీ పెంపొందించే సాధనమన్న ఆయన దార్శనికతను ఉపరాష్ట్రపతి ప్రస్తావించారుఈ దార్శనికత నేటికీ ఎంతగానో ప్రాముఖ్యత కలిగి ఉందని ఆయన అన్నారు.

విశాఖపట్నంతో  ప్రముఖుల అనుబంధాన్ని కూడా ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తుచేశారుఈ నగరంలోనే ప్రాథమిక విద్యను అభ్యసించిన నోబెల్ బహుమతి గ్రహీత సి.విరామన్ఈ విశ్వవిద్యాలయం విశిష్ట పూర్వ విద్యార్థిమాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎంవెంకయ్య నాయుడు వంటి వారిని ఆయన ప్రస్తావించారుశాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారంపద్మ విభూషణ్పద్మశ్రీ,  సాహిత్య అకాడమీ గౌరవాలు పొందిన ఎంతో మంది ప్రముఖులను ఆంధ్ర విశ్వవిద్యాలయం తీర్చిదిద్దిందని ఆయన పేర్కొన్నారు.

గతంలో తన విశాఖ పర్యటననుముఖ్యంగా 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సును గుర్తుచేసుకుంటూముఖ్యమంత్రి శ్రీ ఎన్చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన వేగవంతమైన పురోగతి పట్ల ఉపరాష్ట్రపతి సంతృప్తిని వ్యక్తం చేశారురాష్ట్రం తన అభివృద్ధి ప్రయాణాన్ని వేగవంతం చేసిందనిభారీ పెట్టుబడులను ఆకర్షిస్తూఆవిష్కరణలుఅభివృద్ధికి కేంద్రంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని ఆయన పేర్కొన్నారురాష్ట్ర సాంకేతిక పరిజ్ఞాన వ్యవస్థను ప్రోత్సహించడంలో ఐటి మంత్రి శ్రీ నారా లోకేష్ పోషిస్తున్న పాత్రను కూడా ఆయన అభినందించారు.

ఆంధ్రప్రదేశ్‌పై అంతర్జాతీయంగా పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రముఖంగా పేర్కొంటూగూగుల్ వంటి ప్రముఖ సాంకేతిక సంస్థల ఆసక్తిని,  పెట్టుబడులను ఉపరాష్ట్రపతి ప్రస్తావించారుహైపర్‌స్కేల్ డేటా సెంటర్లుఐటి పెట్టుబడుల వంటి ప్రధాన ప్రాజెక్టులతోముఖ్యంగా డేటా సెంటర్లుఐటిపర్యాటకంఎలక్ట్రానిక్స్డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాలలో విశాఖపట్నం ఒక కీలక వృద్ధి కేంద్రంగా ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు.

పార్లమెంటులో సంబంధిత బిల్లు ఆమోదం పొందిన తర్వాతఅమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా ప్రకటించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉపరాష్ట్రపతి అభినందించారుఆ బిల్లు ఆమోదం పొందే సమయంలో రాజ్యసభకు అధ్యక్షత వహించే అవకాశం తనకు లభించిందనిఅప్పుడు ప్రజల ఆనందాన్నిగర్వాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని ఆయన గుర్తుచేసుకున్నారుఈ నిర్ణయం ప్రజల సామూహిక ఆకాంక్షలకు ప్రతిబింబమనిఇది రాష్ట్ర పరిపాలనా భవిష్యత్తుకు స్పష్టతనుస్థిరత్వాన్నిదిశానిర్దేశాన్ని అందిస్తుందని ఆయన అభివర్ణించారు.

అభివృద్ధి చెందిన భారతదేశ సాధన లక్ష్యాన్ని గురించి ప్రస్తావిస్తూ, "వికసిత రాష్ట్రాల ద్వారానే వికసిత్ భారత్ సాధ్యమవుతుందిఅని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్న మాటలను ఉపరాష్ట్రపతి గుర్తుచేశారుదార్శనిక నాయకత్వంబలమైన పాలనసమర్థవంతమైన అమలుతో ఆంధ్రప్రదేశ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటిగా ఆవిర్భవించిందని ఆయన పేర్కొన్నారు.

2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ప్రతిపాదించిన పెట్టుబడులలో 25 శాతానికి పైగా వాటాతోఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అగ్రగామి గమ్యస్థానంగా మారిందని ఆయన పేర్కొన్నారునిర్ణీత సమయంలో అనుమతులుపారదర్శకమైన పాలనభూమివిద్యుత్అనుసంధానత,  నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని సులభంగా పొందడానికి వీలు కల్పించే పటిష్టమైన సింగిల్-విండో వ్యవస్థ వంటి రాష్ట్రంలోని పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
విజయం సాధించడానికి సమయం పడుతుందని పేర్కొంటూ, 'క్రికెట్ దేవుడు'గా ఎంతో ప్రేమతో పిలుచుకునే సచిన్ టెండూల్కర్ కూడా తన సెంచరీల సెంచరీని (వంద సెంచరీలనుసాధించడానికి వేచి చూడాల్సి వచ్చిందని ఉపరాష్ట్రపతి చెప్పారువిజయం సాధించడంలో ఓపిక ఎంతో అవసరమని ఆయన అన్నారు

ఒత్తిడిని తట్టుకోవడం నేర్చుకోవాలని ఆయన తెలిపారువైఫల్యాలు విలువైన పాఠాలను నేర్పుతాయనివాటివల్ల నిరుత్సాహపరచకూడదనిజీవితాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని ఆయన  పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో భాగంగామాజీ ఉపరాష్ట్రపతి ఎంవెంకయ్య నాయుడుఒడిశా గవర్నర్ కెహరిబాబుజిఎంఆర్ గ్రూప్ వ్యవస్థాపకులు,  ఛైర్మన్ గ్రంధి మల్లికార్జున రావుభారత ప్రభుత్వ మాజీ కేంద్ర హోం కార్యదర్శి కెపద్మనాభయ్యసైయంట్ వ్యవస్థాపకులుఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డిలారస్ ల్యాబ్స్ వ్యవస్థాపకులుసిఇఓ సత్యనారాయణ చావఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీఢిల్లీ మాజీ డైరెక్టర్ విఎస్రాజుఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,  కాన్పూర్ మాజీ ప్రొఫెసర్ ఎంఆర్ మాధవ్ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా  సిఇఓ విజయ్ జోషిసినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లకు ఉపరాష్ట్రపతి 'విశిష్ట పూర్వ విద్యార్థుల పురస్కారాలనుప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి స్మారక నాణెంస్మారక స్టాంపుకాఫీ టేబుల్ బుక్‌ను కూడా విడుదల చేశారుఉపరాష్ట్రపతి సమక్షంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంఅమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాఅమెరికాలోని ఆక్స్‌మిక్ ల్యాబ్స్ ఇంక్., ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ ల మధ్య మూడు అవగాహన ఒప్పందాలు కుదిరాయిఅనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయ చరిత్రనుదాని పరిణామక్రమాన్ని ప్రతిబింబించే ఫోటో ప్రదర్శనను ఆయన సందర్శించారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ఆంధ్ర విశ్వవిద్యాలయం ఛాన్సలర్ శ్రీ అబ్దుల్ నజీర్మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎంవెంకయ్య నాయుడుముఖ్యమంత్రి శ్రీ ఎన్చంద్రబాబు నాయుడుకేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడుదిగ్గజ క్రికెటర్ శ్రీ సచిన్ టెండూల్కర్ఒడిశా గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటికేంద్ర సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మరాష్ట్ర ఐటీహెచ్ఆర్‌డి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామిఉపకులపతి ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ లతో పాటు విద్యార్థులుఅధ్యాపకులుసిబ్బంది పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఉపరాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ అంతకుముందు శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ కూర్మనాథ స్వామి ఆలయాన్నిఅరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించిప్రత్యేక పూజలు నిర్వహించారు

 

***


(రిలీజ్ ఐడి: 2256164) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Telugu_Vw