ప్రధాన మంత్రి కార్యాలయం
రాజస్థాన్లోని జైపూర్లో ఘోర ప్రమాదం, ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం
పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి నష్టపరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి
Posted On:
03 NOV 2025 5:15PM by PIB Hyderabad
రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మృతుల కుటుంబాలకు జాతీయ ఉపశమన నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ప్రధానమంత్రి నష్ట పరిహారాన్ని ప్రకటించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం “ఎక్స్”లో ఇలా పోస్ట్ చేసింది..
“రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన ప్రమాదం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నాను. ప్రమాదంలో తమ సన్నిహితులను కోల్పోయిన వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 నష్టపరిహారాన్ని అందిస్తాం’’
***
(Release ID: 2186109)
Visitor Counter : 7