వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ మార్కెట్లలో గిరిజన ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధం: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి


గిరిజన వర్గాలకు సాధికారత కల్పించేందుకు, వారి చేతివృత్తి నైపుణ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించడానికి సంయుక్తంగా కృషి చేయాలని కోరిన శ్రీ పీయూష్ గోయల్

‘వన్ ధన్ నుంచి వ్యాపార్ ధన్’గా పరివర్తన చెందాలన్న శ్రీ పీయూష్ గోయల్

Posted On: 12 NOV 2025 7:25PM by PIB Hyderabad

ఎగుమతి సామర్థ్యం ఉన్న అన్ని గిరిజన ఉత్పత్తులకు ఈ-కామర్స్ వేదికలువస్తు ప్రదర్శన అమ్మకాలకు సంబంధించిన అంతర్జాతీయ సౌకర్యాలుటోకురిటైల్ వాణిజ్య వ్యవస్థలతో సహా వివిధ మార్గాల ద్వారా వాణిజ్య శాఖ నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని కేంద్ర వాణిజ్యపరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ తెలిపారుఈ రోజు ఢిల్లీలో జరిగిన గిరిజన వ్యాపార సమ్మేళనం- 2025లో ఈ మేరకు వ్యాఖ్యానించారుఈ కార్యక్రమానికి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ జువాల్ ఓరం కూడా హాజరయ్యారు

గిరిజన వ్యవహారాలుసాంస్కృతిక మంత్రిత్వ శాఖల సహకారంతో వాణిజ్యపరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పరిశ్రమలఅంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీఈ సమ్మేళనాన్ని నిర్వహించిందిబిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తోన్న జనజాతీయ గౌరవ్ వర్ష్‌‌ సమయంలో చేపట్టిన ఈ సమ్మేళనం ఒక కీలక ఘట్టంగా నిలిచిపోతుంది

దేశీయప్రపంచ మార్కెట్లలో గిరిజన ఉత్పత్తులకు సరియైన గుర్తింపుమార్కెట్ అవకాశాలను పొందేలా చూసుకునేందుకు ఎగుమతి ప్రోత్సాహక కార్యక్రమాలను బలపేతం చేయటానికి ఒక పథకాన్ని తయారు చేస్తున్నట్లు వాణిజ్య శాఖ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.

దేశీయఅంతర్జాతీయ మార్కెట్లు.. గిరిజన వస్తువులుచేతిపనులకు అపారమైన అవకాశాలను అందిస్తున్నాయని పీయూష్ గోయల్ అన్నారురాబోయే సంవత్సరాల్లో ఈ సామర్థ్యాన్ని వినియోగించుకునేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు

గిరిజనులు అభివృద్ధి చెందినప్పుడే దేశం నిజంగా స్వయంసమృద్ధిగా మారుతుందని ప్రధానమంత్రి విశ్వసిస్తున్నారని మంత్రి ఉద్ఘాటించారుగిరిజనమారుమూల ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ ప్రగతి ఫలాలు అందేలా చూడటంలోనే భారతదేశ వృద్ధిఅభివృద్ధి ఆధారపడి ఉందని ఆయన అన్నారుగిరిజనదేశీయ వర్గాల అభ్యున్నతి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన అంశంగా ఉందన్న ఆయన.. ఇది సమ్మిళితసుస్థిర అభివృద్ధి విషయంలో ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తోందని పీయూష్ గోయల్ పునరుద్ఘాటించారు

బిర్సా ముండాకు నివాళులర్పించిన కేంద్ర మంత్రి.. ఆయన గిరిజన సమాజానికి దిశనిర్దేశం చేయటంతో పాటు నాయకత్వాన్ని చూపించారని అన్నారుగిరిజన సమాజాన్ని ఉద్ధరించడానికిజీవనోపాధిని పెంచేందుకుప్రతి గిరిజన కుటుంబం సంతోషం శ్రేయస్సుతో నిండి ఉండేలా చూసుకునే విషయంలో భారతదేశం బిర్సా ముండా జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని.. ఆయన అడుగుజాడల్లో నడవాలని అన్నారు. ‘మన భూమిమన రాజ్యం’ అనే బిర్సా ముండా మాటలను పీయూష్ గోయల్ గుర్తు చేశారుచరిత్రలో గిరిజన సమాజం అపారమైన కష్టనష్టాలను ఎదుర్కొందని అన్నారు

అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ విలువలుహస్తకళలుసంప్రదాయ నైపుణ్యాలను పరిరక్షించుకున్నందుకు గిరిజన సమాజాన్ని కేంద్ర వాణిజ్యపరిశ్రమల శాఖ మంత్రి ప్రశంసించారుస్థిరత్వంఅంకితభావం ద్వారా గిరిజన వర్గాలు చరిత్రవారసత్వాన్ని సజీవంగా ఉంచిన విధానం నిజంగా ప్రశంసనీయం అన్నరుగిరిజన సమాజానికి ఉన్న శక్తిదృఢ సంకల్పం పట్ల ప్రగాఢ గౌరవంతో ఉన్నట్లు తెలిపారుభారతదేశ సాంస్కృతికసామాజిక నిర్మాణానికి గిరిజన వర్గాల సహకారం అమూల్యమైందని పేర్కొన్నారు.

గిరిజనదేశీయ ఉత్పత్తుల వాణిజ్యంవ్యాపారాన్ని ప్రోత్సహించడంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖవాణిజ్య విభాగం సంయుక్తంగా కీలకమైన పాత్ర పోషించాయని పీయూష్ గోయల్ తెలిపారుపాఠశాలలుకళాశాలలువిశ్వవిద్యాలయాలువాణిజ్య సంస్థలుప్రభుత్వ సంస్థలు కలిసి దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాల నుంచి నాణ్యమైన గిరిజన ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్‌లువినియోగదారులకు చేరేలా చూశాయని ఆయన అన్నారు

గిరిజన సంక్షేమాన్ని మెరుగుపరచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వివిధ పథకాలుకార్యక్రమాలను అమలు చేసిందని వాణిజ్యపరిశ్రమల శాఖ మంత్రి ప్రధానంగా చెప్పారుభారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము దేశంతో పాటు గిరిజన సమాజానికి గర్వకారణమైన సమర్థవంతమైన ప్రతినిధిగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 3900 వన్ ధన్ కేంద్రాలు 12 లక్షల గిరిజనుల అభ్యున్నతికి ఉత్ప్రేరకాలుగా పనిచేశాయని అన్నారు

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఈ సంవత్సరం బడ్జెట్ కేటాయింపును 50 శాతం పెంచినట్లు పీయూష్ గోయల్ తెలిపారుపీఎం-జన్మన్ యోజన కింద అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాలకు చెందిన దాదాపు 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయన్న ఆయన.. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రూ. 24000 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు

మూలాలుసంస్కృతిసంప్రదాయాల పట్ల భారతదేశంలోని గిరిజన సమాజం అత్యంత గర్వంగా ఉందని కేంద్ర వాణిజ్యపరిశ్రమల శాఖ మంత్రి అన్నారుమరిన్ని గిరిజన ఉత్పత్తులను నమోదు చేయటాన్ని పెంచేందుకు.. గిరిజిన హస్తకళలువారసత్వం ద్వారా దేశ చరిత్ర సంప్రదాయాలు పరిరక్షణను చేపట్టేందుకు భౌగోళిక గుర్తింపుకు (జీఐసంబంధించి రుసుంను రూ.  5000 నుంచి రూ. 1000కి… అంటే 80 శాతం తగ్గించినట్లు తెలిపారు.

వన్ ధన్ నుంచి వ్యాపార్ ధన్‘గా పరివర్తన చెందాలని పీయూష్ గోయల్ పిలుపునిచ్చారుగిరిజనదేశీయ ఉత్పత్తులు అంతర్జాతీయ వేదికలకు చేరుకోవాలని.. తద్వారా ‘స్థానిక వస్తువుల ప్రపంచీకరణ‘ అనే దార్శనికతను నిజం చేయాలని అన్నారుగిరిజన వర్గాలకు సాధికారత కల్పించడంవారి చేతివృత్తి నైపుణ్యాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించటం అనే ఈ ఉమ్మడి లక్ష్యాన్ని సాధించేందుకు భాగస్వాములందరితో కలిసి పనిచేయాలని కోరారు.

ఈ సమ్మేళనానికి ఫిక్కీ పరిశ్రమ భాగస్వామిగాప్రయోగి విజ్ఞాన భాగస్వామిగా ఉన్నాయివికసిత భారత్ 2047 కోసం దేశ అభివృద్ధి ఎజెండాలో గిరిజన వ్యాపారాన్ని ప్రధాన బిందువుగా ఉంచాలని తెలియజేసిన ఈ కార్యక్రమం గిరిజనుల స్థిరత్వంసృజనాత్మకతను వేడుక చేసింది.

ఈ కార్యక్రమంలో 250కి పైగా గిరిజన సంస్థలు పాల్గొన్నాయి. 150 మంది ఎగ్జిబిటర్లు, 100కి పైగా గిరిజన అంకురాలు ఆవిష్కరణలను “రూట్స్ టు రైజ్” పిచ్చింగ్ వేదికలో ప్రదర్శించాయిపారిశ్రామికవేత్తలుపెట్టుబడిదారులుకార్పొరేట్‌ సంస్థలుప్రభుత్వ కొనుగోలుదారుల మధ్య ప్రత్యక్ష అనుసంధానతను కల్పించిన ఈ కార్యక్రమం.. సహకారంవృద్ధికి సంబంధించిన ఒక సజీవ వ్యవస్థను సృష్టించింది

ఈ సమ్మేళనంలో ఆరు అత్యున్నత ప్రభావవంతమైన ప్యానెల్ చర్చలునాలుగు మాస్టర్‌క్లాస్‌లు నిర్వహించారుఇందులో ప్రభుత్వంవిద్యా రంగంపరిశ్రమలకు చెందిన 50 మందికి పైగా ప్రముఖులు పాల్గొన్నారుఈ సెషన్‌లు..  పెట్టుబడి భాగస్వామ్యాలునైపుణ్యం సాధికారతసుస్థిరత భౌగోళిక గుర్తింపుబ్రాండింగ్ మార్కెట్ ఆవిష్కరణ వంటి అంశాలపై దృష్టి సారించాయి

గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ మార్కెట్ల వరకు గిరిజన వాణిజ్య కార్యకలాపాలను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో మార్కెట్ సదుపాయంనైపుణ్యాభివృద్ధివిధాన సిఫార్సుల కోసం కార్యాచరణ మార్గాలను తయారుచేసేందుకు కొనుగోలుదారు-అమ్మకందారుల సమావేశాలను కూడా నిర్వహించారు

గిరిజన భారత్ 2047: సంస్కృతిని నిలబెట్టడంవాణిజ్యాన్ని విస్తరించడం’ అనే ఇతివృత్తం కింద ఒక ప్రత్యేక పెవిలియన్సాంస్కృతిక ప్రదర్శనలతో కూడిన కార్యక్రమం గిరిజన వారసత్వాన్ని తెలియజేసింది

సమ్మేళనంలో కీలక ప్రకటనలు:

1. గ్రామ్య యువ అర్థ్ నీతి (గ్యాన్ల్యాబ్ ప్రారంభంవాణిజ్యపరిశ్రమల మంత్రిత్వ శాఖ మద్దతుతో ఐఐటీ బాంబేలోని అశాంక్ దేశాయ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీప్రయోగి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ల్యాబ్ ఇదిక్షేత్రస్థాయి అనుభవంసాంకేతికతవిధానాలను కలిసి పరీక్షించటం ద్వారా గిరిజనగ్రామీణ సంస్థలకు సంబంధించిన కొత్త నమూనాలను రూపొందించటంపై గ్యాన్ ల్యాబ్ పనిచేయనుందివాస్తవ ప్రయోగాలువిధానాలుడిజిటల్ ఆవిష్కరణసామర్థ్య నిర్మాణాల ద్వారా ఇది.. సమ్మిళితసుస్థిర సంస్థల వృద్ధి కోసం అమలు చేయదగిన పరిష్కారాలను తయారుచేస్తుందిరానున్న సంవత్సరంలో గిరిజన వ్యవస్థాపకత సూచికమైక్రో-ఈక్విటీ ఆధారిత ఇంక్యుబేషన్ నమూనాల వంటి ప్రయోగాలను చేపట్టటం ద్వారా ఈ ల్యాబ్.. క్షేత్ర స్థాయిలో నేర్చుకున్న అంశాలను విధాన నిర్ణయాలుగా మార్చేందుకు దోహదపడుతుందిప్రభుత్వంవిద్యా రంగంపరిశ్రమల మధ్య ఈ సహకారం వ్యవస్థాపకతఆవిష్కరణల ద్వారా భారత గిరిజన వర్గాలకు సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన ఒక ప్రధాన ఘట్టంగా ఉంటుంది.

2. గిరిజన వ్యవహారాల గ్రాండ్ ఛాలెంజ్స్టార్టప్ ఇండియాడీపీఐఐటీ సహకారంతో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిని ప్రకటించిందిఇందులో గిరిజన వర్గాల కోసం అత్యంత ప్రభావవంతమైన పరిష్కారాలను రూపొందించడానికి అంకురాలుసంస్థలను అహ్వానిస్తారుతద్వారా వాటికి గుర్తింపుమార్గదర్శకత్వంనిధులు అందుతాయి.

3. రూట్స్ టు రైజ్ పిచ్చింగ్ సెషన్ 

రెండు విడతల పరీక్షల అనంతరం 115 సంస్థలను ఎంపికచేశారువీటిలో 43 సంస్థలకు డీపీఐఐటీ రిజిస్ట్రేషన్ ఉందిఎంపిక చేసిన సంస్థలకు ఇంక్యుబేషన్ మద్దతు అందించేందుకు 10 ఇంక్యుబేటర్లు అంగీకరించాయిఏఐఎఫ్ఏంజెల్ ఇన్వెస్టర్లతో సహా 50 కంటే ఎక్కువ వెంచర్ క్యాపిటలిస్టులు 57 సంస్థల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరిచాయిమొత్తం రూ. 10 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు ఇవి తెలిపాయి

ఐఎఫ్‌సీఐ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ లిమిటెడ్అరోరా వెంచర్ పార్ట్‌నర్స్ వంటి సంస్థలు 33 సంస్థలలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపాయి

ఈ అంకురాలుసంస్థలు సుమారు 1500 ప్రత్యక్ష ఉద్యోగాలను.. 10,000 కంటే ఎక్కువ పరోక్ష ఉద్యోగాలను సృష్టించాయిఇవి వివిధ రంగాలలో మొత్తం 20000 మందికి పైగా గిరిజనులకు సేవలు అందిస్తున్నాయి.

4. ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ (జీఈఎంవేదికపై ఎక్కువ ఆసక్తి కనబర్చటం మరో విశేషం. 60 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లుటీబీసీ ఉత్పత్తుల కోసం 50కి పైగా విచారణలు వచ్చాయి

5. జీఐ ధ్రువపత్రాల పంపిణీదేశవ్యాప్తంగా ఉన్న గిరిజన చేతివృత్తులవారి కళాత్మకతను తెలియజేసేలా ఈ కార్యక్రమంలో భాగంగా భౌగోళిక గుర్తింపు (జీఐధ్రువపత్రాలను పంపిణీ చేశారుకేరళకు చెందిన కన్నాదిప్పాయ (వెదురు చాప), అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన అపటాని వస్త్రాలుతమిళనాడుకు చెందిన మార్తాండం తేనెసిక్కింకు చెందిన లెప్చా తుంగ్‌బుక్అస్సాంకు చెందిన బోడో అరోనైగుజరాత్‌కు చెందిన అంబాజీ తెల్ల పాలరాయిఉత్తరాఖండ్‌కు చెందిన బేడుబద్రీ ఆవు నెయ్యి వంటి చేతిపనులుఉత్పత్తులు ఈ విధంగా తగిన గుర్తింపును పొందాయిఈ గుర్తింపు గిరిజన ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయంబ్రాండ్ విలువ జాతీయ గుర్తింపును పెంచడంలో ఒక కీలక ముందడుగుగా ఉంటుందిఇది చేతివృత్తులవారికి సాధికారత కల్పించటంతో పాటు భారత సుసంపన్నమైన దేశీయ వారసత్వాన్ని పరిరక్షిస్తుంది.

 

***


(Release ID: 2189486) Visitor Counter : 3
Read this release in: English , Urdu , Gujarati , Kannada