నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వారణాసిలో భారత తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ నౌక ప్రయాణికుల సేవలను ప్రారంభించిన సర్బానంద సోనోవాల్

నికర-సున్నా ఉద్గారాల జలరవాణా దిశగా మోదీ ప్రభుత్వ ప్రధాన ముందడుగు

గంగానదిపై హైడ్రోజన్-ఇంధనంతో సాగిన ప్రయాణికుల నౌక

50 సీట్ల సామర్థ్యంతో సున్నా-ఉద్గారాలు, దేశీయ 24-మీటర్ల క్లీన్ ప్రొపల్షన్ తో సాగే

తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కాటమరాన్ నౌక

प्रविष्टि तिथि: 11 DEC 2025 5:22PM by PIB Hyderabad

పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాల్లో భారత్ మరో విజయ ప్రస్థానాన్ని అందుకుందిఈరోజు వారణాసిలోని నమో ఘాట్‌లో పూర్తి దేశీయ తొలి హైడ్రోజన్ ఆధారిత నౌక వాణిజ్య కార్యకలాపాలను కేంద్ర నౌకాశ్రయాలునౌకాయానంజలరవాణా మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు.

 

దేశ సముద్ర రంగంలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌తో నడిచే పూర్తి స్వదేశీ సాంకేతికతను ఈ నౌక కలిగి ఉందిఇది తక్కువ ఉష్ణోగ్రత గల ప్రోటాన్ ఎక్స్‌చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ వ్యవస్థ ఆధారంగా పనిచేస్తూ నిల్వ చేసిన హైడ్రోజన్‌ను విద్యుత్తుగా మారుస్తుందిఈ ప్రక్రియలో నీటిని మాత్రమే ఇది విడుదల చేస్తుంది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ, “ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చైతన్యవంతమైనదార్శనిక నాయకత్వంలో భారత్ పరిశుద్ధమైనసుస్థిరమైనస్వయం-సమృద్ధి గల రవాణా వ్యవస్థ దిశగా పరివర్తనాత్మక మార్పును సాధిస్తోందిమన తొలి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ నౌక ప్రారంభం... మేక్ ఇన్ ఇండియా పట్ల ప్రధానమంత్రి నిబద్ధతకుఅన్ని రంగాల్లో హరిత ఇంధన రవాణా వ్యవస్థ దిశగా వస్తున్న పరివర్తనకు ఒక చక్కని ఉదాహరణఈ విజయం మన పవిత్ర గంగానదిని పునరుజ్జీవింపజేసేసంరక్షించే విస్తృత లక్ష్యాన్నీ బలపరుస్తుందిమన జలరవాణాలో హరిత సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నప్పుడు... ఆవిష్కరణలను ప్రోత్సహించడమే కాకుండా అభివృద్ధిని పర్యావరణ బాధ్యతతో కలిసి ఉండేలా మేం చూసుకుంటున్నాంమన దేశానికి హరితసుసంపన్న సముద్ర భవిష్యత్తును నిర్మించాలనే ప్రధానమంత్రి అచంచలమైన సంకల్పాన్ని నేటి విజయం ప్రతిబింబిస్తుంది” అన్నారు.

 

ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యాజమాన్యంలో ఈ నౌకను కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించిందిపరీక్షలు పూర్తయిన తర్వాత ఈ నౌక నేటి నుంచీ తన సేవల్ని అందిస్తోంది. 2070 నాటికి నికర-సున్నా ఉద్గారాలను చేరుకోవాలనే ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ఈ నౌక ప్రారంభం... దేశంలోని లోతట్టు జలమార్గాల్లో పరిశుద్ధసుస్థిర ఇంధనాలను అభివృద్ధి చేయు మంత్రిత్వ శాఖ ప్రయత్నాలకు మద్దతునిస్తుంది.

 

హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ నౌక వాణిజ్య సేవల ప్రారంభం... పరిశుద్ధసుస్థిర సముద్ర రంగాన్ని నిర్మించే ప్రయత్నంలో కీలక ముందడుగును సూచిస్తుందిప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకేంద్ర మంత్రి సోనోవాల్‌ల నాయకత్వంలో ఐడబ్ల్యూఏఐ మారిటైమ్ ఇండియా విజన్ 2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047లో భాగంగా అధునాతన పర్యావరణ సాంకేతికతలుప్రత్యామ్నాయ ఇంధనాల అమలును ప్రోత్సహిస్తోంది.

 

ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ నౌకను విజయవంతంగా ప్రారంభించడం... పరిశుద్ధసుస్థిర జలరవాణా దిశగా భారత పరివర్తనను వేగవంతం చేయడం పట్ల మంత్రిత్వ శాఖ లోతైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందిఈ మార్గదర్శక నౌకను అందించిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌నుకఠినమైన పరీక్షల తర్వాత దీనిని వాణిజ్య సేవలలోకి తీసుకున్న ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీని నేను అభినందిస్తున్నాను. 2070 నాటికి భారత్ నికర-సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలనేఅంతర్గత జల రవాణా రంగంలో అత్యాధునిక హరిత సాంకేతికతలను ఏకీకృతం చేయాలనే మా సంకల్పానికి ఈ విజయం నిదర్శనంప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పరివర్తనాత్మక మారిటైమ్ ఇండియా విజన్ 2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 దీర్ఘకాలిక రోడ్‌మ్యాప్ మార్గనిర్దేశంలో దేశం కోసం ఆధునికఇంధన-సమర్థ వినియోగంపర్యావరణ బాధ్యతతో కూడిన సముద్ర రంగాన్ని స్థిరంగా రూపొందిస్తున్నాం” అని శ్రీ సోనోవాల్ పేర్కొన్నారు.

 

పట్టణ రవాణా కోసం 24 మీటర్ల కాటమరాన్‌గా రూపొందించిన ఈ నౌక ఎయిర్ కండిషన్ గల క్యాబిన్‌లో 50 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదుఇది 6.5 నాట్ల వేగంతో నడుస్తుందిదీని హైబ్రిడ్ ఎనర్జీ సిస్టమ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్బ్యాటరీలుసౌర శక్తిని మిళితం చేస్తుందిఒకే హైడ్రోజన్ ఫిల్‌పై ఎనిమిది గంటల వరకు పనిచేయడానికి ఇది వీలు కల్పిస్తుందిఈ నౌకను ఇండియన్ షిప్పింగ్ రిజిస్టర్ ధ్రువీకరించింది.

 

పైలట్ నౌక ఎఫ్‌సీవీ పైలట్-01 కార్యకలాపాలను ప్రారంభించడం కోసం ఐడబ్ల్యూఏఐకొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ఇన్‌ల్యాండ్ కోస్టల్ షిప్పింగ్ లిమిటెడ్‌లు సాంకేతిక మద్దతుకార్యకలాపాలుపర్యవేక్షణకు సంబంధించిన త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం చేశాయిఈ ఒప్పందంలో ఆర్థిక నిబంధనలుభద్రతా విధానాలుపర్యవేక్షణ విధానాలుపైలట్ దశలో కాలానుగుణ తనిఖీలకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి.

 

వారణాసిలో ప్రారంభించిన హైడ్రోజన్ ఆధారిత నౌక పట్టణ జల రవాణాకు అనేక కీలక ప్రయోజనాలను అందిస్తుందివాటిలో ప్రయాణికులుయాత్రికులకు శబ్ద రహిత ప్రయాణంఉద్గారాలుగా నీటిని మాత్రమే అందిస్తూ పొగకాలుష్యం లేకుండా జలమార్గాల ద్వారా వేగవంతమైన ప్రయాణంరహదారిపై రద్దీని తగ్గించడం వంటివి ఈ ప్రయోజనాల్లో భాగంగా ఉన్నాయిఇది స్థానికంగా పర్యాటకంఉద్యోగ అవకాశాలను పెంపొందించడంతో పాటుహైడ్రోజన్-ఇంధనంతో నడిచే ప్రయాణికుల రవాణాను అమలు చేస్తున్న ప్రపంచంలోనే తొలి నగరంగా వారణాసిని నిలుపుతుందని భావిస్తున్నారుసాంకేతికంగాపూర్తిగా ఎయిర్ కండిషన్‌తో గల 50-సీట్ల ఈ నౌక నిల్వ చేసిన హైడ్రోజన్‌పై ఎనిమిది గంటల పాటు నుంచి నాట్ల వేగంతో నడుస్తుందిసురక్షితమైనసమర్థమైన కార్యకలాపాలను నిర్ధారిస్తూ స్వదేశీపర్యావరణ హితమైన సాంకేతికత ద్వారా పనిచేస్తుంది.

 

ఈ నౌక తన తొలి ప్రయాణంలో నమో ఘాట్ నుంచి లలితా ఘాట్ వరకు ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించిందిగంగా నదిపై హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఈ ప్రయాణికుల నౌక (జాతీయ జలమార్గాలు 1) వాణిజ్య కార్యకలాపాల ప్రారంభాన్ని సూచిస్తూ మంత్రులుసీనియర్ అధికారులతో పాటు ఇతరులతో కూడిన పరివారాన్ని విజయవంతంగా తీసుకెళ్లింది.

 

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి సహాయ మంత్రి (స్వతంత్రరవీంద్ర జైస్వాల్రవాణా మంత్రి దయాశంకర్ సింగ్సహాయ మంత్రి (స్వతంత్రడాక్టర్ దయాశంకర్ మిశ్రా 'దయాలువంటి ప్రముఖ నాయకులు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ వెంట ఉన్నారువారణాసి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అశోక్ కుమార్ తివారీఎమ్మెల్యేలు అవధేష్ సింగ్నీల్కాంత్ తివారీడాక్టర్ సునీల్ పటేల్సౌరభ్ శ్రీవాస్తవఅనిల్ రాజ్‌భర్నీల్ రతన్ సింగ్త్రిభువన్ రామ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారుఐఏఎస్ఎమ్ఓపీఎస్‌డబ్ల్యూ కార్యదర్శి విజయ్ కుమార్... ఐడబ్ల్యూఏఐ చైర్మన్ఐఏఎస్ సునీల్ పలివాల్... మంత్రిత్వ శాఖఐడబ్ల్యూఏఐఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన పలువురు సీనియర్ అధికారులూ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కాటమరాన్‌లను ప్రవేశపెట్టిన తర్వాత... ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ నౌకను ప్రారంభించడం దేశ అంతర్గత జల రవాణా వ్యవస్థను ఆధునికీకరించడంపర్యావరణ హితం కోసం ఐడబ్ల్యూఏఐ దీర్ఘకాలిక ప్రణాళికను మరింత బలోపేతం చేస్తోంది.

 

****


(रिलीज़ आईडी: 2202668) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese