హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘జనాభా లెక్కలు-2027’ సేకరణలో జాగ్రత్త చర్యలు

నాడు పోస్టు చేయడమైనది: 24 MAR 2026 4:26PM by PIB Hyderabad

జనాభా లెక్కలు-2027 నమోదు కార్యక్రమాన్ని డిజిటల్ మాధ్యమం ద్వారా నిర్వహించాలని సంకల్పించి అందుకు అనుగుణంగా రంగాన్ని సిద్ధం చేస్తున్నారుజనాభా లెక్కల సమాచారాన్ని సేకరించే వారు (ఎన్యూమరేటర్లుమొబైల్ యాప్‌ని ఉపయోగించిసమాచారాన్ని సేకరించనున్నారుదీంతో పాటుపౌరులే స్వయంగా ఈ జనాభా లెక్కల సేకరణకు తమ వంతుగా సహకరించే ఏర్పాటునూ చేశారుఇందుకోసం మొదటి సారి ఒక వెబ్ పోర్టల్‌ సాయాన్ని తీసుకుంటారుజన గణన (సెన్సస్)-2027కు సంబంధించిన వివిధ కార్యకలాపాల నిర్వహణకీపర్యవేక్షణకీ ఈ వెబ్ పోర్టల్‌ను రూపొందించారుసెన్సస్-2027 తొలి దశలో ఉపయోగించే ప్రశ్నల్ని వెల్లడించారురెండో దశను నిర్వహించే ముందుగా దానికి సంబంధించిన ప్రశ్నలను నోటిఫై చేస్తారుగృహ స్థితికి సంబంధించిన సమాచారంకుటుంబ వివరాలుఅందుబాటులో ఉన్న సదుపాయాలుకుటుంబానికి ఉన్న ఆస్తుల సమాచారాన్ని జనాభా లెక్కల మొదటి దశలో సేకరించనున్నారువ్యక్తుల వయస్సుఆదాయం వగైరా సమాచారం,  సామాజిక-ఆర్థికవిద్యాప్రవాసం వగైరా వివరాల్ని రెండో దశలో సేకరిస్తారు.    
జన సంఖ్య ఎంత ఉందీ తెలుసుకొనే కార్యక్రమాన్ని సెన్సస్ చట్టం-1948, సెన్సస్ నియమావళి-1990తో పాటు వాటిలో చేసిన సవరణలకు సంబంధించిన నిబంధనలను అనుసరించి చేపడుతారుజన గణన ప్రక్రియలో సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారువివిధ పరిపాలక స్థాయుల్లో సేకరించిన మొత్తం డేటాను మాత్రమే ప్రచురిస్తారు.

వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలూకేంద్ర పాలిత ప్రాంతాల పాలన యంత్రాంగాలూ సెన్సస్ చట్టం-1948, సెన్సస్ నియమావళి-1990ల నిబంధనల ప్రకారం నియమించేరంగంలోకి దింపే జనగణన అధికారులు సమాచారాన్ని సేకరించడంసరిచూడటంపర్యవేక్షణఈ కార్యక్రమ పురోగతిపై సమీక్ష నిర్వహించడం వంటి వేర్వేరు క్షేత్రస్థాయి కార్యకలాపాలను నిర్వర్తిస్తారుఈ కారణంగా ఎలాంటి ఇబ్బందికీ తావివ్వకుండా జనాభా సంఖ్యను లెక్కించడంలో రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు ఓ ముఖ్య పాత్రను పోషిస్తాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు.

 

***

 

(రిలీజ్ ఐడి: 2244579) సందర్శకుల సూచీ సంఖ్య : : 21
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Bengali , Bengali-TR , English , Urdu , हिन्दी