జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

కర్ణాటకలోని బెంగళూరులో కుమార్తె మరణానంతరం అంబులెన్స్ డ్రైవర్ కు, పోలీసులకు, శ్మశానవాటిక సిబ్బందికి, మున్సిపల్ అధికారులకు ఓ తండ్రి లంచాలు చెల్లించినట్లు వచ్చిన వార్తలను సుమోటోగా విచారణకు స్వీకరించిన ఎన్‌హెచ్ఆర్‌సీ, ఇండియా



ఈ విషయంపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని, కర్ణాటక చీఫ్ సెక్రటరీ,

పోలీసు డైరెక్టర్ జనరల్ కు నోటీసులు జారీ

प्रविष्टि तिथि: 04 NOV 2025 2:50PM by PIB Hyderabad

కర్ణాటకలోని బెంగళూరులో తన ఏకైక కుమార్తెను కోల్పోయి దుఃఖంతో ఉన్న తండ్రి (64).. అంబులెన్స్ డ్రైవర్ కుపోలీసులకుశ్మశానవాటిక సిబ్బందికిమున్సిపల్ అధికారులకు లంచాలు చెల్లించాల్సి వచ్చిందని మీడియాలో వచ్చిన వార్తలను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ), ఇండియా సుమోటోగా విచారణకు స్వీకరించిందిఅక్టోబర్ 30, 2025న మీడియాలో వచ్చిన కథనం ప్రకారంశాంతియుతంగా జరగాల్సిన అంతిమ సంస్కారం కాస్తా.. అవినీతిఅధికారుల నిర్లక్ష్యంఅమానవీయ చర్యలకు నిదర్శనంగా మారింది.

ఒకవేళ వార్తా అంశాలు నిజమైతే, మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని కమిషన్ భావించిందిఈ విషయంపై రెండు వారాల్లోపు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కోరుతూ కర్ణాటక ప్రధాన కార్యదర్శిపోలీసు డైరెక్టర్ జనరల్ కు నోటీసులు జారీ చేసింది.

ఐఐటీ మద్రాస్ఐఐఎం అహ్మదాబాద్‌లో చదువుకున్న ఓ యువతి బెంగుళూరులో పనిచేస్తున్నారుమెదడులో రక్తస్రావం కారణంగా సెప్టెంబర్ 18, 2025న ఆమె మరణించారుకూతురు చనిపోయిన తర్వాతతండ్రి అంబులెన్స్‌కు కాల్ చేయగాసేవలకు గానూ అంబులెన్స్ డ్రైవర్ అధిక ఛార్జీలు వసూలు చేశాడుకూతురి మరణవార్త గురించి పోలీసులకు సమాచారం అందించినప్పుడువాళ్లు దయచూపక పోగాలంచం తీసుకున్న తర్వాతే ఎఫ్ఐఆర్పోస్టుమార్టం రిపోర్టులను అందించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.

మరణించిన యువతి కుటుంబ సభ్యులు, ఆమె కళ్లను దానం చేశారుదహన సంస్కారాలకు లంచం డిమాండ్ చేయగాతండ్రి చెల్లించారుమరణ ధ్రువీకరణ పత్రం జారీ చేయటంలోనూ మహాదేవపుర మున్సిపల్ అధికారులు జాప్యం చేశారుసీనియర్ అధికారి ఈ విషయంలో జోక్యం చేసుకున్నప్పటికీలంచం చెల్లించిన తర్వాతే కుమార్తె మరణ ధ్రువీకరణ పత్రాన్ని తండ్రికి అందించినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.

 
 
***

(रिलीज़ आईडी: 2186522) आगंतुक पटल : 27
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Kannada