ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వైద్య విద్యపై తాజా సమాచారం


· కేంద్ర ప్రాయోజిత పథకాల కింద (2025-26 నుంచి 2028-29 వరకు) ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా 10,023 సీట్లు కేటాయించేందుకు ప్రభుత్వ ఆమోదం

· ‘ఎంబీబీఎస్‌’.. ‘పీజీ’ స్థాయులలో 2020-21 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల మధ్య 48,563, 29,080 వంతున సీట్ల పెరుగుదలతో వైద్య విద్యకు గణనీయ ప్రోత్సాహం: ఎన్‌ఎంసీ

प्रविष्टि तिथि: 16 DEC 2025 3:03PM by PIB Hyderabad

జాతీయ వైద్యవిద్యా కమిషన్‌ (ఎన్‌ఎంసీ) సమాచారం ప్రకారం దేశంలోని వైద్య కళాశాలల్లో 2020-21 నుంచి 2025-26 విద్యా సంవత్సరం వరకూ ‘ఎంబీబీఎస్‌’లో 48,563, ‘పీజీ’ స్థాయిలో 29,080 వంతున సీట్ల సంఖ్య పెరిగింది.

ఈ నేపథ్యంలో 2025-26 నుంచి 2028-29 వరకూ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ప్రభుత్వ కళాశాలల్లో మరో 10,023 సీట్ల పెంపునకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.

ఈ విధంగా దేశంలోని వైద్య కళాశాలల్లో సీట్ల పెరుగుదల వల్ల వైద్య విద్యాభ్యాసంపై ఆసక్తిగల విద్యార్థులు మరింత ఎక్కువ సంఖ్యలో తమ కలను నెరవేర్చుకునే అవకాశం లభిస్తుంది.

దేశంలో 2020-21 నుంచి 2025-26 విద్యా సంవత్సరం వరకూ పీజీ సీట్ల సంఖ్య వివరాలు:

వ.సం.

విద్యా సం॥

సీట్ల పెరుగుదల

1

2020-21

4983

2

2021-22

4705

3

2022-23

2874

4

2023-24

4713

5

2024-25

4186

6

2025-26

7619

దేశంలో వైద్య విద్య నాణ్యత పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటైన అత్యున్నత నియంత్రణ సంస్థ ‘ఎన్‌ఎంసీ’ కళాశాలల్లో నిర్దేశిత ప్రమాణాల అనుసరణ దిశగా ‘మినిమం స్టాండర్డ్స్‌ రిక్వైర్‌మెంట్‌’ (ఎంఎస్‌ఆర్‌), ‘అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్-2023’ (జీఎంఈఆర్‌), ‘మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్-2023’ (ఎంఎస్‌ఎంఈఆర్‌), ‘కాంపిటెన్సీ-బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సీబీఎంఈ) కరికులం గైడ్‌లైన్స్-2024’ వంటి వివిధ నిబంధనలను జారీచేసింది. నోటిఫై చేసింది. దేశవ్యాప్తంగా వైద్య విద్య, శిక్షణలో సమగ్రత, నాణ్యత పరిరక్షణ దిశగా ఈ నిబంధనలను ‘ఎన్‌ఎంసీ’ రూపొందించింది.

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్ ఇవాళ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.

 

****


(रिलीज़ आईडी: 2204934) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Punjabi , Tamil