కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వికసిత్ భారత్‌లో భాగంగా అనుసంధానత: నిర్ణీత సమయంలో ఇండియా పోస్టు డెలివరీ సేవలను ప్రారంభించిన కేంద్రమంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా.. భారతదేశ వృద్ధి పథంలో అమృత కాలం నుంచి శతాబ్ది కాలం వైపు పయనం


ప్రధానమంత్రి దార్శనిక నాయకత్వంలో భారత రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులను వేగవంతం చేసేందుకు నిర్ణీత సమయంలో డెలివరీ సేవలను ప్రారంభించిన తపాలా శాఖ

నిర్ణీత సమయానికి డెలివరీ చేసే వ్యవస్థను బలోపేతం చేసేందుకు 24 స్పీడ్ పోస్టు, 48 స్పీడ్ పోస్టు, 24 స్పీడ్ పోస్టు పార్శిల్ సేవలను ప్రారంభించిన తపాలా శాఖ

నాడు పోస్టు చేయడమైనది: 17 MAR 2026 6:24PM by PIB Hyderabad

భారతదేశ రవాణా రంగాన్ని సమూలంగా మార్చాలనే ప్రభుత్వ దార్శనికతను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర కమ్యూనికేషన్లుడీఓఎన్‌ఈఆర్ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎంసింధియా.. 24 స్పీడ్ పోస్టు, 48 స్పీడ్ పోస్టు, 24 స్పీడ్ పోస్టు పార్శిల్‌ వంటి మూడు నూతన ప్రీమియం డెలివరీ సేవలను మార్చి 17, 2026న న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారుఈ కార్యక్రమంలో కమ్యూనికేషన్లుగ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసానితో పాటు తపాలా శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారువేగంగా విస్తరిస్తున్న రవాణా రంగంలో నిర్ణీత సమయంలో డెలివరీ సేవలను అందించే తపాలా శాఖ విభాగంలో సామర్థ్యాన్ని మెరుగుపరచటమే ఈ సేవల ప్రధాన ఉద్దేశం.

ఈ సందర్భంగా కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎంసింధియా మాట్లాడుతూ.. "ఈ రోజు మన శాఖకు చరిత్రాత్మకమైన రోజుగౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికిఅంతర్జాతీయ ఖాతాదారులకు ఇండియా పోస్టు అంకితభావంతో సేవలందిస్తుందని మేం తెలియజేస్తున్నాంఅని తెలిపారు.

మూడు నెలలుగా ఈ సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలించిక్రమబద్ధమైన ట్రయల్ రన్స్ నిర్వహించి సేవలను మెరుగుపరచటంలో తపాలా సిబ్బంది చూపిన నిబద్ధతనుఅవిశ్రాంత కృషిని ఆయన అభినందించారు. "ఇవాళ తపాలా శాఖకు నూతనోత్తేజం కలిగిందిఇది వినియోగదారులకు భరోసానిచ్చే సమయంపునరుద్ధరించుకున్న పురాతన సంస్థ.. స్పష్టతఆత్మవిశ్వాసంనిర్దేశిత లక్ష్యంతో అమృత కాలం నుంచి శతాబ్ది కాలం వైపు ప్రయాణాన్ని సాగిస్తోందని దేశానికి చాటిచెప్పే సందర్భమిదిఅని కేంద్రమంతి అన్నారు.

కమ్యూనికేషన్ల సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. “భారత తపాలా శాఖ 170 ఏళ్లకు పైగా ఉత్తరాలను చేరవేసిందిరాబోయే దశాబ్దాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రపంచ స్థాయి మార్కెట్ల వరకు భారత ఆర్థిక ప్రగతిని ఈ శాఖ పరుగులు పెట్టిస్తుందిగతంలో కంటే వేగంగావిస్తృతంగామరింత నమ్మకంగా అవకాశాలను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తపాలా శాఖ కృషి చేస్తుందిఅని తెలిపారు.

వివిధ పని వాతావరణాల్లో కఠినమైన పైలట్ పరీక్షలను నిర్వహించిప్రోత్సాహకరమైన ఫలితాలతో ఆ ప్రయోగాలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత.. తపాలా శాఖవినియోగదారులకు ప్రాధాన్యతనిచ్చే ఈ మూడు రవాణా సేవలను ప్రవేశపెట్టిందిఈ సానుకూల ఫలితాలతో దేశవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తీసుకురావటం.. వేగంగాముందస్తు అంచనాలతోసాంకేతికతతో కూడిన డెలివరీ సేవలను అందించటంలో ఇండియా పోస్టుకున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుందిఇవి పౌరులకువాణిజ్యానికిపెరుగుతున్న దేశ ఆర్థిక ఆకాంక్షలకు ఎంతగానో తోడ్పడతాయి.

వ్యాపారఆర్థిక సంస్థలుప్రభుత్వ సంస్థలువ్యక్తిగత వినియోగదారులకు వేగవంతమైనభద్రతతో కూడినకచ్చితత్వంతో డెలివరీ సర్వీసును అందించేందుకు నూతనంగా ప్రవేశపెట్టిన సేవలను ప్రారంభిస్తూ హైదరాబాద్ఢిల్లీముంబైబెంగళూరులోని ప్రధాన తపాలా కార్యాలయాల్లో ప్రత్యక్ష సరకు రవాణా బుకింగ్స్ నిర్వహించారు.

24 స్పీడ్‌ పోస్టు, 24 స్పీడ్‌ పోస్టు పార్శిల్ సర్వీస్ ద్వారా దేశంలోని ఆరు ప్రధాన మెట్రో నగరాలైన న్యూఢిల్లీముంబైచెన్నైకోల్‌కతాబెంగళూరుహైదరాబాద్ మధ్య మరుసటి రోజే (డీ+1) డెలివరీ జరుగుతుందని హామీ ఇచ్చారునిర్ణీత సమయంలో పార్శిల్ అందజేయటమే కాకడెలివరీలో ఆలస్యమైతే పరిహారం చెల్లిస్తారురియల్-టైం ట్రాకింగ్ఓటీపీ ఆధారిత డెలివరీ నిర్ధారణ ద్వారా పారదర్శతభద్రత పెరుగుతుందిజాతీయ సెలవు రోజుల్లో మినహా అన్ని ఆదివారాలుఇతర సెలవు దినాల్లోనూ డెలివరీలు కొనసాగుతాయిప్రస్తుతం ఆరు మెట్రో నగరాల్లో ప్రారంభమైన ఈ సేవలు.. దశలవారీగా టైర్-1, టైర్-2 నగరాలకు విస్తరించనున్నారుప్రధాన వాణిజ్య కేంద్రాల మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యం ద్వారా ఈ సేవలు.. -కామర్స్ సంస్థలకుఎంఎస్‌ఎంఈలకుఅంకురసంస్థలకుఇతర వ్యాపార వినియోగదారులకు ఎంతో మేలు చేకూరుస్తాయి.

ఈ సేవలు ప్రారంభమైన మెట్రో నగరాల మధ్య 48 స్పీడ్ పోస్టు సర్వీసు రెండు రోజుల్లో (డీ+2) కచ్చితంగా సరకును డెలివరీ చేస్తుందిఇది ఎండ్-టు-ఎండ్ ట్రాకింగ్ఎస్ఎంఎస్సురక్షితమైన డెలివరీ నిర్ధారణతో నమ్మకమైన నిర్ణీత సమయంలో డాక్యుమెంట్ డెలివరీని వినియోగదారులకు అందుబాటులోకి తెస్తుంది.

ఆవిష్కరణలుసామర్థ్యంవినియోగదారులకు ప్రాధాన్యత పట్ల తపాలా శాఖకు ఉన్న నిబద్ధతను ఈ ప్రీమియం సేవల ప్రారంభం ప్రతిబింబిస్తుందిఈ నూతన సేవల ద్వారా ప్రీమియం ఎక్స్‌ప్రెస్ డెలివరీ విభాగంలో తపాలా శాఖ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుందిముఖ్యమైన మెట్రోపాలిటన్ నగరాల్లో అత్యవసర డెలివరీలకు నమ్మకమైనభద్రతతో కూడిననిర్ణీత సమయానికి వస్తువులను చేరవేస్తుందిదేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలకుపౌరులకు మద్దతునిచ్చే విశ్వసనీయమైన జాతీయ రవాణా భాగస్వామిగా తపాలా శాఖ పాత్రను మరింత బలోపేతం చేస్తుంది.

మరిన్ని వివరాలకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి:

https://www.indiapost.gov.in/speedpost/locateus


(రిలీజ్ ఐడి: 2241675) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Kannada