ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరాఖండ్ రాష్ట్ర అవతరణ 25వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
Posted On:
09 NOV 2025 9:05AM by PIB Hyderabad
ఉత్తరాఖండ్ రాష్ట్ర అవతరణ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
"ఉత్తరాఖండ్ అవతరణ 25వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నా సమస్త సోదరీసోదరులకు శుభాకాంక్షలు. ప్రకృతి ఒడిలో ఒదిగి ఉన్న మన ఈ దేవభూమి నేడు పర్యాటకంతో పాటు ప్రతి రంగంలోనూ ప్రగతి విషయంలో కొత్త వేగాన్ని అందుకుంటోంది. రాష్ట్రానికి సంబంధించిన ఈ ప్రత్యేక సందర్భంలో ఇక్కడి వినయపూర్వకమైన, కష్టపడి పనిచేసే దైవ సమానులైన ప్రజలకు శ్రేయస్సు, అదృష్టం, ఉత్తమ ఆరోగ్యం కలగాలని నేను కోరుకుంటున్నాను."
(Release ID: 2188159)
Visitor Counter : 2