రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

జర్మనీతో వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం బలోపేతం... బెర్లిన్ లో రక్షణ మంత్రితో శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ద్వైపాక్షిక చర్చలు...


రక్షణ పరిశ్రమ సహకార ప్రణాళిక, యూఎన్ శాంతి పరిరక్షణ శిక్షణలో సహకారానికి భారత్-జర్మనీ మధ్య ఒప్పందం

ఉగ్రవాదాన్ని మినహాయింపులు, సమర్థనలు లేకుండా, నిస్సందేహంగా ఖండించాలి: శ్రీ రాజ్‌నాథ్ సింగ్

నాడు పోస్టు చేయడమైనది: 22 APR 2026 6:08PM by PIB Hyderabad

జర్మనీ దేశంతో వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఏప్రిల్ 22, 2026న బెర్లిన్‌లో జర్మనీ రక్షణ మంత్రి శ్రీ బోరిస్ పిస్టోరియస్‌తో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ద్వైపాక్షిక చర్చలు జరిపారుఈ సందర్భంగా ఇద్దరు మంత్రులు ద్వైపాక్షిక భద్రతరక్షణకు సంబంధించిన అంశాలపై చర్చించారుఇందులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగంలో రక్షణ పరికరాల ఉమ్మడి అభివృద్ధిఉత్పత్తికి సంబంధించిన ప్రాధాన్యతా అంశాలున్నాయివ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలక సైనిక సహకారాన్ని మరింత పెంచేందుకు ఇరుదేశాలు నిబద్ధతను స్పష్టం చేశాయి.

ఈ సమావేశంలో రక్షణ పరిశ్రమ సహకార ప్రణాళికయూఎన్ శాంతి పరిరక్షణ శిక్షణలో సహకారానికి అమలు ఒప్పందంపై సంతకాలు చేసిపరస్పరం మార్చుకున్నారుజర్మనీ పర్యటనను అమితమైన స్నేహంసమన్వయంవిశ్వాసానికి ప్రతీకగా రక్షణ మంత్రి అభివర్ణించారుజర్మనీ రక్షణ మంత్రిగా శ్రీ బోరిస్ పిస్టోరియస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరుదేశాల రక్షణ సహకారంలో గణనీయమైన పురోగతి ఉందన్నారు.

ఇటీవల భారత్-ఈయూ మధ్య కుదిరిన భద్రతరక్షణ భాగస్వామ్యం.. ఉమ్మడి సహకారాన్ని మరింత బలోపేతం చేయటంలో కీలక ముందడుగని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారుప్రాంతీయ స్థిరత్వాన్ని బలోపేతం చేసేందుకుఉమ్మడి సామర్థ్యాలను మెరుగుపరిచేందుకుభారత్-జర్మనీల మధ్య దీర్ఘకాలిక వ్యూహాత్మక బంధాన్ని మరింత పటిష్ఠం చేసే స్పష్టమైన ఫలితాల కోసం ఈ భాగస్వామ్య వ్యవస్థను ద్వైపాక్షికంగానూయూరోపియన్ దేశాల పరిధిలోనూ ఉపయోగించుకోవాలని ఇద్దరు మంత్రులు అంగీకరించారు.

ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. భారత్జర్మనీ దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్నిబలాన్ని చేకూర్చాయని రక్షణ మంత్రి స్పష్టం చేశారుఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నాఏ విధంగా వ్యక్తమైనా ఆ ముప్పును ఖచ్చితంగా ఖండించాలని చెప్పారుఎలాంటి మినహాయింపులుసమర్థనలు లేకుండా ఉగ్రవాదాన్ని నిస్సందేహంగా ఖండించాలని పిలుపునిచ్చారు.

సేవల స్థాయి సిబ్బంది చర్చల వ్యవస్థీకరణభవిష్యత్తులో జరగబోయే ద్వైపాక్షిక సైనిక విన్యాసాలను జర్మనీ రక్షణ మంత్రి అభినందించారుఈ ఏడాది సెప్టెంబర్అక్టోబర్ నెలల్లో భారతదేశంలో నిర్వహించనున్న ఎక్స్-తరంగ్ శక్తి తదుపరి ఎడిషన్‌లో జర్మనీ వైమానిక దళం పాల్గొనాలని రక్షణ మంత్రి ఆహ్వానించారు.

 

ఈ సమావేశానికి ముందు జర్మనీ రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్న శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌కు గౌరవ వందనంతో ఘన స్వాగతం లభించింది.

అంతకు ముందుబుండెస్వెహర్ స్మారక చిహ్నం వద్ద రక్షణ మంత్రి నివాళులర్పించారువిధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన బుండెస్వెహర్ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన స్మారక చిహ్నమది.

భారత్జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయ్యాయిఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు 2026లో 75 ఏళ్లు పూర్తవుతాయిద్వైపాక్షిక స్థాయిలో ప్రస్తుతం ఈ బంధం పలు రంగాలకు విస్తరించిందిరక్షణ రంగంలో పాటు వాణిజ్యంపెట్టుబడిసాంకేతికతఆవిష్కరణలుఅభివృద్ధి సహకారంస్వచ్ఛ ఇంధనంఉన్నత విద్యసుస్థిర పరిష్కారాలుసంస్కృతిప్రజల మధ్య సంబంధాలు వంటి అనేక రంగాల్లో ఇరుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయిఇది భాగస్వామ్య బలాన్నివిస్తృతిని తెలియజేయటమే కాకసామర్థ్యాన్నిభవిష్యత్తుపై నమ్మకాన్ని చాటిచెబుతుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2254805) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी