ఉప రాష్ట్రపతి సచివాలయం
తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. ప్రాణ నష్టం.. సంతాపం తెలిపిన ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్
प्रविष्टि तिथि:
03 NOV 2025 12:20PM by PIB Hyderabad
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ప్రాణనష్టానికి దారితీసింది. దీనిపై ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
ఈ విషాదసంఘటన ప్రాణనష్టానికి దారితీయడం ఎంతగానో కలచివేసిందని ఒక సందేశంలో ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో బాధితులకూ, వారి కుటుంబాలకూ కలిగిన దు:ఖంలో తాను కూడా పాలుపంచుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు శ్రీ సీపీ రాధాకృష్ణన్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.
(रिलीज़ आईडी: 2185790)
आगंतुक पटल : 32