ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మనీ లాండరింగ్, ఆర్థిక నేరాలను ఎదుర్కొనేందుకు భారత ఆర్థిక నిఘా యూనిట్, సెబీ మధ్య కుదిరిన ఎంవోయూ

నాడు పోస్టు చేయడమైనది: 16 APR 2026 1:19PM by PIB Hyderabad

 

మనీ లాండరింగ్ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను మరింత బలోపేతం చేసే దిశగా భారత ఆర్థిక నిఘా యూనిట్ (ఎఫ్ఐయూ-ఐఎన్‌డీ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీమధ్య అవగాహన ఒప్పందం కుదిరిందిఇది రెండు సంస్థల మధ్య సమాచారం పంచుకోవడాన్నిసమన్వయాన్ని పెంచుతుంది.

ఎఫ్ఐయూ-ఐఎన్‌డీ డైరెక్టర్ శ్రీ అమిత్ మోహన్ గోవిల్సెబీలో పూర్తి కాల సభ్యులు శ్రీ సందీప్ ప్రధాన్ ఈ ఎంవోయూపై సంతకాలు చేశారుమనీ లాండరింగ్ఆర్థిక నేరాలపై భారత్ సాగిస్తున్న పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ రెండు సంస్థల మధ్య నిఘా సమాచారాన్ని పంచుకోవడంలో కొత్త శకానికి ఈ ఒప్పందం నాంది పలికింది.

image.png

image.png

తమ డేటాబేస్‌లో అందుబాటులో ఉన్న సంబంధిత నిఘాసమాచారాన్ని పరస్పరం పంచుకోవడం ఈ ఒప్పందంలో భాగంగా ఉందిఅలాగే పీఎంల్ నియమాల ప్రకారం నియంత్రణనివేదిక సంస్థలు ఎఫ్ఐయూ-ఐఎన్‌డీకి సమాచారాన్ని అందించడానికి అవసరమైన విధానాలనునమూనాలను రూపొందించడం కూడా ఒప్పందంలో భాగంగా ఉందిఎగ్మాంట్ సమాచార మార్పిడి సూత్రాల ద్వారా విదేశీ ఎఫ్ఐయూలతో సమాచారాన్ని పంచుకోవడంలో కూడా ఈ ఎంవోయూ సాయపడుతుంది.

నియంత్రణ/నివేదిక సంస్థల కోసం అవగాహనశిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసేలా రెండు సంస్థలకు వీలు కల్పించడమే ఈ ఎంవోయూ లక్ష్యంఇది సెబీ నియంత్రణలో ఉన్న సంస్థల్లో మనీలాండరింగ్ నిరోధకఉగ్రవాదులకు ఆర్థిక సహకారాన్ని అడ్డుకొనే (ఏఎంఎల్/సీఎఫ్‌టీసామర్థ్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తుందిఅలాగే ఇరుపక్షాలు అంతర్జాతీయ నియమాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ... సమాచారాన్ని పంచుకొనేందుకుపరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై చర్చించేందుకు త్రైమాసిక సమావేశాలను నిర్వహించాలి.

సంబంధిత ఆర్థిక ఉప రంగాల్లో మనీ లాండరింగ్ఉగ్రవాదులకు ఆర్థిక సాయం (ఎంఎల్/టీఎఫ్ముప్పులనుబలహీనతలను అంచనా వేయడంఅనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన హెచ్చరికలను గుర్తించిప్రచారం చేయడం ఈ సహకారంలో భాగంగా ఉన్నాయివీటితో పాటుగా.. పీఎంఎల్ఏపీఎంఎల్ నియమాలుసెబీ మార్గదర్శకాల ప్రకారం నివేదిక సంస్థలు తమ విధులను నిర్వర్తిస్తున్న తీరును పర్యవేక్షించడం కూడా ఈ ఒప్పందంలో భాగమే.

భారత ఆర్థిక నిఘా యూనిట్ (ఎఫ్ఐ‌యూ-ఐఎన్‌డీగురించి:

అనుమానిత ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని స్వీకరించివిశ్లేషించిప్రసారం చేయడంమనీలాండరింగ్ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయానికి వ్యతిరేకంగా సమన్వయ చర్యలు తీసుకొనే బాధ్యతలను జాతీయ సంస్థ ఎఫ్ఐయూ-ఐఎన్‌డీ చేపడుతుంది.

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీగురించి

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా చట్టం - 1992 ప్రకారం చట్టబద్ధమైన సంస్థగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ)ను ఏర్పాటు చేశారుఇది భారత్‌లోని సెక్యూరిటీస్ మార్కెట్ల నియంత్రణపర్యవేక్షణ చేపడుతుందిఅలాగే పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తుందిమార్కెట్ వ్యవస్థలో పారదర్శకతసమగ్రతక్రమబద్ధమైన పనితీరును నిర్ధారించేందుకు మార్కెట్ మధ్యవర్తులునమోదిత సంస్థలుఇతర భాగస్వాములకు సమగ్రమైన నియంత్రణపర్యవేక్షణా విధానాన్ని సెబీ అందిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2252627) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Gujarati , Telugu