ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారతరత్న శ్రీ కర్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 24 JAN 2026 8:53AM by PIB Hyderabad

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న అవార్డు గ్రహీత శ్రీ కర్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు.

 

సమాజంలోని అణగారిన, వెనకబడిన, బలహీన వర్గాల అభ్యున్నతే ఎల్లప్పుడూ కర్పూరీ ఠాకూర్ రాజకీయాల్లో ప్రధానాంశమని ప్రధానమంత్రి అన్నారు. జననాయక్ కర్పూరి ఠాకూర్ తన సాదాసీదా జీవనం, ప్రజా సేవకు ఆయన చూపిన అంకిత భావాల ద్వారా ఎల్లప్పుడూ గుర్తుండిపోతారని తెలిపారు. ఆయన అందరికీ ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

 

‘‘బిహార్ మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న జననాయక్ కర్పురి ఠాకూర్ జయంతి సందర్భంగా ఆయనకు నా ఘన నివాళులు. సమాజంలో దోపిడీకి గురైన, అణగారిన, బలహీన వర్గాల అభ్యున్నతే ఎల్లప్పుడూ ఆయన రాజకీయాల్లో కేంద్రబిందువుగా ఉండేది. తన నిరాడంబరత, ప్రజా సేవ పట్ల ఆయనకున్న అంకితభావంతో ఎప్పటికీ గుర్తుండిపోతారు. అందరికీ ఆదర్శంగా నిలిచిపోతారు’’.


(रिलीज़ आईडी: 2218053) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Tamil , Malayalam