వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దక్షిణాది రాష్ట్రాల్లో సేంద్రీయ సాగుకు ప్రోత్సాహం

प्रविष्टि तिथि: 12 DEC 2025 6:26PM by PIB Hyderabad

  పరంపరాగత్ కృషి వికాస్ యోజన ద్వారా 2015-16 నుంచి తమిళనాడుకర్ణాటకకేరళతెలంగాణ రాష్ట్రాల్లో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారుఈ పథకం కింద సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి సంవత్సరాల్లో హెక్టారుకు రూ. 31,500 సహాయం అందిస్తారుఇందులో పొలం/పొలం వెలుపల సేంద్రీయ ఇన్‌పుట్‌ల కోసం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా రైతులకు హెక్టారుకు రూ. 15,000 సహాయం అందిస్తారుఈ ఆర్థిక సహాయంలో సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ మద్దతూ భాగంగా ఉంటుంది.

2015-16 నుంచి 31.10.2025 వరకు పీకేవీవై పథకం కింద తమిళనాడుకర్ణాటకకేరళతెలంగాణలకు విడుదల చేసిన నిధులు (కేంద్ర వాటా), విస్తీర్ణం కింది విధంగా ఉన్నాయి:

 

రాష్ట్రం పేరు

విడుదలైన నిధులు

(రూలక్షలలో)

కవర్ చేసిన విస్తీర్ణం

(హెక్టార్లలో)

తమిళనాడు

6236.35

32,940

కర్ణాటక

10049.36

49,100

కేరళ

6732.97

94,480

తెలంగాణ

3576.78

8,100

 

పీకేవీవై పథకం కింద రైతులకు సంవత్సరాల కాలానికి ప్రయోజనాలు అందిస్తారు. 2024-25 కాలానికి కర్ణాటకలో 11,630 మంది రైతులుతమిళనాడులో 28,983 మంది రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందారుఅయితే2024-25 కాలానికి కేరళతెలంగాణ రాష్ట్రాలకు నిధులు కేటాయించినా ఎటువంటి ఖర్చు చేయలేదుఈ కారణంగా రైతులెవరూ ప్రయోజనం పొందలేదు.

గత మూడు సంవత్సరాలతో పాటు ప్రస్తుత సంవత్సరం పీకేవీవై పథకం కింద తమిళనాడుకర్ణాటకకేరళతెలంగాణకు కేటాయించిన నిధుల (కేంద్ర వాటావివరాలు కింది విధంగా ఉన్నాయి:

రాష్ట్రం పేరు

కేటాయింపు (రూలక్షల్లో)

2022-23

2023-24

2024-25

2025-26

తమిళనాడు

704.87

1564.00

1620.00

1556.00

కర్ణాటక

1045.61

2803.00

1950.00

1769.00

కేరళ

1712.07

1047.00

782.60

1199.00

తెలంగాణ

30.75

568.00

424.60

1989.00

 

గమనికపీకేవీవైలో భాగంగా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం కేరళ రాష్ట్రం భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి (బీపీకేపీ)ని అమలు చేస్తోంది.

ఈ సమాచారాన్ని వ్యవసాయరైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్‌నాథ్ ఠాకూర్ ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

*** 


(रिलीज़ आईडी: 2203360) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी