మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్రమంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన న్యూఢిల్లీలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారుల సమావేశం-2026.. ప్రపంచ మార్కెట్లో విస్తరణకు వ్యూహరచన


విలువ ఆధారిత మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల పెంపు.. ఈఈజడ్, అంతర్జాతీయ జలాల్లోని సముద్ర వనరుల వినియోగంపై భారత్ దృష్టి

సరికొత్త లక్ష్యాలను అధిగమించిన భారత సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులు.. గతేడాది రూ.62,000 కోట్ల ఎగుమతులు, ఈ ఏడాది రూ.68,000 కోట్ల ఎగుమతులు, దాదాపు రూ.6,000 కోట్ల నికర వృద్ధి

నాడు పోస్టు చేయడమైనది: 11 APR 2026 7:23AM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని అంబేద్కర్ భవన్‌లో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతిదారుల సమావేశం-2026ను కేంద్ర మత్స్య శాఖపశుసంవర్ధకపాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ పరిధిలోని మత్స్య విభాగం నిర్వహించిందిఈ సమావేశానికి కేంద్ర మత్స్యపశుసంవర్ధకపాడిపరిశ్రమ (ఎంఓఎఫ్ఏహెచ్‌డీ), పంచాయతీరాజ్ శాఖ (ఎంఓపీఆర్మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారుఎంఓఎఫ్ఏహెచ్‌డీఎంఓపీఆర్ శాఖ సహాయమంత్రి ప్రొఫెసర్ ఎస్.పీసింగ్ బఘేల్ఎంఓఎఫ్ఏహెచ్‌డీమైనారిటీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ జార్జ్ కురియన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారుప్రభుత్వంపరిశ్రమల భాగస్వాముల మధ్య నిర్మాణాత్మక చర్చలకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారుమార్కెట్ లభ్యతధరల ఒత్తిడినిబంధనల అమలు వంటి అంశాల్లో ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లపై అభిప్రాయాలను తెలుసుకోవటమే ఈ కార్యక్రమం ఉద్దేశంద్వీపాలుఈఈజడ్ బహిరంగ సముద్రాల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల పెంపుమార్కెట్ విస్తరణసముద్ర ఉత్పత్తుల ఎగుమతుల వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.

సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులను పెంచటంలో ఎగుమతిదారులు చేస్తున్న కృషిని కేంద్రమంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అభినందించారుప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీఅమెరికా మినహా ఇతర మార్కెట్లలో కనబరిచిన అద్భుతమైన వృద్ధి వల్ల భారత సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో పటిష్టమైన అభివృద్ధి నమోదైనట్లు ఆయన స్పష్టం చేశారునిరంతరాయంగా కొత్త మార్కెట్ల అన్వేషణఉత్పత్తుల్లో వైవిధ్యాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూనే.. యాంటీబయాటిక్స్ నిషేధాన్ని పాటించటంఉత్పత్తి మూలాలను గుర్తించే వ్యవస్థలను బలోపేతం చేయటం వంటి కఠినమైన నియంత్రణ నిబంధనలను పాటించాలని మంత్రి స్పష్టం చేశారుఈఈజడ్ నిబంధనలను ప్రస్తావిస్తూ.. యాక్సెస్ పాస్‌ల ద్వారా ఈ వ్యవస్థను అమల్లోకి తెస్తున్నామనిసమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించటానికి సహకార సంఘాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారుఅండమాన్నికోబార్ దీవులుఈఈజడ్అంతర్జాతీయ సముద్ర జలాల నుంచి లభించే ట్యూనా వంటి అత్యంత విలువైన చేప రకాల ఎగుమతి సామర్థ్యాన్ని ఆయన స్పష్టం చెప్పారుచేపల వేట తర్వాత జరిగే నష్టాలను తగ్గించటానికిఎగుమతి వ్యవస్థను బలోపేతం చేయటానికి పడవల్లోనే వాటిని భద్రపరిచే విధానాలను మెరుగుపరచాలనిశీతలీకరణ వ్యవస్థలకు సంబంధించి పటిష్ఠమైన మౌలిక సదుపాయాలను కల్పించాలనిమెరుగైన ప్యాకేజింగ్విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీప్రత్యామ్నాయ మార్కెట్ల అన్వేషణ అవసరమని ఆయన పిలుపునిచ్చారులక్ష కోట్ల రూపాయల ఎగుమతి లక్ష్యాన్ని సాధించే దిశగా ఎగుమతిదారులు కృషి చేయాలనిబహిరంగ మార్కెట్ విధానాన్ని అవలంబించాలని కోరారుఇందుకోసం ఈఐసీఎన్‌సీడీసీనాబార్డ్‌ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ వంటి సంస్థల నుంచి పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారుఅండమాన్నికోబార్ దీవుల్లో నిర్వహించిన పెట్టుబడిదారుల సమావేశం గురించి కూడా ప్రస్తావించారుఈ సమావేశం ద్వారా సముద్రంలో పంజరపు పెంపకంముత్యాల సాగులోతైన సముద్ర ప్రాంతాల్లో చేపల వేటకు ఉపయోగించే నౌకల వంటి వాటిల్లో పెట్టుబడులు పెరిగాయనిఇవి మత్స్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆయన చెప్పారు.

మత్స్యపశు సంవర్ధకపాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖమైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయమంత్రి శ్రీ జార్జ్‌ కురియన్ మాట్లాడుతూ.. బడ్జెట్ అనంతర వెబినార్-2026 లక్ష్యాలకు అనుగుణంగా మత్స్య రంగాన్ని అత్యంత విలువైనదిగాఅధిక డిమాండ్ గల రంగంగా తీర్చిదిద్దేందుకు సమష్టి కృషి చేస్తున్నట్లు తెలిపారుసముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో కనిపిస్తున్న ప్రోత్సాహకరమైన వృద్ధిని ప్రస్తావిస్తూ.. ఎగుమతిదారులు చేస్తున్న నిరంతర ప్రయత్నాలను అభినందించారుఎగుమతుల వృద్ధిని నిలబెట్టుకోవటానికి ఉత్పత్తి మూలాలను గుర్తించటంనాణ్యత ధ్రువీకరణలతో కఠినమైన నిబంధనల అమలుపటిష్టమైన రవాణా వ్యవస్థవిలువ వ్యవస్థ అభివృద్ధి అత్యంత ఆవశ్యకమని వ్యాఖ్యానించారు.

కేంద్ర మత్స్య విభాగ కార్యదర్శి అభిలక్ష్ లిఖీ ప్రసంగిస్తూ.. ఎంపీఈడీఏఈఐసీవాణిజ్య శాఖల సమన్వయంతో విభిన్న మార్కెట్ విస్తరణ వ్యూహాన్ని రూపొందించినట్లు తెలిపారుదాదాపు నలభై దేశాల రాయబారులతో జరిపిన దౌత్యపరమైన చర్చలు ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇచ్చాయని ఆయన స్పష్టం చెప్పారుమార్కెట్ విస్తరణతో పాటుగాతినటానికివండటానికి సిద్ధంగా ఉండేవిలువ ఆధారిత సముద్ర ఆహార ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముందని తెలిపారుసముద్ర ఆహార ఎగుమతులను ప్రోత్సహించటానికి ఎగుమతిదారులకువిదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలకు మధ్య నేరుగా సంబంధాలను ఏర్పరచటానికి మత్స్య శాఖ సహకరిస్తుందని తెలిపారుఎగుమతిదారులకు మద్దతు ఇవ్వటానికినాణ్యతా ప్రమాణాలుపోటీతత్వంఎగుమతి సంసిద్ధతను మెరుగుపరచటానికి అవసరమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను బలోపేతం చేయాలని ఎంపీఈడీఏను కోరారు.

సమావేశంలో పాల్గొన్న వాటాదారులు భారత ప్రభుత్వ క్రియాశీల మద్దతును అభినందించారుసముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులను పెంచటంలోని ప్రధాన సవాళ్లనుఅవకాశాలను వివరించారుముఖ్యంగా చేపల వేట ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను సరళతరం చేయాలని.. అండమాన్నికోబార్ దీవుల్లో కప్పాఫైకస్ రకపు సముద్రపు పాచి సాగుకు అనుమతులను సులభతరం చేయాలని కోరారుశాస్త్రీయ పద్ధతిలో నాణ్యమైన చేపల మేతను తయారు చేసేందుకు ఫిష్-మీల్ తయారీదారులకు ప్రత్యేక మద్దతును అందించాలని విజ్ఞప్తి చేశారుపశ్చిమ తీరంలో మంచినీటి మత్స్య సాగుసముద్ర సాగు ఎగుమతి సామర్థ్యాన్ని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించారుఎగుమతులపై ప్రభావం చూపే ఇతర సవాళ్లపైనా దృష్టి సారించారువీటిలో ప్రధానంగా సుంకాలుమార్కెట్ ప్రవేశంలో ఆటంకాలుఅధిక నిర్వహణ ఖర్చులువాల్యూ-యాడెడ్ ప్రాసెసింగ్ సామర్థ్య లోపాలుశీతలీకరణ వ్యవస్థలు రవాణా ఇబ్బందులున్నాయివీటన్నింటితో పాటు మూలాలను గుర్తించిఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించే వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని వారు సూచించారు.

ఈ సమావేశానికి సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి అథారిటీ (ఎంపీఈడీఏ), జాతీయ మత్స్య సంపద అభివృద్ధి బోర్డు (ఎన్ఎఫ్‌డీబీ), ఎక్స్‌పోర్టు ఇన్‌స్పెక్షన్ కౌన్సిల్ (ఈఐసీ), జాతీయ వ్యవసాయగ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్), నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ), నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్సు లిమిటెడ్ (ఎన్‌సీఈఎల్‌), ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఓఎఫ్‌పీఐ), ఇతర సంబంధిత మంత్రిత్వ శాఖల అధికారులు హాజరయ్యారువీరితో పాటు సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాఇండియన్ మెరైన్ ఇంగ్రీడియంట్స్ అసోసియేషన్సీవీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి ఎగుమతిదారుల సంఘాల ప్రతినిధులు.. సీఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్సాషిమి ఫుడ్స్ఆక్వాగ్రి ప్రాసెసింగ్అనేమ్కోఓషియానిక్ హోరిజన్ వంటి పరిశ్రమల ప్రతినిధులువివిధ సహకార సంఘాలుఎగుమతిదారులు పాల్గొన్నారుభారత ప్రభుత్వ మత్స్య విభాగ సీనియర్ అధికారులతో పాటు ఒడిశాగుజరాత్దాద్రా నగర్ హవేలీడామన్ డయ్యూగోవాఅండమాన్ నికోబార్ దీవులులక్షద్వీప్ మత్స్య శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

నేపథ్యం

భారతదేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు గత 11 ఏళ్లలో సగటున శాతం వార్షిక వృద్ధి రేటుతో స్థిరమైనబలమైన వృద్ధిని నమోదు చేశాయిఈ సమయంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు రెట్టింపునకు పైగా పెరిగాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 30,213 కోట్లుగా ఉన్న ఎగుమతులు, 2024-25 నాటికి రూ. 62,408 కోట్లకు చేరాయిఇందులో ప్రధానంగా రూ. 43,334 కోట్ల విలువైన రొయ్యల ఎగుమతులు కీలకమైనవి.

భారతదేశపు సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతులు ఎంతో వైవిధ్యమైనవిసుమారు 350కి పైగా రకాల ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 130 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతి విలువలో 36.42శాతం వాటాతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో చైనాయూరోపియన్ యూనియన్ఆగ్నేయాసియాజపాన్మధ్యప్రాచ్య దేశాలుమిగిలిన మార్కెట్లతో కలిపి సుమారు శాతం వాటాతో ఉన్నాయికేవలం కొన్ని రకాల ఉత్పత్తులపైనే అతిగా ఆధారపడటాన్ని తగ్గించటానికిప్రపంచ మార్కెట్లో ఉనికిని మరింత బలోపేతం చేసుకోవటానికిఎగుమతి చేసే ఉత్పత్తుల జాబితాను వైవిధ్యభరితంగా మార్చేందుకు భారత ప్రభుత్వం దృష్టి సారిస్తోందిప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వైద్వారా విలువ ఆధారిత వ్యవస్థ అంతటా మత్స్య శాఖ వివిధ రకాల సహాయక చర్యలను అందిస్తోందిఇందులో నాణ్యమైన చేప పిల్లల ఉత్పత్తిఉప్పునీటి సాగు విస్తరణవైవిధ్యతఎగుమతి ఆధారిత జాతుల ప్రోత్సాహంసాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటంవ్యాధి నిర్ధారణనిర్వహణఉత్పత్తి మూలాలను గుర్తించటంనైపుణ్యాల పెంపు వంటివి ఉన్నాయివీటితో పాటు పంట అనంతర మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటానికినిరంతర శీతల గిడ్డంగి వ్యవస్థలుఆధునిక మత్స్యకార ఓడరేవులుచేపల ల్యాండింగ్ కేంద్రాల ఏర్పాటునకు భారీగా పెట్టుబడులు పెడుతుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2251298) సందర్శకుల సూచీ సంఖ్య : : 22
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी