పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
రెండు కొత్త పిల్లలతో నాలుగో ఏడాదిలోకి ప్రవేశించిన బట్టమేక పిట్ట పునరుత్పత్తి కార్యక్రమం
జీఐబీ పరిరక్షణ చర్యల్లో ముఖ్యమైన విజయాలు, 70కి చేరుకున్న పక్షుల సంఖ్య: శ్రీ భూపేందర్ యాదవ్
నాడు పోస్టు చేయడమైనది:
13 MAR 2026 1:21PM by PIB Hyderabad
గ్రేట్ ఇండియన్ బస్టార్డ్ (జీఐబీ) ప్రాజెక్టు పునరుత్పత్తి కార్యక్రమం నాలుగో ఏడాదిలోకి ప్రవేశించిందని కేంద్రం పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ శుక్రవారం తెలియజేశారు. రాజస్థాన్లోని కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్లో కొత్తగా రెండు పిల్లలను పొదగడంతో ఈ పక్షుల సంఖ్య 70కి చేరుకుందని వెల్లడించారు.
పర్యావరణానికి ప్రాధాన్యమిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలో, ఈ ప్రాజెక్టును విజయవంతం చేయడానికి దేశం సరైన మార్గంలో ప్రయాణిస్తోందని మంత్రి అన్నారు.
ఈ పురోగతికి సంబంధించిన సమాచారాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్లో శ్రీ యాదవ్ పంచుకున్నారు. ప్రాజెక్టు జీఐబీ పరిధిలో సాధించిన మరో విజయంగా దీనిని వర్ణించారు. రాజస్థాన్లోని కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్లో ఈ వారం సహజ సంపర్క విధానంలో ఒకటి, కృత్రిమ విధానంలో మరొకటి మొత్తం రెండు పిల్లలను పొదిగినట్లు తెలియజేశారు.
జీవజాతుల పరిరక్షణ ప్రయత్నాల్లో ప్రధాన విజయంగా దీనిని శ్రీ యాదవ్ వర్ణించారు. సంరక్షణ కేంద్రాల్లో పెరిగిన కొన్ని పక్షులను ఈ ఏడాది నిర్దేశిత విధానాన్ని అనుసరిస్తూ అటవీ ప్రాంతంలో విడుదల చేస్తామని, ఇది ఈ ప్రాజెక్టుకు నూతన సవాలుతో నిండిన ప్రారంభమన్నారు. ఈ విజయం సాధించిన రాజస్థాన్ అటవీ విభాగం అధికారులను అభినందించారు.
***
(రిలీజ్ ఐడి: 2240044)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3