సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఐఐసీటీ, ఏవీజీసీ - ఎక్స్ఆర్ వ్యవస్థను బలోపేతం చేయడానికి వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
నాడు పోస్టు చేయడమైనది:
18 MAR 2026 5:22PM by PIB Hyderabad
ప్రభుత్వ ప్రధాన గ్లోబల్ బి2బి మార్కెటింగ్, కార్యకలాపాల వేదికగా చలనచిత్రాలు, యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్, ఎవిజిసి-ఎక్స్ఆర్, మీడియా, సంగీతం, డిజిటల్ కంటెంట్లో భారత మీడియా, వినోద రంగాన్ని ప్రోత్సహించడానికి వేవ్స్ బజార్ ఏర్పాటయింది. భారత్లో సృష్టించండి, ప్రపంచం కోసం సృష్టించండి (క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ది వరల్డ్) కార్యక్రమంగా వేవ్స్ బజార్ రూపుదిద్దుకుంది. భారతీయ ఆవిష్కర్తలు, స్టూడియోలు, స్టార్టప్లు, సంస్థల కోసం క్రమబద్ధమైన వ్యాపార గుర్తింపు, మార్కెట్ ప్రవేశం, పెట్టుబడి సదుపాయం, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని వేవ్స్ బజార్ సుసాధ్యం చేస్తుంది.
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ ఎక్స్ టెండెడ్ రియాలిటీ (ఏవీజీసీ-ఎక్స్ఆర్) - ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ) కోసం నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఎన్సీఓఈ)కు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం అనేక అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసింది. ఈ భాగస్వామ్యాలు పాఠ్యాంశాల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఇంటర్న్షిప్లు, పరిశోధన, అభివృద్ధి, స్టార్టప్ ఇంక్యుబేషన్, స్కాలర్షిప్లు, పరిశ్రమ మార్గదర్శకత్వం ద్వారా ఐఐసీటీకి మద్దతు ఇవ్వడం, తద్వారా దేశంలో ఏవీజీసీ-ఎక్స్ఆర్ వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
దేశాల భాగస్వామ్యం, చలనచిత్ర శైలి, నిర్మాణ శైలి, ఇతివృత్తాలు, ప్రేక్షకుల ఆదరణపరంగా అన్ని అంశాల్లోనూ అందరినీ కలుపుకుని పోవడమే ఐఎఫ్ఎఫ్ఐ లక్ష్యంగా పెట్టుకుంది. గత 3 ఏళ్లలో, ఈ చలనచిత్ర ఉత్సవానికి చిత్రాలను పంపిన దేశాల సంఖ్య 2023లో 106 ఉండగా, 2025 నాటికి అది 127కు పెరిగింది. తుది జాబితాలో ఎంపికైన చిత్రాల పరంగా చూస్తే, అంతర్జాతీయ భాగస్వామ్యం 2023లో 79 దేశాల నుంచి 2025 నాటికి 84 దేశాలకు పెరిగింది.
ఐఎఫ్ఎఫ్ఐ చిత్రాల సమూహంలో కూడా రకాలు, శైలి, ఇతివృత్తాలు గణనీయంగా పెరిగాయి. మరింత మంది పాల్గొనేలా ప్రోత్సహించడానికి, గోవాలోని పంజిమ్, పర్వోరిమ్, మడ్గావ్, పోండా వంటి 4 ప్రాంతాలలో జరుగుతున్న ఈ పూర్తి ఉత్సవానికి ప్రతినిధి రుసుమును తక్కువగా రూ. 1,000/- స్థాయిలోనే ఉంచారు. ఉత్సవానికి సంబంధించిన అన్ని ప్రదర్శన ప్రాంతాలను దివ్యాంగులకు అనుకూలంగా మార్చారు. 56వ ఐఎఫ్ఎఫ్ఐ లో, ఇండియన్ పనోరమ విభాగంలోని 19 చిత్రాలకు క్లోజ్డ్ క్యాప్షన్స్, 24 చిత్రాలకు ఆడియో డిస్క్రిప్షన్స్ సౌకర్యాలు కల్పించారు.
చలనచిత్ర నిర్మాణ రంగంలో యువ సృజనాత్మక ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించడానికి 2021లో భారత అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవం సందర్భంగా 'క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో' (సీఎంఓటీ) చొరవను ప్రారంభించారు. 2025లో ఐదవ విడత సీఎంఓటీలో 13 చలనచిత్ర విభాగాలకు చెందిన సుమారు 125 మంది వర్ధమాన ఆవిష్కర్తలు పాల్గొన్నారు. 2021లో ప్రారంభమైనప్పటి నుంచి సీఎంఓటీ స్థిరంగా వృద్ధి చెందింది. దీని ద్వారా ఎదిగిన వారు ప్రధాన అంతర్జాతీయ ఉత్సవాల్లో చిత్రాలను ప్రదర్శించడం, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ద్వారా భారతీయ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన తోడ్పాటు అందిస్తున్నారు.
సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈ రోజు లోక్సభలో శ్రీ మనీష్ జైస్వాల్, డాక్టర్ హేమాంగ్ జోషి, శ్రీ మనోజ్ తివార, శ్రీ రవీంద్ర శుక్లా అలియాస్ రవి కిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ వివరాలు తెలిపారు.
***
(రిలీజ్ ఐడి: 2242013)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12