ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో రోల్స్ రాయస్ సీఈవో భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
11 FEB 2026 10:24PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రోల్స్ రాయస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) శ్రీ టుఫాన్ ఎర్గిన్బిల్గిక్ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ ‘‘భారత్లో రోల్స్ రాయస్ తన కార్యకలాపాల్ని పెంచుకోవడాన్నీ, ఉత్సాహంతో, ఆవిష్కరణలతో నిండిన భారత యవతతో కలిసి పనిచేయడాన్నీ స్వాగతిస్తున్నాం’’ అని అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘ ఉత్సాహ భరిత వాతావరణంలో ఈ రోజు ఉదయం రోల్స్ రాయస్ సీఈఓ శ్రీ టుఫాన్ ఎర్గిన్బిల్గిక్తో భేటీ జరిగింది.
రోల్స్ రాయస్ భారత్లో తన కార్యకలాపాల్ని పెంచుకోవడంతో పాటు నూతన ఆవిష్కరణల పట్ల మక్కువ కనబరుస్తున్న మా యువతతో భాగస్వామ్యాన్ని స్వాగతిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2227056)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7