ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కేరళలోని త్రిస్సూర్‌ బాణసంచా పరిశ్రమలో ప్రమాదం... ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం


పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి నష్ట పరిహారం ప్రకటించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 21 APR 2026 8:24PM by PIB Hyderabad

కేరళలోని త్రిస్సూర్‌లో ఓ బాణాసంచా కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున నష్ట పరిహారాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రకటించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘కేరళలోని త్రిస్సూర్‌లో ఒక బాణాసంచా పరిశ్రమంలో జరిగిన ప్రమాదంలో అనేక మంత్రి ప్రాణాలు కోల్పోయారన్న వార్త విని కలత చెందాను. ఈ ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను: ప్రధానమంత్రి’’

 

‘‘మరణించిన వారి కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు.. అలాగే గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఇవ్వనున్నట్లు  ప్రధానమంత్రి ప్రకటించారు’’.

 

***

 

(రిలీజ్ ఐడి: 2254364) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Kannada , Malayalam