ప్రధాన మంత్రి కార్యాలయం
‘మన్ కీ బాత్’ 132వ ఎపిసోడ్ విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
29 MAR 2026 3:03PM by PIB Hyderabad
‘మన్ కీ బాత్’ 132వ ఎపిసోడ్ విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వరుస పోస్ట్లలో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:
“ప్రస్తుత యుద్ధం కారణంగా తలెత్తిన ప్రపంచ సంక్షోభాన్ని 140 కోట్ల మంది దేశ ప్రజల సామర్థ్యంతో భారత్ ధైర్యంగా ఎదుర్కొంటోంది. మనమందరం ఐక్యంగా ఉండి గతంలో మాదిరిగానే ఈ సవాలు నుంచి కూడా పూర్తిగా బయటపడతామని నాకు పూర్తి నమ్మకం ఉంది.”
"ఈ రోజు ప్రతిచోటా యోగా పట్ల పెరుగుతున్న ఆసక్తిని చూడటం చాలా సంతోషాన్నిస్తోంది. ఆరోగ్యం గురించి దేశ ప్రజలకు మరోసారి నా విన్నపం..."
"దేశవ్యాప్తంగా 'పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకం' ప్రయోజనాలను ప్రజలు పొందుతున్న తీరు ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్ నుంచి రాజస్థాన్, త్రిపుర వరకు అందుతున్న ఉదాహరణలు చూస్తుంటే... ఈ పథకం వల్ల ఆదాయం పెరగడమే కాకుండా ప్రజల జీవితాలు మరింత సులభతరం అవుతున్నాయని స్పష్టమవుతోంది."
"త్రిపుర నుంచి ఛత్తీస్గఢ్, తెలంగాణ వరకు జరుగుతున్న జల సంరక్షణ ప్రయత్నాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచాయి. ప్రజా భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రచారాల వల్ల నీటి సమస్య తీరడమే కాకుండా వ్యాధులు కూడా తగ్గుముఖం పట్టాయి."
"మీకు సంస్కృతి, పురాతన రాతప్రతులు అంటే ఆసక్తి ఉంటే 'జ్ఞాన్ భారతం సర్వే'లో తప్పకుండా పాల్గొనాలి. ఈ దిశగా అరుణాచల్ ప్రదేశ్, లే, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు చేస్తున్న కృషి ఎంతో విశేషమైనది."
" ‘మై భారత్’ బృందం చేపట్టిన ‘బడ్జెట్ క్వెస్ట్’ ఒక గొప్ప ప్రయత్నం. మన యువశక్తి రాసిన కొన్ని వ్యాసాలు దేశ నిర్మాణంలో వారికున్న అంకితభావం, ఆసక్తిని చాటి చెబుతున్నాయి."
"జమ్మూ కాశ్మీర్ జట్టు సాధించిన చారిత్రాత్మక రంజీ ట్రోఫీ విజయం పట్ల భారత్ గర్విస్తోంది. ఈ విజయం జమ్మూ కాశ్మీర్లో ఎంతో సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. క్రీడారంగంలో రాణించాలనుకునే మరెందరికో గొప్ప స్ఫూర్తినిస్తుంది."
"నేటి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో సామాన్య ప్రజల్లో విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తిని పెంచేందుకు కృషి చేస్తున్న 'అన్వేషణ' అనే ప్రయత్నాన్ని అభినందించాను."
"సంప్రదాయాలను ఎలా కాపాడుకోవాలి. అదే సమయంలో భవిష్యత్తు వైపు సాగే ఆలోచనలతో ఎలా ముందుకు వెళ్లాలి అనేది నాగాలాండ్ సమాజం నిరూపించింది."
"మన మత్స్యకారుల పట్ల భారతదేశం గర్విస్తోంది! ఒడిశా, లక్షద్వీప్, కర్ణాటక రాష్ట్రాల్లోని మత్స్యకారుల కృషిని ఈ రోజు ప్రత్యేకంగా ప్రస్తావించాను. స్వయంసమృద్ధి గల భారత్ నిర్మాణంలో ఈ రంగం ఎలా తోడ్పడుతున్న తీరును వారి ప్రయత్నాలు నిరూపిస్తున్నాయి."
"ఉత్తరప్రదేశ్లోని వారణాసి, నాగాలాండ్లో చేపట్టిన ఈ ప్రయత్నాలు ప్రకృతిని ప్రేమించడం, సంరక్షించడం మన సంస్కృతిలో ఒక భాగమని నిరూపిస్తున్నాయి."
***
(రిలీజ్ ఐడి: 2246678)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10