గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
గిరిజన భాషల కోసం ఏఐ ఆధారిత వేదిక... ఆది- వాణి
నాడు పోస్టు చేయడమైనది:
12 MAR 2026 4:48PM by PIB Hyderabad
గిరిజన భాషల అనువాదం, డాక్యుమెంటేషన్, డిజిటలైజేషన్ కోసం ఆది-వాణి పేరుతో ఏఐ ఆధారిత వేదికను రూపొందించినట్టు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ దుర్గాదాస్ ఉయికే ఈ రోజు లోక్సభలో తెలిపారు. ప్రస్తుతం ఈ యాప్, వెబ్ పోర్టల్ ఈ కింది భాషలకు మద్దతు ఇస్తున్నాయి:
*గోండి (ఛత్తీస్గఢ్)
*ముందారి (జార్ఖండ్)
*భిలి (మధ్యప్రదేశ్)
*సంతాలి.(ఒడిశా
ఒడిశా నుంచి కుయి, మేఘాలయ నుంచి గారో అనే రెండు భాషలు అభివృద్ధి దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ రెండో దశలో, ఈ కింది ఏడు భాషలను ఆది-వాణిలో చేర్చాలని ప్రతిపాదించారు:
*కత్కారీ - మహారాష్ట్ర
*కోయ - ఆంధ్రప్రదేశ్
*కోక్ బోరోక్ - త్రిపుర
*బెట్ట కురుబ - కర్ణాటక
*తోడౌ కుకీ, తంగ్ఖుల్ - మణిపూర్
*చోద్రీ - గుజరాత్
ఆధునికీకకరణ, సామాజిక, ఆర్థిక మార్పులు వంటి వివిధ కారణాల వల్ల ఈ గిరిజన తెగల భాషా, సాంస్కృతిక సంప్రదాయాలు, నిరంతరం మార్పులకు లోనవుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది.
దేశవ్యాప్తంగా ఉన్న ఇతర గిరిజన భాషలకు కూడా క్రమంగా ఈ సేవలను విస్తరించడమే ఆది-వాణి ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. డాక్యుమెంటేషన్, భాషా పరిరక్షణ, డిజిటల్ లభ్యతను మెరుగుపరచడానికి తదుపరి దశల్లో ప్రతిపాదిత భాషలకు సంబంధించిన డాక్యుమెంటేషన్, డిజిటలైజేషన్ ప్రక్రియను ఆయా రాష్ట్రాల గిరిజన పరిశోధనా సంస్థల (టీఆర్ఐ) సమన్వయంతో దశలవారీగా చేపడతారు. . దీనికి సంబంధించిన కచ్చితమైన కాలపరిమితి స్థానిక భాగస్వాముల సహకారం, క్షేత్రస్థాయి డాక్యుమెంటేషన్ పరిధిపై ఆధారపడి ఉంటుంది.
***
(రిలీజ్ ఐడి: 2239235)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17