ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ ఆకస్మిక మృతికి ప్రధానమంత్రి సంతాపం
प्रविष्टि तिथि:
19 SEP 2025 6:26PM by PIB Hyderabad
ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ ఆకస్మిక మృతిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సంతాపం వ్యక్తం చేశారు. సంగీత రంగానికి ఆయన చేసిన గొప్ప కృషితో చిరకాలం గుర్తుండిపోతారు’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
‘‘ఎక్స్’’లో చేసిన పోస్టులో ప్రధాని శ్రీ మోదీ ఇలా అన్నారు.
"ప్రఖ్యాత గాయకుడు జుబీన్ గార్గ్ అకస్మాత్తుగా మరణించిన వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. సంగీతానికి ఆయన అందించిన అమూల్యమైన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అన్ని వర్గాల ప్రజల్లో ఆయన పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.’’
(रिलीज़ आईडी: 2254269)
आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam