గనుల మంత్రిత్వ శాఖ
2025 సంవత్సరాంతం సమీక్ష
प्रविष्टि तिथि:
31 DEC 2025 11:56AM by PIB Hyderabad
భారత గనుల తవ్వకానికి సంబంధించిన అనుబంధ విస్తారిత వ్యవస్థను ఆధునికీకరించడంతో పాటు ఖనిజాలకు సంబంధించిన భద్రతను పటిష్ఠపరచడానికి గనుల శాఖ 2025లో విధానపరంగా సమగ్ర సంస్కరణలను అమలు చేసింది. చేపట్టిన కీలక చర్యలలో.. ఎంఎండీఆర్ సవరణ చట్టం-2025కు సవరణ, ఎన్ఎంఈటీకి ఎన్ఎంఈడీటీ అనే ఒక కొత్త పేరును పెట్టి విస్తరణను చేపట్టడంతో పాటు మరిన్ని నిధులను కూడా అందించడం, క్యాప్టివ్ మైన్ విక్రయాలపై ఆంక్షల తొలగింపు, ఎంపిక చేసిన ఖనిజాలను ప్రధాన ఖనిజాలుగా పునర్ వర్గీకరించడం, కీలక ఖనిజాలకు రాయల్టీ రేట్లను అధికారికంగా ప్రకటించడం, ఖనిజ మార్పిడికి ప్రోత్సాహాన్ని అందించడం, సముద్ర అంతర్భాగంలో గనుల తవ్వకం పనులకు సంబంధించిన సంస్కరణలను అమలులోకి తీసుకురావడం వంటివి ఉన్నాయి. పారదర్శకతను మెరుగుపరిచి, వ్యాపార నిర్వహణలో సౌలభ్యానికి బాట వేసి, ఖనిజాల ఉత్పత్తిని పెంపొందిస్తూ, స్థిరాభివృద్ధికి దన్నుగా నిలవాలనే ఉద్దేశాలతో ఈ సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఈ సంస్కరణలు 2047వ సంవత్సరానికల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో తోడ్పడే ఓ ముఖ్య రంగంగా గనుల రంగాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్రను పోషిస్తాయి.
మరింత సమాచారం కోసం ఈ కింది లింకును సంప్రదించాలి.
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2025/dec/doc20251231748501.pdf
(रिलीज़ आईडी: 2210081)
आगंतुक पटल : 7