ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

టెలి-మానస్‌పై తాజా సమాచారం


దేశవ్యాప్తంగా విస్తరించిన టెలి-మానస్: 36 రాష్ట్రాలు/యూటీలు, 20 భాషల్లో కార్యకలాపాలను నిర్వహిస్తున్న 53 కేంద్రాలు

34.34 లక్షలకు పైగా కాల్స్ స్వీకరించి, సమస్యలను పరిష్కరించిన టెలిమానస్ హెల్ప్‌లైన్

నాడు పోస్టు చేయడమైనది: 23 MAR 2026 12:44PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా నాణ్యమైన మానసిక ఆరోగ్యాన్ని అందించే దిశగా- కౌన్సెలింగ్సంరక్షణ సేవలను మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు 2022 అక్టోబర్ 10న నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రాంను భారత ప్రభుత్వం ప్రారంభించింది03.03.2026 నాటికి దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 53 టెలిమానస్ కేంద్రాలను ఏర్పాటు చేశారురాష్ట్రాలు ఎంపిక చేసుకున్న భాష ఆధారంగా టెలిమానస్ సేవలు 20 భాషల్లో అందుబాటులో ఉన్నాయిహెల్ప్ లైన్ సౌకర్యాన్ని ప్రారంభించిన నాటి నుంచి 34.34 లక్షల కాల్స్‌ స్వీకరించిసమస్యలను పరిష్కరించారు.

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా 2024 అక్టోబర్ 10న టెలిమానస్ సేవల్ని సెల్ ఫోన్ ద్వారా పొందడానికి ఒక యాప్ ను ప్రారంభించారువివిధ రకాల మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు తోడ్పాటునందించే సమగ్ర మొబైల్ వేదికగా టెలి-మానస్ మొబైల్ యాప్ అభివృద్ధి చేశారుఅత్యవసరం కాని వ్యక్తిగత సేవల కోసం 47,487 మందిని, తదుపరి వివరణాత్మక వైద్య మూల్యాంకనం కోసం 9,590 మందినిమానసిక ఆరోగ్య నిపుణుల (ఎంహెచ్‌పీ) సేవలకు మరో 19,135 మందిని సిఫారసు చేశారుస్థానికంగా నిరంతర సేవలను కొనసాగించడానికి 1,319 మంది జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం (డీఎంహెచ్‌పీ)లో పనిచేస్తున్నారు. బహుళ-విభాగాల నిపుణుల పర్యవేక్షణ అవసరమయ్యే కేసుల్లో 10,240 మంది వైద్య లేదా శస్త్రచికిత్స నిపుణుల వద్దకు పంపించారుతీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న 5,083 మందిని మానసిక ఆసుపత్రి అత్యవసర విభాగాలకు తక్షణమే పంపించగామరో 345 మందిని అధునాతన వైద్య సేవలు అందించడానికి వైద్య కళాశాలలుసూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు పంపించారు.

డాలసెంట్ ఫ్రెండ్లీ హెల్త్ క్లినిక్స్ (ఏఎఫ్‌హెచ్‌సీ), పీర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అండ్ అడాలసెంట్ హెల్త్ అండ్ వెల్‌నెస్ డేస్ (ఏహెచ్ అండ్ డబ్ల్యూడీ) తదితర కార్యక్రమాల ద్వారా ఆరోగ్యంకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన రాష్ట్రీయ కిశోర్ స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌కేఎస్‌కేమానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించికౌన్సెలింగ్ సేవలను అందిస్తుంది.15-20 మంది బాలబాలికలతో బృందాలను ఏర్పాటు చేసిమానసిక ఆరోగ్యంసంక్షేమంతో సహా కౌమారదశ ఆరోగ్యంపై వారానికి ఒకటి నుంచి రెండు గంటల పాటు పీర్ ఎడ్యుకేటర్లు చర్చలను నిర్వహిస్తారుఆర్‌కేఎస్‌కే అనుసరించే వ్యూహంలో మానసిక ఆరోగ్యం ఒక సమగ్ర భాగందీనిలో కౌమార దశలో సాధారణంగా ఎదురయ్యే మానసిక ఆరోగ్య సమస్యలువాటిని అధిగమించడంపై వైద్యాధికారులుఏఎన్ఎమ్‌లుకౌన్సిలర్లకు శిక్షణ కూడా ఉంది.

మానసిక ఆరోగ్యంపై విద్యార్థులుఉపాధ్యాయులుకుటుంబాలకు ఆన్‌లైన్ వేదిక ద్వారా సూచనలనుదృశ్య-శ్రవణ వనరులనుభావోద్వేగ ఆరోగ్యంపై మార్గదర్శకత్వాన్ని విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న మనోదర్పణ్ అందిస్తుందివిద్యాపరమైన ఒత్తిడిమానసిక సమస్యలను అధిగమించడంలో విద్యార్థులకు సాయం చేసేందుకు సహయోగ్పరిచర్చ లాంటి భాగస్వామ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఆయుష్మాన్ భారత్ పాఠశాల ఆరోగ్యంసంక్షేమ కార్యక్రమం పరిధిలో "భావోద్వేగ శ్రేయస్సు మానసిక ఆరోగ్యం"ను ఒక ప్రత్యేక మాడ్యూల్‌గా చేర్చారుఈ కార్యక్రమానికి సంబంధించిన ఇతర అంశాలతో పాటుగా మానసిక ఆరోగ్యంపై శిక్షణ పొందిన ఆరోగ్యంసంక్షేమ రాయబారులు (ఉపాధ్యాయులువిద్యార్థులతో ఇంటరాక్టివ్ సెషన్లను నిర్వహిస్తారుఅలాగే ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకొనేలా వారాంతపు కార్యక్రమాలను నిర్వహిస్తారు.

పాఠశాలలుకళాశాలలువసతి గృహాలుఐటీఐలువిశ్వవిద్యాలయాలుఎన్జీవోలువృద్ధాశ్రమాలుఅనాథాశ్రమాలుఆరోగ్య కేంద్రాలుపని ప్రదేశాలువృత్తిపరమైన సమావేశాల్లో విస్తృతంగా ప్రచారఅవగాహనా కార్యక్రమాలను టెలిమానస్ బృందాలు చేపట్టాయిభారతీయ రైల్వే లోకో పైలట్లువారి కుటుంబాలురిజర్వు పోలీసు సిబ్బందిఆదాయ పన్ను అధికారులునర్సింగ్సోషల్ వర్కు విద్యార్థులుప్రాథమిక కౌన్సిలర్లు కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారువీటిలో వేల మంది పాల్గొన్నారు.

కేంద్ర ఆరోగ్యంకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ రావ్ జాదవ్ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంగా ఈ సమాచారాన్ని అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2244033) సందర్శకుల సూచీ సంఖ్య : : 24
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi