ప్రధాన మంత్రి కార్యాలయం
మాత మహాగౌరి ఆశీర్వాదాలను కోరుకుంటూ... సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
26 MAR 2026 8:13AM by PIB Hyderabad
మహాగౌరి మాత ఆశీస్సులు లభించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వేడుకున్నారు. దేవి దివ్య చరణాలకు ప్రణామాలర్పించారు. మాత దివ్య కాంతి ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్నీ, సమృద్ధినీ, మంచి ఆరోగ్యాన్నీ ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు.
ఒక సంస్కృత కృతిని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు. ఆ కృతి ఇలా ఉంది.. :
‘‘శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచి:
మహాగౌరి శుభం దద్యాన్మహాదేవప్రమోదదా’’
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ,
‘‘మహాగౌరి మాత చరణాలకు కోటి-కోటి ప్రణామాలు. దేవి దివ్య కాంతి ప్రతి ఒక్కరి జీవితంలో సుఖాన్నీ, సమృద్ధినీ, ఆరోగ్యాన్నీ ప్రసాదించాలని నేను ఆకాంక్షిస్తున్నాను.
‘‘శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచి:
మహాగౌరి శుభం దద్యాన్మహాదేవప్రమోదదా’’
‘‘అంబ మాత అంటే భక్తులకు ఎనలేని విశ్వాసముంది. మాత పట్ల వారికున్న ఈ శ్రద్ధా, భక్తీ వారి మనోబలాన్ని ఎన్నటికీ సడలిపోనీయవు’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2245661)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4