ప్రధాన మంత్రి కార్యాలయం
ఇది చార్ధామ్ యాత్రా సమయం... శ్రీ కేదార్నాథ్ ఆలయం ఎదురు చూస్తోందన్న ప్రధానమంత్రి
భక్తకోటిని ఉద్దేశించి రాసిన లేఖలో తన భావాలను పంచుకున్న ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
22 APR 2026 11:28AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన భక్తితత్పరతను వ్యక్తీకరిస్తూ భక్తకోటికి ఒక లేఖ రాశారు. ఈ సంవత్సరం చార్ధామ్ యాత్ర మొదలైందని, దేవభూమి ఉత్తరాఖండ్లోని శ్రీ కేదార్నాథ్ ధామ్ తలుపులను తెరిచారనీ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. యాత్రలో పాలుపంచుకోవడానికి ఉత్తరాఖండ్కు వెళ్తున్న భక్తులను ఉద్దేశించి ఆయన ఒక లేఖను రాస్తూ, వారంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. భక్తులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భానికున్న ఆధ్యాత్మిక విశిష్టతను శ్రీ మోదీ ప్రస్తావిస్తూ కేదార్నాథ్ ధామ్, చార్ధామ్ల సందర్శన యాత్ర మన నమ్మకం, ఏకత, సమృద్ధ సాంస్కృతిక సంప్రదాయాల దివ్య ఉత్సవంగా వర్ణించారు. ఈ యాత్రలతో మనకు భారత సనాతన సంస్కృతితో పాటు ఆధ్యాత్మిక చేతనల దర్శనం కూడా లభించగలదని స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘దేవభూమి ఉత్తరాఖండ్ పవిత్ర ధరిత్రిలో శ్రీ కేదార్నాథ్ ఆలయాన్ని ఈ రోజు పూర్తి విధివిధాన సహితంగా మన భక్తగణం కోసం తెరిచారు.
కేదార్నాథ్ ధామ్తో పాటు చార్ధామ్ను దర్శించుకొనేందుకు చేపట్టే ఈ యాత్ర మన నమ్మకం, ఏకత, సమృద్ధ సంప్రదాయాల సమ్మిళిత దివ్య ఉత్సవంగా భాసిస్తోంది. ఈ యాత్రలతో మనం భారత సనాతన సంస్కృతిని కూడా అనుభవంలోకి తెచ్చుకుంటాం.
ఈ సంవత్సరం చార్ధామ్ యాత్ర ఆరంభోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్కు విచ్చేసే భక్తగణాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నా భావనలను ఒక లేఖలో వ్యక్తం చేశాను.
బాబా కేదార్ కృప అందరిపై వర్షించాలనీ, యాత్రలు శుభకరంగా పూర్తవ్వాలనీ నేను కోరుకుంటున్నాను.
హర్- హర్ మహాదేవ్’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2254419)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9