రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వృద్ధులు, 45 ఏళ్ల వయసు అంతకన్నా పైబడిన మహిళలకు ఆటోమేటిక్‌గా దిగువ బెర్తుల కేటాయింపు


వృద్ధులు, 45 ఏళ్లు పైబడిన మహిళా ప్రయాణికులు, గర్భిణీ స్త్రీలకు కేటాయించిన దిగువ బెర్తుల కోటా.. 6 నుంచి 7 స్లీపర్ క్లాస్, 4 నుంచి 5- 3ఏసీ, 3 నుంచి 4- 2ఏసీ క్లాస్ బెర్తులు

దాదాపు అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో దివ్యాంగులకు ప్రత్యేక కంపార్టుమెంట్లు

వందేభారత్ రైళ్లలో మొదటి, చివరి కోచ్‌లలో వీల్ ఛైర్ కోసం స్థలాలతో పాటు దివ్యాంగులకు అనుకూలంగా మరుగుదొడ్ల సౌకర్యం

प्रविष्टि तिथि: 05 DEC 2025 4:27PM by PIB Hyderabad

వృద్ధులుదివ్యాంగులతో సహా ప్రయాణికుల సౌకర్యార్థం పలు సదుపాయాల కల్పనకు భారతీయ రైల్వేలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయివృద్ధులుదివ్యాంగులకు కల్పించిన కొన్ని సదుపాయాల జాబితా:

1. ప్రత్యేకంగా ఎంచుకోకపోయినాలభ్యతను బట్టి వృద్ధులు.. 45 ఏళ్లుఅంతకన్నా ఎక్కువ వయసున్న మహిళా ప్రయాణికులకు ఆటోమేటిక్‌గా దిగువ బెర్తులు కేటాయిస్తారు.

2. వృద్ధులు.. 45 ఏళ్లుఅంతకన్నా ఎక్కువ వయసున్న మహిళా ప్రయాణికులుగర్భిణీలకు స్లీపర్ క్లాస్ కోచ్‌లో నుంచి బెర్తులు,3ఏసీక్లాస్‌లో నుంచి 5, 2ఏసీ క్లాస్‌లో నుంచి బెర్తులు (రైలులో ఆయా తరగతుల కోచ్‌లు ఎన్ని ఉన్నాయనే దానిపై ఆధారపడి ఈ బెర్తుల సంఖ్య ఉంటుందిప్రత్యేక కోటా ద్వారా కేటాయిస్తారు.

3. రాజధానిశతాబ్ధి వంటి రైళ్లతో సహా అన్ని మెయిల్ఎక్స్‌ప్రెస్ రైళ్లలో దివ్యాంగులువారి సహాయకులకు రిజర్వేషన్ కోటాను ఈ విధంగా అమలుచేస్తారు.

  • స్లీపర్ క్లాస్‌లో నాలుగు బెర్తులు (ఇందులో రెండు దిగువరెండు మధ్యనుండే బెర్తులు)

  • 3ఏసీ, 3ఈ క్లాస్‌లో నాలుగు బెర్తులు (ఇందులో రెండు దిగువరెండు మధ్య బెర్తులు)

  • రిజర్వ్ చేసిన సెకండ్ సిట్టింగ్ (2ఎస్), ఏసీ చైర్ కార్ (సీసీ)లో నాలుగు సీట్లు

4. రైలులో ఖాళీ దిగువ బెర్తులను వృద్ధులుదివ్యాంగులుగర్భిణీలకు (వీరికి అప్పటికే మధ్యపైన బెర్తులు కేటాయించి ఉంటేప్రాధాన్యతపై కేటాయిస్తారు.

భద్రతప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు వివిధ రకాల కోచ్‌లను రూపొందించిఅభివృద్ధి చేశారురిజర్వ్ చేసిన కోచ్‌లలో ప్రవేశంనిష్క్రమణ ద్వారాలను గుర్తుల ద్వారా సూచిస్తారు. 'ప్రవేశం’, 'నిష్క్రమణ'ను సూచించే బోర్డులు ప్రయాణికులు ప్రవేశించే ద్వారం వద్ద అందుబాటులో ఉంటాయిజనరల్ కోచ్‌లలో ఏ ద్వారం నుంచైనా ప్రవేశించినిష్క్రమించవచ్చు.

ప్రయాణికుల సౌలభ్యంసౌకర్యాన్ని పెంచాలన్న లక్ష్యంతో భారతీయ రైల్వే అనేక రకాల సదుపాయాలను కల్పిస్తుందిఅవి:

1. దాదాపు అన్ని మెయిల్ఎక్స్‌ప్రెస్ రైళ్లలో దివ్యాంగులకు ప్రత్యేకంగా కేటాయించిన బోగీ ఉంటుందివెడల్పయిన ప్రవేశ ద్వారాలుబెర్తులుకంపార్టుమెంట్లువెడల్పయిన ద్వారాలు గల మరుగుదొడ్లువీల్ ఛైర్ పార్కింగ్ స్థలాలతో పాటు మరుగుదొడ్ల లోపల ఆసరా కోసం పట్టుకునే చేతి కడ్డీలుతగిన ఎత్తులో వాష్ బేసిన్అద్దం వంటి అదనపు సౌకర్యాలుంటాయి.

2. దృష్టి లోపం ఉన్న ప్రయాణికుల సౌకర్యార్థంసాధారణ సంకేతాలపై బ్రెయిలీ లిపిని జోడించిసమగ్ర బ్రెయిలీ సంకేతాలను అందుబాటులో ఉంచారు.

3. దివ్యాంగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక అమృత్ భారత్వందే భారత్ రైళ్లను రూపొందించారువందే భారత్ రైలు మొదటిచివరి కోచ్‌లలో వీల్ ఛైర్ కోసం ప్రత్యేక స్థలందివ్యాంగులకు అనుకూలంగా ఉండే విశాలమైన మరుగుదొడ్లు ఉన్నాయివందే భారత్ రైలు కోచ్అమృత్ భారత్ రైలులోని లగేజీ-కమ్-దివ్యాంగుల కోచ్‌లలో సులభంగా ఎక్కటానికిదిగటానికి వీలుగా దివ్యాంగులకు మాడ్యులర్ ర్యాంపు ఏర్పాటు చేశారు.

ఇవాళ రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖసమాచారప్రసార మంత్రిత్వ శాఖఎలక్ట్రానిక్స్ఐటీ శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ సమాచారాన్ని లిఖితపూర్వకంగా అందించారు.

 

***


(रिलीज़ आईडी: 2199664) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Bengali , Kannada , Urdu