బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వెలికితీతకు మించి సాగడం: నైవేలిలో గనుల మూసివేత, పునర్వినియోగంపై దేశంలోనే తొలి జాతీయస్థాయి వర్క్‌షాప్

నాడు పోస్టు చేయడమైనది: 05 MAR 2026 4:12PM by PIB Hyderabad

బొగ్గు మంత్రిత్వ శాఖఎన్ఎల్ సీ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో గనుల మూసివేతపునర్వినియోగంపై ఫిబ్రవరి 23, 24 తేదీల్లో నిర్వహించిన జాతీయ స్థాయి వర్క్‌షాప్ విజయవంతంగా జరిగిందితమిళనాడులోని నైవేలిలో రెండు రోజులపాటు సాగిన ఈ వర్క్‌షాప్.. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జికిషన్ రెడ్డి ప్రారంభించారు.

బొగ్గు మంత్రిత్వ శాఖఎన్ఎల్ సీ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23, 24 తేదీల్లో గనుల మూసివేతపునర్వినియోగంపై జాతీయ స్థాయి కార్యశాలను విజయవంతంగా నిర్వహించారు.తమిళనాడులోని నైవేలిలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జికిషన్ రెడ్డి ప్రారంభించిన ఈ కార్యశాల రెండు రోజులపాటు కొనసాగిందిక్రమబద్ధమైన గనుల మూసివేత ప్రణాళికగనుల తవ్వకం అనంతర భూమి పునర్వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించిన దేశపు తొలి జాతీయ కార్యక్రమంగా నిలిచిందిఈ సదస్సులో బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్అదనపు కార్యదర్శులు శ్రీమతి రూపిందర్ బ్రార్శ్రీ సనోజ్ కుమార్ ఝాకోల్ కంట్రోలర్ శ్రీ సజీష్ కుమార్ ఎన్బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

మూసివేతకు సిద్ధంగా ఉన్న గనుల నుంచి 147 మంది నోడల్ అధికారులుబొగ్గు రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థలుప్రైవేటు గనుల తవ్వకాల సంస్థలునియంత్రణ సంస్థలుప్రభుత్వేతర సంస్థలువిధాన నిర్ణేతలుఆర్థిక సంస్థలువిద్యావేత్తలుద్వైపాక్షికబహుళ పక్ష సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారుమొత్తం మీద 500 మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారుగనుల మూసివేతను కేవలం ఒక నిబంధనగా కాకుండాదీర్ఘకాలిక ప్రాంతీయ పునరుత్పత్తికి ఉత్ప్రేరకంగా మార్చాలనే ఉమ్మడి నిబద్ధతను ఈ వైవిధ్యభరితమైన భాగస్వామ్యం చాటిచెప్పింది.

ఈ కార్యశాలలో ప్రధాన ఆకర్షణగా తొమ్మిది సమావేశాలు జరిగాయిఇందులో ప్రభుత్వంపరిశ్రమలుపరిశోధనా సంస్థలుఅభివృద్ధి సంస్థలుఅంతర్జాతీయ సంస్థలకు చెందిన 29 మంది ప్రముఖ వక్తలు ప్రసంగించారుగనుల మూసివేతతవ్వకం అనంతర మార్పులపై తమకున్న అవగాహననుక్షేత్రస్థాయి అనుభవాలను నిపుణులు నిపుణులు

పంచుకున్నారుస్థిరమైనసమాజ ప్రయోజనాలే లక్ష్యంగా గనుల మూసివేత వ్యూహాలను రూపొందించడంలోఅమలు చేయడంలో నోడల్ అధికారులుఇతర పాల్గొనేవారికి విలువైన మార్గదర్శకత్వాన్ని అందించారు.

ఈ సదస్సులో గనుల తవ్వకం అనంతర భూములను వినియోగించుకోవడానికి గల వివిధ మార్గాలపై లోతుగా చర్చించారువాటిలో పునరుత్పాదక వ్యవసాయంఅటవీ వ్యవసాయంపశువుల ఆధారిత జీవనోపాధిగనుల గుంతల్లో చేపల పెంపకంపునరుత్పాదక ఇంధన వనరుల అనుసంధానంపర్యాటక రంగం అభివృద్ధిసాంస్కృతిక సంస్థలునైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటువిధానపరమైన ఏకీకరణఅంతర్జాతీయ ఆర్థిక సాయం పొందే మార్గాలుక్రమబద్ధమైన గనుల మూసివేతలో అంతర్జాతీయంగా పాటిస్తున్న ఉత్తమ పద్ధతులు వంటివి ముఖ్యమైనవిమైనింగ్ తర్వాత ఆ ప్రాంతాల్లో విభిన్నమైనస్థిరమైన జీవనోపాధి అవకాశాలను కల్పించడంపై ఈ చర్చలు దృష్టి సారించాయిగనులు మూసివేసిన ప్రాంతాల్లో సమగ్రసుస్థిర అభివృద్ధిని పెంపొందించడంలో స్థానిక ప్రజల భాగస్వామ్యంఉపాధి కల్పన కీలక పాత్ర పోషిస్తాయని వక్తలు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గనుల మూసివేతను మైనింగ్ కార్యకలాపాలకు ముగింపుగా భావించకూడదనిమైనింగ్ ప్రాంతాల్లోని ప్రజల సామాజికఆర్థికాభివృద్ధికి లభించే ఒక కొత్త అవకాశంగా చూడాలని పేర్కొన్నారుశాస్త్రీయ పద్ధతుల్లో భూమిని పునరుద్ధరించడం,, పర్యావరణ పరిరక్షణగనుల మూసివేత నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవడంమైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో స్థిరమైన జీవనోపాధి అవకాశాలను సృష్టించడం వంటి అంశాల ప్రాముఖ్యతను ఆయన వివరించారు.

వర్క్‌షాప్‌లో భాగంగా ఎన్ఎల్ సీ ఇండియా తిరిగి పొందినబొగ్గు వెలికితీత పూర్తయిన ప్రాంతాలను ప్రతినిధులు సందర్శించారుఅక్కడ తవ్వకం ముగిసిన భూములను బోటింగ్జలవనరుల పునరుద్ధరణపక్షుల ఆవాస కేంద్రాలతో కూడిన పర్యాటక ప్రాంతాలుగా మార్చారుశాస్త్రీయ పునరుద్ధరణసమగ్ర ప్రణాళిక ద్వారా పాడైపోయిన గనుల ప్రాంతాలను కూడా జీవవైవిధ్యంతో కూడినఆర్థికంగా ఉత్పాదకత గల భూములుగా ఎలా మార్చవచ్చో ఈ క్షేత్ర పర్యటన ప్రత్యక్షంగా నిరూపించింది.

దేశంలో గనుల మూసివేత ప్రక్రియను క్రమబద్ధంగాపారదర్శకంగాజవాబుదారీతనంతో నిర్వహించే దిశగా ఒక కీలక ప్రస్థానంగా ఈ వర్క్‌షాప్ నిలిచిందిఇప్పటివరకు 25 గనులను శాస్త్రీయ పద్ధతిలో విజయవంతంగా మూసివేసినట్లు వెల్లడించారు.

ఈ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ పలు కీలక చర్యలను అమలు చేస్తోందిఅందులో భాగంగా గనుల మూసివేత కోసం కేటాయించిన ఎస్క్రో నిధులలో 25 శాతాన్ని తప్పనిసరిగా ప్రజల అభివృద్ధి కోసం కేటాయించాలని నిర్ణయించిందిదీనిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడానికి మంత్రిత్వ శాఖ ఇప్పటికే రీక్లెయిమ్ (రీచ్ అవుట్ఎన్విజన్కో-క్రియేట్లోకలైజ్యాక్ట్ఇంటిగ్రేట్మెయింటెయిన్నిబంధనలను విడుదల చేసిందిఇది మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఒక సమగ్ర మార్గదర్శిగా పనిచేస్తుంది.

తవ్వకాలు ముగిసిన భూముల స్థిరమైన పునర్వినియోగాన్ని ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ గతంలోనే లైవ్స్ (ఎల్ఐవీఈఎస్విధానాలను ప్రవేశపెట్టిందిదీనితో పాటు సువికల్ప్ అనే ఇంటరాక్టివ్ ఆన్‌లైన్ పరికరాన్ని కూడా అభివృద్ధి చేసిందిఇది గనుల నిర్వాహకులు ఆయా భూములకు తగిన పునర్వినియోగ ప్రాజెక్టులను గుర్తించడానికిఅమలు చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది.

ఈ వర్క్‌షాప్ ద్వారా లభించిన ఉత్సాహాన్ని కొనసాగిస్తూ బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని బొగ్గు నియంత్రణ సంస్థ వరుసగా జాతీయ వెబినార్లను నిర్వహించాలని యోచిస్తోందిజీవనోపాధి వైవిధ్యీకరణపునరుత్పాదక ఇంధన వనరుల అనుసంధానంఅంతర్జాతీయ ఆర్థిక సహాయం పొందడంపర్యాటక ఆధారిత అభివృద్ధినైపుణ్య వ్యవస్థలుప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ పద్ధతుల అవలంబన వంటి నిర్దిష్ట అంశాలపై ఈ వెబినార్లు దృష్టి సారించనున్నాయిదీనివల్ల భాగస్వామ్య పక్షాల మధ్య నిరంతర అవగాహనసామర్థ్య పెంపుదల సాధ్యమవుతుంది.

ఈ వర్క్‌షాప్ విజయవంతంగా నిర్వహించడం ద్వారా.. గనుల మూసివేత కేవలం ఒక చట్టబద్ధమైన నిబంధన మాత్రమే కాదనిఅది పర్యావరణ పునరుద్ధరణకుసమగ్ర అభివృద్ధికిదేశంలోని మైనింగ్ ప్రాంతాల్లో దీర్ఘకాలిక సామాజిక-ఆర్థిక స్థిరత్వం సాధించడానికి ఒక మార్పు తీసుకువచ్చే అవకాశంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టమైంది

 

****


(రిలీజ్ ఐడి: 2235695) సందర్శకుల సూచీ సంఖ్య : : 67
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil