సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ దృష్టిని ఆకర్షించే పథకం

నాడు పోస్టు చేయడమైనది: 12 MAR 2026 3:34PM by PIB Hyderabad

భారతదేశ సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని విదేశాల్లో ప్రచారం చేయడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారత్ ప్రతిష్ఠను పెంపొందింపచేయాలన్న లక్ష్యంతో గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ స్కీమ్ (ప్రపంచ దృష్టిని ఆకర్షించే పథకం)ను సాంస్కృతిక శాఖ అమలుపరుస్తోంది
i. 
ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఓఐ)
ii. 
ఇండో ఫారిన్ మైత్రీ సాంస్కృతిక సంఘాలకు ఆర్థిక సహాయం
iii. అంతర్ ప్రభుత్వ సంస్థలకు చందాలు

ఈ పథకంలోని ఒకటో భాగంతో పాటు రెండో భాగాన్ని పథకం లక్ష్యాలను సాధించేందుకు విదేశాల్లోని భారతీయ అధికార బృందాల ద్వారా నిర్వహిస్తున్నారు.
ఈ పథకంలో భాగంగావిదేశాల్లో ‘ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (ఎఫ్ఓఐ)లో వేరు వేరు కళారూపాలను ప్రదర్శించే  కళాకారులు/బృందాలతో సాంస్కృతిక శాఖ ఓ జాబితాను రూపొందించిందివిదేశాల్లో ప్రదర్శనలివ్వడానికి కళాకారులను ఆ జాబితాలో నుంచే ఎంపిక చేశారుప్రస్తుతం 627 మంది కళాకారుల/బృందాల పేర్లు మంత్రిత్వ శాఖ జాబితాలో చోటు చేసుకున్నాయిఇందులో 119 మంది కళాకారుల/బృందాల పేర్లు జానపద కళల కేటగిరీలో ఉన్నాయి.
ఇంతవరకు వివిధ దేశాల్లో 62 ఎఫ్ఓఐలను నిర్వహించారుభారతీయ జానపద కళలనూసంస్కృతి ప్రధాన ప్రదర్శనలనీ సెనెగల్ఘనాలావోస్ఫిజీకిరిబాతిటోంగావాన్వాటునౌరుతువలుకుక్ ఐలండ్ట్రినిడాడ్ అండ్ టొబాగోబ్రిటన్తుర్క్‌మెనిస్తాన్హంగరీడెన్మార్క్జపాన్కెన్యాఐవరీ కోస్ట్లైబీరియాగినియాశ్రీలంకటాంజానియాఉజ్బెకిస్తాన్ట్యునీషియాఖతార్క్రొయేషియాకువైట్ఫ్రాన్స్‌లో ఏర్పాటు చేశారు.
మొత్తం 2348 మంది కళాకారులు 2025 జులై వరకు నిర్వహించిన ఎఫ్ఓఐలలో పాల్గొన్నారు.
ప్రస్తుతం అమలులో ఉన్న గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ స్కీం15వ ఆర్థిక సంఘం పదవీకాలం ముగిసేంత వరకు అమలులో ఉంటుంది.
ఈ సమాచారాన్ని కేంద్ర సాంస్కృతికపర్యాటక శాఖ మంత్రి శ్రీ  గజేంద్ర సింగ్ షెఖావత్ ఈ రోజు రాజ్యసభలో ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలియజేశారు.

 

***

 

(రిలీజ్ ఐడి: 2238976) సందర్శకుల సూచీ సంఖ్య : : 31
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी