రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తిరుపతి-సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన శ్రీ వీ సోమన్న


ఈ కొత్త రైలు ఆధ్యాత్మిక పర్యాటకం, ఆర్థిక కార్యకలాపాలు, ప్రాంతీయాభివృద్ధిని ప్రోత్సహిస్తుంది
ప్రాంతాలను, సంస్కృతులను అనుసంధానిస్తూ.. దేశానికి జీవనాడిగా భారతీయ రైల్వేలు పనిచేస్తున్నాయి: వీ సోమన్న

प्रविष्टि तिथि: 09 DEC 2025 1:57PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని రైల్ భవన్ నుంచి తిరుపతి-సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ను కేంద్ర రైల్వేజలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ వీ సోమన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు ప్రారంభించారు.

 

తిరుపతి-సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభంతో నాలుగు రాష్ట్రాలుఆంధ్రప్రదేశ్తెలంగాణకర్ణాటకమహారాష్ట్రలో రైలు సౌకర్యం గణనీయంగా మెరుగుపడిదూర ప్రాంతాలకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుందిఇది ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా ప్రాంతం నుంచి షిర్డీ చేరుకొనేలా భక్తుల కోసం ప్రారంభించిన మొదటి రైలుభారత్‌లో రెండు ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలైన తిరుపతిషిర్డీలను నేరుగా అనుసంధానించడం ద్వారా భక్తులకు సౌకర్యాలను మెరుగుపరిచింది.

ఈ కొత్త రైలు.. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెంపొందిస్తుందనిఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తుందనిప్రాంతీయాభివృద్ధికి తోడ్పడుతుందని అంచనా వేస్తున్నారుఅదనంగా ప్రయాణికులకు సురక్షితమైనసౌకర్యవంతమైనఎలాంటి అవరోధాలు లేని అంతరాష్ట్ర ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుందిఅలాగే భక్తులకు యాత్రానుభవాన్ని మెరుగుపరుస్తుందివారానికోసారి నడిచే ఈ రైలు ఇరువైపులా దాదాపు 30 గంటల ప్రయాణించి.. భక్తులకు ప్రయాణ సౌలభ్యాన్ని అందిస్తుంది.

తిరుపతి-సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమవడం నాలుగు రాష్ట్రాల భక్తులకు చరిత్రాత్మక రోజని శ్రీ వీ సోమన్న అన్నారుభారతీయ రైల్వేలు రవాణా మాధ్యమంగా మాత్రమే తన పరిధిని పరిమితం చేసుకోలేదనిప్రాంతాలనుసంస్కృతులను అనుసంధానిస్తూ.. దేశానికి జీవనాడిగా పనిచేస్తున్నాయని తెలియజేశారు.

తిరుపతిషిర్డీ లను నేరుగా అనుసంధానించే ఈ రైలు నెల్లూరుగుంటూరుసికింద్రాబాద్బీదర్మన్మాడ్ సహా 31 ముఖ్యమైన స్టాపుల్లో ఆగుతుందని శ్రీ వీ సోమన్న తెలిపారుఈ మార్గంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక పర్యాటకాన్నిరవాణా సదుపాయాన్నిఆర్థిక కార్యకలాపాలను మెరుగుపరుస్తుందిమహారాష్ట్రఉత్తర కర్ణాటకసికింద్రాబాద్‌కు నేరుగా ప్రయాణ సౌకర్యాన్ని ఈ రైలు అందిస్తుందివీటితో పాటుగాప్రముఖ శైవ క్షేత్రం పర్లి వైజ‌నాథ్‌ను కూడా కలుపుతుంది.

2014 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ధి చెందాయని కేంద్ర మంత్రి అన్నారు. 2009 -14 మధ్య కాలంలో ఏపీతెలంగాణల సరాసరి రైలు బడ్జెట్ రూ.886 కోట్లు ఉండగా, 2025-26 నాటికి రూ. 9,417 కోట్లకు అంటే పదకొండు రెట్లు పెరిగిందని వివరించారురాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల విలువ రూ. 93,000 కోట్లకు పైగా ఉంది. 2014 నుంచి, 100 శాతం విద్యుద్దీకరణ పూర్తయిన 1,580 కి.మీ.ల రైల్వే ట్రాకులను ఆంధ్రప్రదేశ్ జోడించిందిఈ రాష్ట్రంలో 73 అమృత్ స్టేషన్లు (రూ.3,125 కోట్లుఉన్నాయి. 800 ఫ్లైఓవర్లనుబ్రిడ్జిలను నిర్మించామని, 110 లిఫ్టులు, 40 ఎస్కలేటర్లను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారువీటితో పాటుగా 16 వందే భారత్ (8 జతలు), 6 అమృత్ భారత్ (3 జతలురైలు సర్వీసులను ప్రారంభించామని వెల్లడించారు.

తిరుపతిలో రూ. 312 కోట్ల విలువైన అమృత్ స్టేషన్‌తో సహా వివిధ ప్రాజెక్టులను భారతీయ రైల్వే చేపడుతోందని వీ సోమన్న వెల్లడించారుపనులు జరుగుతున్న ప్రాజెక్టుల్లో రూ.1,215 కోట్ల విలువైన 105 కి.మీ.ల తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్రూ. 875 కోట్ల వ్యయంతో 83 కి.మీ.ల గూడూరు-రేణిగుంట మూడో లైనురూ.5,900 కోట్ల వ్యయంతో 310 కి.మీ.ల నడికుడి-శ్రీకాళహస్తి కొత్త లైను ఉన్నాయిఅదనంగా రూ. 6,235 కోట్ల ఖర్చయ్యే 287 కి.మీ.ల విజయవాడ-గూడూరు మూడో లైనురూ. 490 కోట్ల విలువైన 25 కి.మీ.ల ఏర్పేడు-పూడి బైపాస్ లైన్ పనులు కొనసాగుతున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రోడ్లుభవనాలుమౌలిక వసతులుపెట్టుబడుల శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్థన్ రెడ్డి గౌరవ అతిథిగా పాల్గొన్నారుతిరుపతి పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మద్దిల గురుమూర్తిశాసనమండలి సభ్యుడు శ్రీ బీ కల్యాణ చక్రవర్తితిరుపతి శాసనసభ సభ్యులు శ్రీ ఏ శ్రీనివాసులుటీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాశ్ రెడ్డిఇతర అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2201194) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil , Kannada