ఆయుష్
azadi ka amrit mahotsav

ఎన్ఐఏ జైపూర్ స్వర్ణోత్సవం.. ఆయుర్వేదలో 50 సంవత్సరాల నాయకత్వానికి గుర్తుగా జైపూర్‌లో ఈ రోజు కీలక మౌలిక సదుపాయాలు, ప్రజా సంబంధ కార్యక్రమాలకు శ్రీకారం


భారత ప్రాచీన వైద్య విజ్ఞానానికీ, ఆధునిక శాస్త్రవిజ్ఞానానికీ వారధిలా నిలిచిన ఎన్ఐఏ: ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ

శక్తిమంతమైన ఆయుష్ సంస్థల దన్నుతో ప్రపంచంలో ఓ సంపూర్ణ వెల్‌నెస్ సెంటర్‌గా ఎదగాలన్నదే భారత్ ధ్యేయం: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ ప్రతాప్‌రావు జాదవ్

ఆయుర్వేద విద్యలో, ఆరోగ్య సంరక్షణలో రాజస్థాన్ గౌరవాన్విత నాయకత్వానికి ప్రతీక జాతీయ ఆయుర్వేద సంస్థ: ఉప ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ చంద్ బైర్వా

కీలక మౌలిక సదుపాయాల్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి, సహాయ మంత్రి.. ఎన్ఐఏ జైపూర్‌లో మొదటి పాడ్‌కాస్టులో పాల్గొన్న సహాయ మంత్రి

కొత్త ఓపీడీ బ్లాకు, అడ్వాన్స్‌డ్ ఓటీ, సిమ్యులేషన్ ల్యాబులతో పాటు ధన్వంతరి ఉపవన్ ప్రారంభం.. విద్య, పరిశోధన, రోగుల సంరక్షణకు దన్ను

విద్య, పరిశోధన, రోగుల సంరక్షణకు గ్లోబల్ సెంటరుగా తన పాత్రను పునరుద్ఘాటించిన జాతీయ ఆయుర్వేద సంస్థ

నాడు పోస్టు చేయడమైనది: 09 FEB 2026 2:17PM by PIB Hyderabad

ఆయుర్వేద విద్యపరిశోధనఆరోగ్యసంరక్షణలకు భారత్‌లో ప్రధాన సంస్థజైపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ ఆయుర్వేద సంస్థ (ఎన్ఐఏఈ రోజు స్వర్ణోత్సవాన్ని జరుపుకొందిఈ సంస్థ గత 50 ఏళ్లుగా ఆయుర్వేద రంగంలో ఉంటూ ప్రజారోగ్యానికి విశేష సేవలందిస్తోందిఈ సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారుఈ కార్యక్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మకేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి (స్వతంత్ర), ఆరోగ్యంకుటుంబ సంక్షేమ శాఖలో సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రా‌వు జాదవ్రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిఆయుష్ మంత్రి శ్రీ ప్రేమ్ చంద్ బైర్వాలతో పాటు ఆయుష్ శాఖ ఉన్నతాధికారులువిద్యావేత్తలుపరిశోధకులువిద్యార్థులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
 

మొదట 1976లో ఓ ఆయుర్వేద కళాశాలగా ఏర్పాటు చేసినప్పటి నుంచీభారత ఆయుర్వేద రంగంలో విద్యశిక్షణపరిశోధనచేతిరాత ప్రతుల శాస్త్రీయ అధ్యయన రంగాలతో పాటు రోగులకు చెప్పుకోదగిన స్థాయిలో సంరక్షణ సేవల్ని అందిస్తూఈ రంగంలో మొదటి ‘డీమ్డ్టుబి యూనివర్సిటీ’ స్థితికి ఎన్ఐఏ ఎదగడాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.
రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ ఎన్ఐఏ స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ,  ఈ సంస్థ భారత ప్రాచీన వైద్య విజ్ఞానానికీఆధునిక విజ్ఞానశాస్త్రానికీ ప్రత్యక్ష సేతువుగా ఉందన్నారుసంస్థ 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడమంటే అది ఒక్క కాలం విషయంలోనే కాకుండాఆయుర్వేదం పట్ల అంకిత భావంతో కూడిన సేవపరిశోధనప్రజారోగ్యం పట్ల నిబద్దతల కొనసాగింపు కూడా అని ఆయన అన్నారు.


రాజస్థాన్ చారిత్రకంగా ఆయుర్వేద పురోగతికి తోడ్పడిందనీవైద్యం పరంగా జీవ వైవిధ్యాన్నీసాంప్రదాయిక జ్ఞాన వ్యవస్థల్నీ సమృద్ధం చేసిందనీ ముఖ్యమంత్రి తెలిపారుఆయుష్ వ్యవస్థలను బలోపేతం చేయడానికీప్రజల మేలు కోరి ఆయుర్వేదాన్నీయోగానీసాంప్రదాయిక వైద్యాన్నీ ప్రధాన స్రవంతి ఆరోగ్యసంరక్షణ ప్రణాళికతో మిళితం చేయడానికీ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తోందని ఆయన అన్నారు.


విద్యలోపరిశోధనలోరోగుల సంరక్షణలో ఎన్ఐఏ దేశానికే నాయకత్వం వహిస్తోందని శ్రీ భజన్ లాల్ శర్మ ప్రశంసించారుదేశంలో ప్రతిష్ఠాత్మక ఆయుర్వేద సంస్థల్లో ఒకటిగా ఎన్ఐఏ నిలిచిందని ఆయన చెప్పారుసంస్థలో మౌలిక సదుపాయాలను విస్తరించడానికీవిద్య పరంగా శ్రేష్ఠత్వాన్ని సాధించడానికీరాబోయే కాలాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సంస్థను అభివృద్ధి చేయడానికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సాయాన్నందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.


స్వర్ణోత్సవం అంటే సంకల్పాలను పునర్నవీకరించుకొనే సందర్బమని ముఖ్యమంత్రి వర్ణించారుఎన్ఐఏను రాబోయే దశాబ్దాల్లో ఆయుర్వేద విద్యపరిశోధనల్లో గ్లోబల్ సెంటర్‌గా తీర్చిదిద్దాలంటే ఉమ్మడి కృషి ఎంతయినా అవసరమని ఆయన అన్నారుసంస్థ వారసత్వాన్ని ఉన్నతంగా నిలబెట్టడంలో అమూల్య తోడ్పాటును అందించిన బోధన సిబ్బందినీవిద్యార్థుల్నీపరిశోధకుల్నీపూర్వ విద్యార్థుల్నీ ఆయన అభినందించారు.
ఎన్ఐఏ 50 సంవత్సరాల ప్రస్థానం ఈ ప్రాచీన విజ్ఞానశాస్త్రాన్ని తరాల తరబడి పరిరక్షించడంతో పాటు ముందుకు తీసుకుపోతున్న ఆయుర్వేద పండితులవైద్యులపరిశోధకుల తిరుగులేని నిబద్ధతకు అద్దం పడుతోందని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదాశ్రీ ప్రతాప్‌రావు జాదవ్ అన్నారుఎన్ఐఏ భారత సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ అనుబంధ విస్తారిత వ్యవస్థలో ఓ కీలక సంస్థగా ఉందని ఆయన వర్ణించారు.


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ఆయుష్ వ్యవస్థలు జాతీయ ఆరోగ్య సంరక్షణ ప్రణాళికలో బలంగా మమేకమయ్యాయని శ్రీ జాదవ్ అన్నారుకొత్తగా మూడు ఆయుర్వేద విషయాల అఖిల భారత సంస్థల ఏర్పాటుజాంనగర్‌లో సాంప్రదాయిక వైద్యానికి సంబంధించిన డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్ సెంటర్ స్థాయి పెంపు వంటి బడ్జెటులో ప్రకటించిన ముఖ్య నిర్ణయాలను గురించి ఆయన ప్రస్తావిస్తూఈ నిర్ణయాలు ఆయుర్వేద రంగ రూపురేఖల్ని గొప్పగా మారుస్తాయన్నారు.
ఆయుష్‌ను ఫలితాలపై ఆధారపడేశాస్త్రీయంగా చెల్లుబాటయ్యేప్రపంచ వ్యాప్తంగా ఆమోదించే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థగా నిలపాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని మంత్రి ఉద్ఘాటించారుఅడ్వాన్స్‌డ్ రీసర్చ్డిజిటల్ ఆరోగ్య కార్యక్రమాలుఅంతర్జాతీయ సహకారంరోగులపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించడం వంటి అంశాల్లో ఎన్ఐఏ వంటి సంస్థలు కీలక పాత్రను పోషిస్తున్నాయని ఆయన అన్నారు.
రాజస్థాన్ ప్రభుత్వం నిరంతరంగా మద్దతు ఇస్తుండడాన్ని శ్రీ జాదవ్ ప్రశంసిస్తూసంస్థ విస్తరణకు భూమిని సమకూర్చడంతో పాటు మౌలిక సదుపాయాల పరంగానూ సహకారాన్ని అందించడాన్ని కొనసాగించాల్సిందిగా విజ్ఞప్తి చేశారుఎన్ఐఏ ప్రపంచంలోనే సంపూర్ణ వెల్‌నెస్ కూడళ్లలో ఒకటిగా నిలిచి, ‘‘హీల్ ఇన్ ఇండియా’’ దార్శనికతకు తన వంతుగా చెప్పుకోదగ్గ తోడ్పాటును అందించగలుగుతుందన్న నమ్మకం తనకుందని ఆయన అన్నారు.


ఎన్ఐఏ స్వర్ణోత్సవాలు ఒక్క రాజస్థాన్‌కే కాకుండా దేశానికే గర్వకారణమని రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిఆయుష్ మంత్రి శ్రీ ప్రేమ్ చంద్ బైర్వా అన్నారు. 1976లో ఓ ఆయుర్వేద కళాశాలగా ఉన్న సంస్థ జాతీయంగాఅంతర్జాతీయంగా గుర్తింపును పొందిన సంస్థ స్థితికి చేరుకోవడం ఈ సంస్థ విద్యారంగ ప్రావీణ్యాన్నీసేవాతత్పరతనీ ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు.
ప్రజల్లో ఆరోగ్యాన్ని పెంపొందింపచేయడానికి ఆయుర్వేదయోగాలతో పాటు సాంప్రదాయిక వైద్యాన్ని కూడా పటిష్ఠపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ బైర్వా పునరుద్ఘాటించారుఎన్ఐఏను ఆయుర్వేద విద్యపరిశోధనరోగుల సంరక్షణలలో ప్రపంచ శ్రేణి కేంద్రంగా తీర్చిదిద్దడానికి రాజస్థాన్ ప్రభుత్వం నిరంతరాయంగా పూర్తి మద్దతును అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
స్వర్ణోత్సవాల్లో భాగంగా అనేక ముఖ్య కార్యక్రమాలనీసదుపాయాలనీ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌ లాల్ శర్మకేంద్ర మంత్రి శ్రీ ప్రతాప్ రావు జాదవ్‌లు ప్రారంభించారువీటిలో ‘ధన్వంతరి ఉపవన్’ ప్రారంభ కార్యక్రమం కూడా కలిసి ఉందిఔషధ మొక్కలతో కూడిన ఒక తోటయే ఈ ఉపవనందీని తరువాత చర్చా కార్యక్రమాల్ని చేపట్టారుకేంద్ర సహాయ మంత్రి మార్గదర్శకత్వం వహించారుఒక కొత్త ఆపరేషన్ థియేటర్ బ్లాకునీఅడ్వాన్స్‌డ్ సిమ్యులేషన్ ల్యాబొరేటరీనీ కేంద్ర మంత్రి ప్రారంభించారువీటితో సంస్థలో వైద్య చికిత్స సంబంధిత శిక్షణపరిశోధన సామర్థ్యంరోగుల సురక్ష విశేషించి మెరుగవుతాయి.
అవుట్‌పేషెంట్ సేవల్ని విస్తరించిరోగుల లభ్యతని మెరుగుపరిచే దృష్టితో కొత్త ఓపీడీ బ్లాకు ‘‘సుశ్రుత్ భవన్’’ను ప్రారంభించారుదీనికి అదనంగాఎన్ఐఏ పాడ్‌కాస్ట్ స్టూడియో నుంచి ఒకటో ఆధికారిక పాడ్‌కాస్టును మొదలుపెట్టారుడిజిటల్ అవుట్ రీచ్అకాడమిక్ కమ్యూనికేషన్ప్రజా సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యాలను కేంద్ర మంత్రి తొలి ఎపిసోడ్‌లో వివరించారు.
విద్యపరిశోధనరోగులను దయతో సంరక్షించడం ద్వారా ఆయుర్వేదాన్ని పరిరక్షిస్తూ రోజు రోజుకూ మును ముందుకు తీసుకుపోవడానికి అంకిత భావంతో పనిచేస్తున్న ప్రధాన సంస్థగా ఎన్ఐఏ పోషిస్తున్న కీలక పాత్రను స్వర్ణోత్సవ ఘట్టం పునరుద్ఘాటించిందిఆయుర్వేద జ్ఞానండిజిటల్ హెల్త్ ఇన్నొవేషన్‌లతో పాటు సాంప్రదాయిక వైద్యంలో ప్రపంచ కూడలి (గ్లోబల్ హబ్)గా సంస్థను నిలబెట్టాలని ఉత్సవ ముగింపు సమయంలో ఉమ్మడిగా సంకల్పం చెప్పుకొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2225550) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी