జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పీఎం మిత్ర పార్కులు

నాడు పోస్టు చేయడమైనది: 03 FEB 2026 1:38PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఏడు ప్రాంతాలు.. తమిళనాడు (విరుదునగర్), తెలంగాణ (వరంగల్), గుజరాత్ (నవసారి), కర్ణాటక (కలబురగి), మధ్యప్రదేశ్ (ధార్), ఉత్తరప్రదేశ్ (లక్నో), మహారాష్ట్ర (అమరావతి)లో పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అప్పారెల్ (పీఎం మిత్రపార్కుల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిందిదీనికోసం ఏడేళ్ల కాలానికి 2027-28 వరకు రూ.4,445 కోట్ల నిధులు కేటాయించిందిపీఎం మిత్ర పథకం ద్వారా ఒక్కో పార్కుకు సుమారు రూ.10,000 కోట్ల పెట్టుబడి వస్తుందనితద్వారా లక్షల మందికి ఉపాధి (ప్రత్యక్షంగా లక్షపరోక్షంగా లక్షల ఉద్యోగాలులభిస్తుందని అంచనాపెట్టుబడులను ఆకర్షించేందుకుఈ పార్కులను సమర్థవంతంగా అమలు చేయటానికి అంతర్జాతీయజాతీయప్రాంతీయ స్థాయిలో రాష్ట్రాలుపెట్టుబడిదారులుపొటెన్షియల్ పార్క్ డెవలపర్లతో సహా వివిధ వాటాదారులతో ప్రభుత్వం 200లకు పైగా సంప్రదింపులు జరిపింది.

ఈ పార్కుల గేట్ల నుంచి బాహ్య మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2,160.17 కోట్ల విలువైన పనులను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిఇప్పటివరకు రూ.564.72 కోట్లు ఖర్చు చేశాయిమధ్యప్రదేశ్తమిళనాడుమహారాష్ట్రతెలంగాణలోని పీఎం మిత్ర పార్కుల కోసం రూ.7,145 కోట్ల విలువైన డీపీఆర్‌ ప్రతిపాదనలకు ఆమోదం లభించిందిమధ్యప్రదేశ్‌లో రూ.24,175 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో 1,150 ఎకరాల భూమిని కేటాయించారుతమిళనాడులో రూ.2,076 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో 201 ఎకరాల భూమి కోసం ఇప్పటికే దరఖాస్తులు అందాయిమహారాష్ట్రలో భూ కేటాయింపుల కోసం దరఖాస్తులను ఆహ్వానించారుతెలంగాణలో ఇప్పటికే 540 ఎకరాల భూమిని కేటాయించగారూ.3,862 కోట్ల మేర పెట్టుబడులు కార్యరూపం దాల్చాయిపీఎం మిత్ర పథకంలోని డెవలప్‌మెంట్‌ క్యాపిటల్‌ సపోర్ట్‌లో భాగంగా మొదటి విడత ద్వారా మధ్యప్రదేశ్తమిళనాడుకు ఒక్కొక్క దానికి రూ.50 కోట్ల చొప్పునమహారాష్ట్రతెలంగాణకు ఒక్కొక్క రాష్ట్రానికి రూ.30 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయి.

తమిళనాడులోని విరుదునగర్ పీఎం మిత్ర పార్కుకు సంబంధించి 100% భూసేకరణ పూర్తయిందిపర్యావరణ అనుమతులతో సహా అవసరమైన అన్ని అనుమతులు లభించాయిరూ.1,894 కోట్ల విలువైన ప్రాజెక్టు నివేదికకు ఆమోదం లభించగారూ.364 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పనులను ఇప్పటికే కేటాయించారుభూ కేటాయింపు విధానానికి ఆమోదం లభించిన తర్వాతఇప్పటివరకు 201 ఎకరాల భూమికి రూ.2,076 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో దరఖాస్తులు అందాయి.

కొత్తగా ఇతర పీఎం మిత్ర పార్కుల ఏర్పాటు ప్రతిపాదనలు ప్రస్తుతం పరిశీలనలో లేవు.

ఇవాళ లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర జౌళిశాఖ సహాయమంత్రి శ్రీ పబిత్రా మార్గరీటా ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారమిచ్చారు.

 

***

 

(రిలీజ్ ఐడి: 2222620) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil