ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మధ్యప్రదేశ్‌లోని షాడోల్‌లో సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 01 JUL 2023 8:03PM by PIB Hyderabad

భారత్ మాతా కీజై!

భారత్ మాతా కీజై!

ఈ కార్యక్రమానికి విచ్చేసిన మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్ పటేల్ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్కేంద్రమంత్రి వర్గ సహచరులు శ్రీ మన్‌సుఖ్‌ మాండవీయశ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తేప్రొఫెసర్ ఎస్.పిసింగ్ బఘేల్శ్రీమతి రేణుకా సింగ్ సరుతా జీడాక్టర్ భారతి పవార్శ్రీ బిశ్వేశ్వర్ తుడుపార్లమెంటు సభ్యులు శ్రీ వి.డిశర్మమధ్యప్రదేశ్ ప్రభుత్వ మంత్రులుశాసన సభ్యులుదేశవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విశిష్ట అతిథులుమమ్మల్ని ఆశీర్వదించటానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన నా ప్రియమైన సోదరీసోదరులారా!

జై సేవాజై జోహార్రాణి దుర్గావతి పవిత్ర భూమిపై ఇవాళ మీ అందరి మధ్య ఉండటం నా అదృష్టంరాణి దుర్గావతికి నా హృదయపూర్వక నివాళులుఆమె స్ఫూర్తితోనే ఈరోజు 'సికిల్ సెల్ అనీమియా ముక్తి (నిర్మూలనమిషన్వంటి భారీ ప్రచార కార్యక్రమం ప్రారంభమవుతోందిఇవాళ మధ్యప్రదేశ్‌లోని కోటి మంది లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను కూడా అందిస్తాంఈ రెండు ప్రయత్నాల వల్ల ప్రధానంగా లబ్ధి పొందేది గోండ్భీల్ఇతర గిరిజన వర్గాలేఈ సందర్భంగా మీ అందరికీమధ్యప్రదేశ్ డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి నా హృదయపూర్వక అభినందనలు.

మిత్రులారా,

షాడోల్ గడ్డపై ఇవాళ దేశం ఒక గొప్ప సంకల్పానికి పూనుకుంటోందిమన గిరిజన సోదరీసోదరుల సంక్షేమం కోసమే ఈ సంకల్పంసికిల్ సెల్ అనీమియా నుంచి విముక్తి పొందడమే ఈ సంకల్పంఏటా సికిల్ సెల్ అనీమియా బారిన పడుతున్న 2.5 లక్షల మంది పిల్లల ప్రాణాలను, 2.5 లక్షల కుటుంబాలను కాపాడటమే ఈ సంకల్పం.

మిత్రులారా,

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని గిరిజన తెగలకు నేను దగ్గరుండిచాలా కాలం గమనించానుసికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధులు ఎంతో వేదన భరితందీనివల్ల నిరంతరం కీళ్ల నొప్పులువాపులుశరీరంలో అలసటతో రోగులు ఇబ్బందిపడతారువెన్నుకాళ్లుఛాతీలో భరించలేని నొప్పిశ్వాస తీసుకోవటానికి కూడా ఇబ్బంది పడుతుంటారుఈ దీర్ఘకాలిక బాధరోగుల ఇతర అవయవాలను కూడా దెబ్బతీస్తుందికేవలం వ్యక్తులపైనే కాదు.. వారి కుటుంబాలపైనా ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపుతుందిఇది గాలినీరుఆహారం ద్వారా వ్యాపించదువంశపారపర్యంగా వచ్చే వ్యాధిఅంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుందిఈ వ్యాధితో జన్మించిన పిల్లలు జీవితాంతం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మిత్రులారా,

ప్రపంచవ్యాప్తంగా సికిల్ సెల్ అనీమియా కేసుల్లో దాదాపు 50 శాతం కేసులు మన దేశంలోనే ఉన్నాయిదురదృష్టవశాత్తు, 70 ఏళ్లుగా ఈ సమస్యను ఎవరూ పట్టించుకోలేదుదీని పరిష్కారానికి పటిష్టమైన ప్రణాళికను రూపొందించలేదుఈ వ్యాధి బారిన పడిన వారిలో అత్యధికులు గిరిజన సామాజిక వర్గం వారేగిరిజన సమాజం పట్ల గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా.. ఇది వారికి కనీసం ఒక సమస్యగా కూడా అనిపించలేదుగిరిజన సమాజం ఎదుర్కొంటున్న ఈ ప్రధాన సమస్యను పరిష్కరించే బాధ్యతను ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తీసుకుందిమా దృష్టిలో గిరిజన సమాజం అంటే కేవలం ప్రభుత్వ గణాంకాలు మాత్రమే కాదుఅత్యంత సానుభూతిభావోద్వేగంతో కూడిన అంశంనేను గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందు నుంచే ఈ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టానుమన గవర్నర్ శ్రీ మంగుభాయ్గిరిజన సమాజం కోసం అంకితభావంతో పనిచేసిన నాయకుడుమంగుభాయ్నేను కలిసి దాదాపు 50 ఏళ్లుగా గిరిజన ప్రాంతాల్లో పని చేస్తున్నాంఈ వ్యాధిని ఎదుర్కొనేందుకుగిరిజన కుటుంబాల్లో అవగాహన పెంచేందుకు మేం నిరంతరం కృషి చేశాంనేను గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక.. దీనికి సంబంధించి ఎన్నో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించానునేను ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జపాన్‌ను సందర్శించినప్పుడుఅక్కడ ఒక నోబెల్ బహుమతి గ్రహీతైన శాస్త్రవేత్తను కలిశానుఆయన సికిల్ సెల్ వ్యాధిపై ఎంతో పరిశోధన చేశారని తెలిసిందిసికిల్ సెల్ అనీమియా నివారణకు ఆయన సాయం కోరాను.

మిత్రులారా,

సికిల్ సెల్ అనీమియా నుంచి విముక్తికి చేపట్టిన ఈ ప్రచారం 'అమృత్ కాల్ప్రధాన కర్తవ్యంగా మారుతుందిమనం ఒక మిషన్‌లాగా కలిసి పనిచేస్తేదేశం 100వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకునే నాటికిఅంటే 2047 వరకు మన గిరిజన కుటుంబాలనుఈ దేశాన్ని సికిల్ సెల్ అనీమియా నుంచి విముక్తి చేయగలమని నమ్ముతున్నానుఇందుకోసం అందరం కలిసి బాధ్యతలను నెరవేర్చాలిప్రభుత్వంఆరోగ్య కార్యకర్తలుగిరిజన సంఘాల సమన్వయంతో పనిచేయటం ఎంతో అవసరంసికిల్ సెల్ అనీమియా బాధితులకు రక్తమార్పిడి అవసరమవుతుందివారి కోసం బ్లడ్ బ్యాంకులు ఏర్పాటవుతున్నాయిచికిత్స కోసం 'బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్సౌకర్యాలనూ విస్తరిస్తున్నారుసికిల్ సెల్ అనీమియా బాధితులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించటం ఎంత ముఖ్యమో మీకు తెలుసుబయటకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా ఈ వ్యాధి ఉండవచ్చుఅలాంటి వారు తెలియకుండానే తమ పిల్లలకు ఈ వ్యాధిని సంక్రమింపజేస్తారుఅందుకే పరీక్షలు చేయించుకోవటంస్క్రీనింగ్ ద్వారా వ్యాధి వాహకులను గుర్తించటం చాలా ముఖ్యంపరీక్షలు చేయించుకోకపోతేరోగికి చాలా కాలం వరకు వ్యాధి గురించి తెలియకపోవచ్చుమన్‌సుఖ్ మాండవీయ ఇందాక చెప్పినట్లుగా చాలా కుటుంబాల్లో జాతకాలు కలపటంపుట్టిన తేదీల ఆధారంగా కుండలీలను సరిచూడటం అలవాటుపెళ్లికి ముందు వారు జాతకాలను సరిచూస్తారుఆయన చెప్పినట్లుగానే.. మీరు జాతకాలు చూసినా చూడకపోయినాసికిల్ సెల్ స్క్రీనింగ్ రిపోర్టునుమీకు ఇస్తున్న కార్డును మాత్రం తప్పనిసరిగా సరిచూసుకోవాలిఆ తర్వాతే వివాహం విషయంలో ముందుకు సాగాలి.

మిత్రులారా,

ఒక తరం నుంచి మరో తరానికి ఈ వ్యాధి సంక్రమించకుండా అరికట్టవచ్చుఇందుకోసం ప్రతి ఒక్కరూ వ్యాధి నిర్ధారణ ప్రచారంలో పాల్గొనికార్డును పొందిపరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నానుఈ విషయంలో సమాజం ఎంత ఎక్కువ బాధ్యత తీసుకుంటేసికిల్ సెల్ అనీమియా నుంచి అంత సులభంగా విముక్తి పొందవచ్చు.

మిత్రులారా,

వ్యాధులు ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయవుకుటుంబంలో ఒకరు అనారోగ్యానికి గురైనామొత్తం కుటుంబం ప్రభావితమవుతుందిఒక వ్యక్తికి జబ్బు చేస్తేఆ కుటుంబమంతా పేదరికంనిస్సహాయత ఊబిలో చిక్కుకుపోతుందినేను కూడా మీలాంటి సామాన్య కుటుంబం నుంచే వచ్చానుమీ అందరి ఆశీస్సులతో ఈ స్థాయికి చేరుకున్నానుఅందువల్ల నేనుమీ సమస్యలను అర్థం చేసుకునిమీ బాధను పంచుకోగలనుఇలాంటి తీవ్రమైన వ్యాధుల నిర్మూలనకు మా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందిఈ ప్రయత్నాల ఫలితంగానే దేశంలో క్షయ వ్యాధి కేసులు తగ్గుముఖం పట్టాయి. 2025 నాటికి దేశంలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించే దిశగా మేం అడుగులు వేస్తున్నాం.

మిత్రులారా,

మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు, 2013లో 11,000 కాల-అజర్ కేసులుండేవిఇవాళ అవి వెయ్యి కంటే తక్కువ కేసులున్నాయి. 2013లో 10 లక్షలు ఉన్న మలేరియా కేసులు, 2022 నాటికి లక్షల కంటే తక్కువయ్యాయి. 2013లో దాదాపు 1.25 లక్షల కుష్టు వ్యాధి కేసులుండగాఇప్పుడు ఆ సంఖ్య సుమారు 70 నుంచి 75 వేలకు తగ్గిందిగతంలో మెదడు వాపు వ్యాధి సృష్టించిన బీభత్సం మనకు తెలిసిందేఈ వ్యాధి బారిన పడేవారి సంఖ్య ఇటీవల గణనీయంగా తగ్గిపోయిందిఇవి కేవలం గణాంకాలు మాత్రమే కాదువ్యాధుల వ్యాప్తి తగ్గినపుడు ప్రజలు.. బాధనొప్పివేదనమరణాల నుంచి విముక్తి పొందుతారు.

అన్నాదమ్ములుఅక్కాచెల్లెల్లారా,

వ్యాధుల భారాన్నే కాదు.. వాటి వల్ల కలిగే ఆర్థిక భారాన్ని కూడా తగ్గించాలన్నదే మా ప్రభుత్వ ప్రయత్నంమేం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ యోజనప్రజలపై భారాన్ని తగ్గించిందికేవలం మధ్యప్రదేశ్‌లోనే ఇవాళ కోటి మందికి ఆయుష్మాన్ కార్డులు అందించాంపేదవాడు ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తేఈ కార్డు అతడి జేబులో లక్షల రూపాయల ఏటీఎం కార్డులా పనిచేస్తుందిగుర్తుంచుకోండిఇవాళ మీరందుకున్న ఈ కార్డు లక్షల రూపాయల విలువైనదిఈ కార్డు మీ దగ్గర ఉంటేచికిత్స అందించటానికి ఎవరూ నిరాకరించరుడబ్బులు కూడా అడగలేరుమీరు ఇబ్బందుల్లో ఉండిభారతదేశంలో ఏ ఆస్పత్రికి వెళ్లినా మోదీ ఇచ్చిన ఈ గ్యారెంటీ కార్డును చూపిస్తేమీకు ఖచ్చితంగా చికిత్స అందించాల్సిందేఈ ఆయుష్మాన్ కార్డు పేదల వైద్యం కోసం ఇచ్చే లక్షల రూపాయల హామీఇది మోదీ ఇస్తున్న గ్యారెంటీ.

అన్నాదమ్ములుఅక్కాచెల్లెల్లారా,

ఆయుష్మాన్ యోజన కింద దేశవ్యాప్తంగా సుమారు ఐదు కోట్ల మంది పేదలకు ఉచిత చికిత్స అందించాంఈ 'ఆయుష్మాన్ భారత్కార్డు లేకపోతే పేద ప్రజలు వైద్యం కోసం లక్ష కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చేదిఊహించండి.. వారిలో ఎంతమంది జీవితంపై ఆశలు వదులుకునేవారోచికిత్స కోసం ఎన్ని కుటుంబాలు ఇళ్లనుపొలాలను అమ్ముకోవాల్సి వచ్చేదోమా ప్రభుత్వం ప్రతి కష్టకాలంలోనూ పేదలకు అండగా నిలిచిందిఈ లక్షల రూపాయల 'ఆయుష్మాన్ యోజన గ్యారెంటీ కార్డుపేదలకు ఆందోళనను దూరం చేసే భరోసాఈ పథకం అమలులో పాలుపంచుకుంటున్న వారు ఒక్కసారి ఈ కార్డును చూడండిదీనిపై లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స అని రాసి ఉంటుందిఈ దేశంలో పేదవాడికి లక్షల రూపాయల గ్యారెంటీని గతంలో ఎవరూ ఇవ్వలేదుఇది బీజేపీ ప్రభుత్వంనేను మోదీమీకు లక్షల రూపాయల భరోసా ఇచ్చే కార్డును అందిస్తున్నాం.

మిత్రులారా,

ఈ గ్యారెంటీలుతప్పుడు హామీలు ఇచ్చే వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలిసొంత గుర్తింపులేని వ్యక్తులే మీ ముందుకు వచ్చి గ్యారెంటీల పేరుతో కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారువారి హామీల వెనకున్న లోపాలను గుర్తించండితప్పుడు హామీలతో మోసపూరిత చర్యల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి.

మిత్రులారా,

ఉచిత విద్యుత్ గ్యారెంటీ ఇస్తున్నారంటేవిద్యుత్ ధరలను పెంచుతారని అర్థంఉచిత ప్రయాణ గ్యారెంటీ ఇస్తున్నారంటేఆ రాష్ట్ర రవాణా వ్యవస్థను నాశనం చేయబోతున్నారని అర్థంపెన్షన్లు పెంచుతామంటేఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సమయానికి అందవని అర్థంచౌకగా పెట్రోల్ ఇస్తామనే గ్యారెంటీ వెనుకపన్నులు పెంచి మీ జేబుల నుంచి డబ్బులు లాగేసే కుట్ర ఉంటుందిఉపాధి అవకాశాలను పెంచుతామని ఇచ్చే గ్యారెంటీ ద్వారా అక్కడి పరిశ్రమలనువ్యాపారాలను దెబ్బతీసే విధానాలను తీసుకువస్తారుకాంగ్రెస్ వంటి పార్టీలు ఇచ్చే గ్యారెంటీ అంటే అది పేదలను మోసం చేసేహాని కలిగించే విధంగా ఉంటుందిఇది వారి ఆట. 70 ఏళ్లలో పేదలకు కడుపు నిండా భోజనం పెడతామని వారు గ్యారెంటీ ఇవ్వలేకపోయారుప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచిత రేషన్ గ్యారెంటీ లభిస్తోంది. 70 ఏళ్లలో పేదలకు తక్కువ ధరకు వైద్యం అందుతుందని వారు గ్యారెంటీ ఇవ్వలేకపోయారుకానీ ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా 50 కోట్ల మంది లబ్ధిదారులకు ఆరోగ్య బీమా లభించింది. 70 ఏళ్లలో మహిళలకు పొగ రహిత జీవనం కల్పించేందుకు వారు గ్యారెంటీ ఇవ్వలేకపోయారుఉజ్వల యోజన ద్వారా దాదాపు 10 కోట్ల మంది మహిళలకు పొగ రహిత స్వచ్ఛమైన జీవితం గ్యారెంటీగా దక్కింది. 70 ఏళ్లలో పేదలుతమ కాళ్ల మీద నిలబడేలా గ్యారెంటీ ఇవ్వలేకపోయారుముద్రా యోజన ద్వారా 8.5 కోట్ల మంది ప్రజలకు గౌరవప్రదమైన స్వయం ఉపాధి గ్యారెంటీ లభించింది.

వారి గ్యారెంటీ అంటేనే ఏదో ఒక మోసంకుట్ర దాగి ఉందని అర్థంఇవాళ ఏకమయ్యామని చెప్పుకుంటున్న వారి పాత ప్రకటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయివారు ఎప్పుడూ ఒకరినొకరు విమర్శించుకున్నారుఈ ప్రతిపక్షాల ఐక్యతకే ఎటువంటి గ్యారెంటీ లేదుఈ వారసత్వ పార్టీలు కేవలం కుటుంబ సంక్షేమానికే పనిచేశాయిసామాన్య ప్రజల అభ్యున్నతికి వారి వద్ద ఎలాంటి గ్యారెంటీ లేదుఅవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బెయిల్‌పై బయట తిరుగుతున్నారుస్కాముల్లో శిక్ష అనుభవిస్తున్న వారు కూడా ఒకే వేదికపై కనిపిస్తున్నారుదీనర్థం.. అవినీతి రహిత పాలనను అందించే గ్యారెంటీ వారి వద్ద లేదనిదేశానికి వ్యతిరేకంగా అందరూ ఒకే గొంతుకతో మాట్లాడుతున్నారుదేశ వ్యతిరేక శక్తులతో సమావేశాలు నిర్వహిస్తున్నారంటేఉగ్రవాద రహిత భారతదేశాన్ని నిర్మిస్తామనే గ్యారెంటీ వారి వద్ద లేదువారు వాగ్దానాలు చేసి వెళ్లిపోతారుకానీ ఆ పరిణామాలను అనుభవించాల్సింది మీరేవారు గ్యారెంటీలు ఇస్తూ జేబులు నింపుకుంటారుకానీనష్టపోయేది మీ పిల్లలువారి కుటుంబాలను ముందుకు తీసుకెళ్తారుకానీ దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందికాబట్టికాంగ్రెస్‌తో సహా ఇటువంటి రాజకీయ పార్టీల విషయంలోగ్యారెంటీల విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి.

మిత్రులారా,

తప్పుడు గ్యారెంటీలు ఇచ్చేవారి వైఖరి ఎప్పుడూ గిరిజన సమాజాలకు వ్యతిరేకమేగతంలో భాష విషయంలో గిరిజన యువతకు పెద్ద సవాలు ఎదురయ్యేదిఇప్పుడు మాతృభాషలోనే విద్యను అభ్యసించే అవకాశాన్ని నూతన జాతీయ విద్యా విధానం కల్పిస్తోందితప్పుడు గ్యారెంటీలిచ్చేవాళ్లు ఈ జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నారుమన గిరిజన సోదరీసోదరుల పిల్లలు వారి సొంత భాషలో విద్యనభ్యసించటం వారికి ఇష్టం లేదుగిరిజనులుదళితులువెనుకబడిన తరగతులుపేదల పిల్లలు అభివృద్ధిలోకి వస్తేఓటు బ్యాంకు రాజకీయాలు దెబ్బతింటాయని వారికి తెలుసుగిరిజన ప్రాంతాల్లో పాఠశాలలుకళాశాలల ప్రాముఖ్యత నాకు తెలుసుఅందుకేమా ప్రభుత్వం 400లకు పైగా ఏకలవ్య పాఠశాలల ద్వారా గిరిజన విద్యార్థులకు వసతితోపాటు విద్యను పొందే అవకాశాన్ని కల్పించిందిఒక్క మధ్యప్రదేశ్‌లోనే దాదాపు 24,000 మంది విద్యార్థులు ఇటువంటి పాఠశాలల్లో చదువుకుంటున్నారు.

మిత్రులారా,

గత ప్రభుత్వాలు గిరిజన సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయిమేం గిరిజన వ్యవహారాలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిదానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చాంఈ మంత్రిత్వ శాఖ బడ్జెట్‌ను మేం మూడు రెట్లు పెంచాంగతంలో అడవులనుభూములను దోచుకున్న వారికి రక్షణ లభించేదిఅటవీ హక్కుల చట్టం ద్వారా 20 లక్షలకు పైగా పట్టాలను మేం పంపిణీ చేశాంఎన్నో ఏళ్లుగా పంచాయతీల షెడ్యూల్డ్ ప్రాంతాల విస్తరణ చట్టం పెసా పేరుతో కొందరు రాజకీయంగా ఆటలాడారుమేం ఈ పెసా చట్టాన్ని అమలు చేసిగిరిజన సమాజానికి హక్కులను కల్పించాంగతంలో గిరిజన సంప్రదాయాలనువారి కళా నైపుణ్యాలను ఎగతాళి చేసేవారుకానీ మేం 'ఆది మహోత్సవంవంటి కార్యక్రమాలను ప్రారంభించివారి సంస్కృతికి గౌరవాన్ని తీసుకువచ్చాం.

మిత్రులారా,

గత తొమ్మిదేళ్లుగా గిరిజన ఆత్మగౌరవాన్ని కాపాడటానికివారి ప్రతిష్ఠను పెంపొందించటానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయిఇప్పుడు దేశవ్యాప్తంగా నవంబర్ 15న భగవాన్ బిర్సా ముండా జయంతిని 'జన్‌జాతీయ గౌరవ్ దివస్' (జాతీయ గిరిజన గౌరవ దినోత్సవం)గా జరుపుకుంటున్నాందేశంలోని వివిధ రాష్ట్రాల్లో గిరిజన స్వాతంత్ర్య సమరయోధులకు ప్రత్యేక మ్యూజియాలను ఏర్పాటు చేస్తున్నాంఈ ప్రయత్నాల నడుమ గత ప్రభుత్వాల తీరును మనం మర్చిపోకూడదుదశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన వారు గిరిజన సమాజంపేదల పట్ల సున్నితత్వం లేకుండాఅగౌరవంగా వ్యవహరించారుఒక గిరిజన మహిళను దేశ రాష్ట్రపతిని చేయాలన్న చర్చ వచ్చినప్పుడు పలు పార్టీల వైఖరి ఎలా ఉందో మనం చూశాంమధ్యప్రదేశ్ ప్రజలు కూడా వారి తీరును గమనించారుషాడోల్ డివిజన్‌లో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ప్రారంభించినప్పుడువారు దానికి కుటుంబం పేరు పెట్టుకున్నారుకానీఛింద్వారా విశ్వవిద్యాలయానికి గొప్ప గోండ్ విప్లవకారుడైన రాజా శంకర్ షా పేరును శివరాజ్ సింగ్ జీ ప్రభుత్వం పెట్టిందివారు తాంత్యా మామా వంటి వీరులను పూర్తిగా విస్మరించారుకానీ మేం పాతాళపానీ రైల్వే స్టేషన్‌కు తాంత్యా మామా పేరు పెట్టాంపేరుగాంచిన గోండ్ సామాజిక నాయకుడు శ్రీ దల్బీర్ సింగ్ జీ కుటుంబాన్ని కూడా వారు అగౌరవపరిచారుఆ లోటును భర్తీ చేసివారిని మేం గౌరవించాముగిరిజన నాయకులను గౌరవించటమంచే అది మా గిరిజన యువతనుమీ అందరినీ గౌరవించడమే.

మిత్రులారా,

మనం ఈ ప్రయత్నాలను కొనసాగిస్తూవేగం పెంచాలిమీ సహకారంఆశీస్సుల వల్ల మాత్రమే అది సాధ్యమవుతుందిమీ ఆశీస్సులురాణి దుర్గావతి స్ఫూర్తి మనల్ని నిరంతరం నడిపిస్తాయని నమ్ముతున్నాఅక్టోబర్ 5వ తేదీన రాణి దుర్గావతి 500వ జయంతి రాబోతోందని శివరాజ్ జీ ఇప్పుడే చెప్పారురాణి దుర్గావతి శౌర్యానికి సాక్ష్యంగా నిలిచిన ఈ పవిత్ర భూమిపైమీ అందరి మధ్య నిలబడి ఇవాళ నేనొక ప్రకటన చేస్తున్నానురాణి దుర్గావతి 500వ జన్మదిన వేడుకలను భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తుందిఆమె జీవితం ఆధారంగా ఒక చలన చిత్రాన్ని నిర్మిస్తాంఆమె గౌరవార్థం ఒక వెండి నాణేన్నిఆమె చిత్రంతో తపాలా బిళ్లను విడుదల చేస్తాం. 500 ఏళ్ల కిందట జన్మించిన మన పూజ్యనీయ తల్లి స్ఫూర్తిని భారతదేశంలోని ప్రతి ఇంటికీప్రపంచవ్యాప్తంగా చేరవేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం.

అభివృద్ధిలో మధ్యప్రదేశ్ నూతన శిఖరాలను అధిరోహిస్తుందిమనమంతా కలిసి అభివృద్ధి చెందిన భారత్ స్వప్నాన్ని సాకారం చేసుకుందాంకాసేపట్లో ఇక్కడున్న కొన్ని గిరిజన కుటుంబాలను నేను కలవబోతున్నానువారితో మాట్లాడే అవకాశం ఇవాళ నాకు లభించనుందిపెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి తరలివచ్చారుసికిల్ సెల్ నిర్మూలనఆయుష్మాన్ కార్డు పంపిణీ భావితరాల సంక్షేమానికి నేను చేపట్టిన అతిపెద్ద ప్రచార కార్యక్రమాలుదీనికి మీ మద్దతు ఎంతో అవసరంసికిల్ సెల్ వ్యాధి నుంచి మన దేశం విముక్తి పొందాలిమన గిరిజన కుటుంబాలను ఈ సంక్షోభం నుంచి రక్షించాలిదీనికి మీ సహాయంనా గిరిజన కుటుంబాల అండ కావాలిఇదే మీ అందరికీ నా విన్నపంమీరు ఆరోగ్యంగాసుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ.. మీ అందరికీ నా ధన్యవాదాలు!

భారత్ మాతా కీజై!

భారత్ మాతా కీజై!

భారత్ మాతా కీజై!

ధన్యవాదాలు!

(గమనికఇది ప్రధానమంతి హిందీ ప్రసంగానికి స్వేచ్ఛానువాదం.)

 

***


(रिलीज़ आईडी: 2205633) आगंतुक पटल : 36
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam