రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

కర్ణాటకలోని వేమగల్‌లో ఏర్పాటు చేసిన హెచ్-125 లైట్ యుటిలిటీ హెలికాప్టర్ ఫైనల్ అసెంబ్లీ లైన్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని, ఫ్రెంచ్ అధ్యక్షుడు


భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో హెచ్-125 ఫైనల్ అసెంబ్లీ లైన్ కీలకమైన మైలు రాయి: రక్షణ మంత్రి

‘‘పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాల ద్వారా క్లిష్టమైన సాంకేతికత, అత్యాధునిక ఉత్పత్తులను తయారు చేయడంలో స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’’

నాడు పోస్టు చేయడమైనది: 17 FEB 2026 10:16PM by PIB Hyderabad

ఎయిర్‌బస్ హెచ్-125 లైట్ యుటిలిటీ హెలికాప్టర్‌కి సంబంధించిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ తుది అసెంబ్లీ లైన్‌ను 2026 ఫిబ్రవరి 17న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ ముంబయి నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారుఇది కర్ణాటకలోని వేమగల్ వద్ద ఉందిరక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ఫ్రెంచ్ సైనికమాజీ సైనిక ఉద్యోగుల వ్యవహారాల మంత్రి క్యాథరిన్ వౌట్రిన్కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కేఆర్ నాయుడుకర్ణాటక భారీమధ్య తరహా పరిశ్రమల మంత్రి డాక్టర్ ఎంబీ పాటిల్ ఫైనల్ అసెంబ్లీ లైన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు.

భారత్ఫ్రాన్స్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఓ మైలురాయిగా హెచ్-125 హెలికాప్టర్ల ఫైనల్ అసెంబ్లీ లైన్‌ను రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు‘‘ఫ్రాన్స్‌తో మా సహకారం అపరిమితమైనదిపరస్పర ప్రయోజనకరమైన మా భాగస్వామ్యానికి ఆకాశం కూడా హద్దు కాబోదుఅని ఆయన అన్నారుభారత్‌లో సీ-295 రవాణా విమానాల తయారీ ఒప్పందం అనంతరంహెచ్-125 కార్యక్రమం చేపట్టిన టీఏఎస్ఎల్ఎయిర్‌బస్ హెలికాప్టర్స్‌ సంస్థలను ఆయన అభినందించారుమేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి తోడ్పడేలాఅంతర్జాతీయ పరికరాల తయారీ సంస్థలతో కలసి భారత్ పనిచేయగలదని చెప్పడానికి ఈ ప్రాజెక్ట్ ఒక నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

 

Description: A person in a suit and tie standing next to a person in a suit and tieDescription automatically generated

Description: A group of people standing on a stageDescription automatically generated

2014 నుంచి భారతదేశ ఆర్థిక విధానానికి మూలాధారాలుగా మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఉన్నాయని రక్షణ మంత్రి వివరించారుమిత్ర దేశాలతో పరస్పర ప్రయోజనాలను అందించే భాగస్వామ్యాల ద్వారా క్లిష్టమైన సాంకేతికతల్లో స్వయం సమృద్ధిని సాధించడంలోనూ, అత్యాధునిక ఉత్పత్తులనుపరికరాలను తయారు చేయడంలోనూ ప్రధానమంత్రి మోదీ సారథ్యంలోని ప్రభుత్వ నిబద్ధతను ఈ కార్యక్రమం తెలియజేస్తుందన్నారు.

 

హెచ్-125 కార్యక్రమానికి రూ. 1,000 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేసినట్లు శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారుఅలాగే దీని ద్వారా నైపుణ్యాలున్న యువతకు ప్రత్యక్షంగాపరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారువివిధ రకాల వాతావరణ పరిస్థితుల్లో అసాధారణమైన విశ్వసనీయతబహుళ ప్రయోజనాలుఅత్యుత్తమమైన పనితీరుకు హెచ్-125 హెలికాప్టర్లు పేరుగాంచాయన్నారు. "ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైనవిశ్వసనీయమైన సింగిల్-ఇంజిన్ హెలికాప్టర్లలో హెచ్-125 ఒకటి అని నిరూపితమైందిఅని ఆయన తెలియజేశారు.

దశాబ్దానికి పైగా కాలం నుంచి పెట్టుబడి నిబంధనల సరళీకరణతో పాటు.. భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం లాంటి అనేక పథకాల ద్వారా కీలక రంగాల్లో మూలధన పెట్టుబడులతో పారిశ్రామిక ప్రగతి పథంలో భారత్ వేగంగా పయనిస్తోందని రక్షణ మంత్రి స్పష్టం చేశారుచిన్నమధ్యతరహా పరిశ్రమలకు తోడ్పాటును అందించడంఅంకుర సంస్థల వ్యవస్థను బలోపేతం చేయడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని తెలియజేశారు. ‘‘సమగ్ర పారిశ్రామిక అభివృద్ధిని సాధించడమే మా లక్ష్యంఇది మన దేశీయ అవసరాలను మాత్రమే కాకుండాఇతర దేశాల అవసరాలను కూడా తీరుస్తుంది’’ అని ఆయన అన్నారు.

 

ఆయుధ పరిశ్రమలను కార్పొరేట్ చేయడంఉదారవాద పెట్టుబడి పథకాలురక్షణ పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో సహా రక్షణ పారిశ్రామిక వ్యవస్థలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ చేపట్టిన సంస్కరణల గురించి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలియజేశారుభారత రక్షణ ఉత్పత్తి గతంలో ఎక్కువగా ప్రభుత్వ రంగంపైనే ఆధారపడి ఉండేదని ఆయన అన్నారుదీనికి భారీ పెట్టుబడిదీర్ఘ కాలం ఎదురు చూడాల్సి రావడం తదితర కారణాలున్నాయని తెలిపారుఫలితంగా, ఉత్పత్తిఎగుమతుల్లో ప్రైవేట్ రంగం వాటా ఆశించిన స్థాయిలో ఉండేది కాదని వివరించారుఅయితేప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ప్రస్తుతం రక్షణ ఉత్పత్తిలో ప్రైవేట్ రంగం వాటా దాదాపు నాలుగో వంతుకు చేరుకుందనిరక్షణ ఎగుమతులు కూడా అనేక రెట్లు పెరిగాయన్నారుఇవి రక్షణ ఎగుమతుల్లో అగ్రగామి దేశాల సరసన భారత్‌ను నిలబెట్టాయని వివరించారు.

ఈ వృద్ధి మార్గం ఎంఎస్ఎంఈలకుఅనుబంధ రంగాలకు భారీ ప్రోత్సాహాన్ని అందించిందనిప్రస్తుతం వీటి సంఖ్య 16,000 దాటిందని రక్షణ మంత్రి తెలిపారుఅలాగే భారతీయ ఎంఎస్ఎంఈల నుంచి విడి భాగాలను అనేక విదేశీ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయని వెల్లడించారుఅర్థవంతమైన సాంకేతిక బదిలీఇతర దేశాల భద్రతా అవసరాలను తీర్చేందుకు అత్యాధునిక పరిష్కారాలను అందించడం ద్వారా ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని కంపెనీలను ఆయన ఆహ్వానించారు.

చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్రక్షణ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్కార్యదర్శి (రక్షణ ఉత్పత్తిశ్రీ సంజీవ్ కుమార్ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎత్తయిన ప్రాంతాల్లో చేపట్టే కీలకమైన కార్యకలాపాల్లో బహుళ ప్రయోజనాలు అందించేలా హెచ్125ఎంను రూపొందించారుతక్కువ శబ్ధంఉష్ణ సంకేతాలను ఉపయోగించుకొని వ్యూహాత్మక అన్వేషణనిఘా అందించేలా దీనిని రూపొందించారుఇది ఎత్తయిన ప్రాంతాలకు రవాణా చేస్తుందిమారుమూల సరిహద్దు అవుట్‌పోస్టులకు అవసరమైన వస్తువులను చేరవేస్తుందిశోధనరక్షణవైద్య తరలింపు కార్యకలాపాల్లో వేగంగా స్పందించే సాధనంగా పనిచేస్తుంది.

ఎవరెస్ట్ శిఖరంపై ల్యాండయిన ఏకైక హెలికాప్టర్‌గా హెచ్125 చరిత్ర సృష్టించిందిఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న తేలికపాటి యుటిలిటీ ఫ్లీట్‌ల కంటే ఎంతో మెరుగైన పనితీరును  కనబరిచిందిప్రపంచంలోనే అత్యంత సవాలుతో కూడుకున్న ఎత్తయినవేడి వాతావరణాల్లో పనిచేసే భారతీయ సైనికులకు ఇది కీలకమైన సేవలను అందిస్తుంది.

సీ295 మిలటరీ ట్రాన్స్‌పోర్ట్ ఫైనల్ అసెంబ్లీ లైన్ తర్వాత టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ఎయిర్ బస్ పారిశ్రామిక సహకారంలో కుదిరిన రెండో ప్రధాన ఒప్పందం ఇదిఇది భారత్‌లో సమగ్ర సైనిక వైమానిక రంగాన్ని బలోపేతం చేస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2229673) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी