నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పర్షియన్ గల్ఫ్‌లో నౌకా వాణిజ్య తాజా పరిస్థితిని సమీక్షించిన మంత్రిత్వ శాఖ


భారతీయ నౌకలు, నావికుల భద్రత కోసం మెరుగైన పర్యవేక్షణ

పర్షియన్ గల్ఫ్‌లో నావికులు, నౌకా వాణిజ్య ఆస్తుల భద్రతపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్

నౌకా వాణిజ్యంలో పెరుగుతున్న ముప్పు నేపథ్యంలో భారతీయ నావికుల భద్రత కోసం సత్వర ప్రతిస్పందన బృందాల ఏర్పాటు

నాడు పోస్టు చేయడమైనది: 03 MAR 2026 7:32PM by PIB Hyderabad

పర్షియన్ గల్ఫ్‌లో నౌకా వాణిజ్య భద్రత తాజా పరిస్థితిని కేంద్ర నౌకాశ్రయాలునౌకాయానంజల రవాణా మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందిఈ ప్రాంతంలో భారత పతాకంతో నడుస్తున్న నౌకలుభారతీయ నావికులను రక్షించడానికి ముందు జాగ్రత్త చర్యలను బలోపేతం చేసింది.

పర్షియన్ గల్ఫ్‌లో ప్రస్తుత భద్రతా వాతావరణాన్ని అంచనా వేయడానికిభారత నౌకా వాణిజ్య ఆస్తులు-సిబ్బందిపై దాని ప్రభావాలను చర్చించేందుకు ఈ రోజు నిర్వహించిన సమీక్షా సమావేశానికి కేంద్ర నౌకాశ్రయాలునౌకాయానంజల రవాణా మంత్రి సర్బానంద సోనోవాల్ అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో నౌకాయాన డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని ప్రస్తుత పరిస్థితినిభారతీయ పతాకంతో గల నౌకలుభారతీయ నావికుల భద్రత విషయంలో తాజా పరిస్థితిని కేంద్ర మంత్రికి వివరించారు.

సమావేశం తర్వాత కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ, "మేం పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాంమన నావికుల భద్రతసంక్షేమంనౌకా వాణిజ్య ఆస్తుల భద్రతను నిర్ధారించడానికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలుపర్యవేక్షణసమన్వయ విధానాలను కొనసాగిస్తున్నాంసంబంధిత జాతీయఅంతర్జాతీయ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాంఎటువంటి పరిస్థితి ఎదురైనా సత్వరం స్పందించి దానిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాంఅని తెలిపారు.

పర్షియన్ గల్ఫ్హార్ముజ్ జలసంధిఒమన్ గల్ఫ్దాని పరిసర సముద్ర ప్రాంతాల్లో క్షిపణిడ్రోన్ కార్యకలాపాలుఎలక్ట్రానిక్ పరికరాల పనితీరును ప్రభావితం చేసే చర్యలుఇతర నౌకా వాణిజ్య భద్రతా సమస్యలు సహా ప్రతి ముప్పు విషయంలో సత్వర ప్రతిస్పందనతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఆధ్వర్యంలో భారతీయ నావికులుభారత పతాకంతో గల నౌకల భద్రత కోసం కొనసాగిస్తున్న మెరుగైన పర్యవేక్షణభద్రతా చర్యలను మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది.

డీజీఎస్ ద్వారా భారతీయ పతాకంతో గల నౌకల రియల్-టైమ్ ట్రాకింగ్‌ను మంత్రిత్వ శాఖ ప్రారంభించిందిరిపోర్టింగ్ ఫ్రీక్వెన్సీని పెంచిందిఎమ్ఎమ్‌డీఏసీ డిజికామ్ సెంటర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసిందిఓడలుయజమానులునిర్వాహకులకు తప్పనిసరి రిపోర్టింగ్ ఆదేశాలను అమలు చేస్తున్నారు.

భారత నావికాదళంవిదేశాంగ మంత్రిత్వ శాఖఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ – ఇండియన్ ఓషన్ రీజియన్మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్విదేశాల్లోని భారత మిషన్లతో సన్నిహిత సమన్వయం కొనసాగిస్తున్నారునౌకాయాన కంపెనీలురిక్రూట్‌మెంట్-ప్లేస్‌మెంట్ సర్వీస్ లైసెన్సీలు సిబ్బందిని నియమించుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని... నావికులువారి కుటుంబాలతో నిరంతర కమ్యూనికేషన్‌ను కొనసాగించాలని సూచించారు.

ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ – ఇండియన్ ఓషన్ రీజియన్ డైరెక్టరేట్ఇతర ఏజెన్సీలు వారి భద్రతశ్రేయస్సును నిర్ధారించడానికి పూర్తిస్థాయి సమన్వయంతో పనిచేస్తున్నాయిబాధిత నావికులువారి కుటుంబాలకు అవసరమైన మద్దతునుసహాయాన్ని అందిస్తున్నాయి.

అధికారుల మధ్య సకాలంలో సమన్వయాన్ని ప్రారంభించడానికిఎటువంటి పరిస్థితులు ఎదురైనా తక్షణ ప్రతిస్పందనను నిర్ధారించడానికిభారతీయ నావికులువారి కుటుంబాలకు తక్షణ సహాయం అందించడానికి ఒక ప్రత్యేక సత్వర ప్రతిస్పందన బృందాన్ని ఏర్పాటు చేశారుహెల్ప్‌లైన్ నంబర్లనూ సిద్ధం చేశారువాటి గురించిన సమాచారాన్ని ఆర్‌పీఎస్ఎల్‌ల ద్వారా నావికుల కుటుంబాలతో పంచుకున్నారు.

అధిక అప్రమత్తతను కొనసాగించాలనిప్రయాణ-నిర్దిష్ట ప్రమాద అంచనాలను చేపట్టాలని సంబంధిత వ్యక్తులుసంస్థలకు సూచించారుఈ ప్రాంతంలో పనిచేస్తున్న నౌకలు నిరంతర సమాచార సంసిద్ధతను నిర్ధారిస్తూఅనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే నివేదించడానికి వీలుగా భద్రతపరంగా మెరుగైన అప్రమత్తతనునిరంతర నిఘాను నిర్వహించాలని ఆదేశించారు.

కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ... "నావికులునౌకా వాణిజ్య సంబంధిత వ్యక్తులుసంస్థలకు భారత ప్రభుత్వం అండగా ఉంటుందిభారతీయ నౌకలుసిబ్బందిని రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడంతో పాటుగా దౌత్యపరమైనమానవతాపరమైన మద్దతును అందించడానికి మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందిభారత నౌకా వాణిజ్య ప్రయోజనాల పరిరక్షణ కోసం దేశీయఅంతర్జాతీయ వాటాదారులతో చురుకైన సమన్వయాన్ని కొనసాగిస్తుందిఅని తెలిపారు.

 

***


(రిలీజ్ ఐడి: 2235261) సందర్శకుల సూచీ సంఖ్య : : 64
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil , Malayalam